News November 16, 2024

ఏ రాష్ట్రంలోనూ ఏడాదిలో 50వేల ఉద్యోగాలివ్వలేదు: రేవంత్

image

తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏడాదిలో 50వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును షిండే, అజిత్ పవార్ కాలరాశారని మండిపడ్డారు. చంద్రాపూర్‌లో మహావికాస్ అఘాడీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు.

News November 16, 2024

‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే?

image

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ మూవీకి సీక్వెల్ రానున్నట్లు ఇటీవల హీరో విశ్వక్ ఓ హింట్ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘ENE-2’ 2026లో రిలీజ్ అవుతుందని ఆయన చెప్పినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సినిమాలో అదే టీమ్ కొనసాగుతుందా లేదా కొత్త టీమ్‌ను తీసుకుంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

News November 16, 2024

శిరోమ‌ణి అకాలీదళ్ చీఫ్ రాజీనామా

image

పంజాబ్ ప్రాంతీయ పార్టీ శిరోమ‌ణి అకాలీదళ్ అధ్య‌క్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్ రాజీనామా చేశారు. పార్టీలో ఐదేళ్ల‌కోసారి అధ్య‌క్ష ఎన్నిక‌ జ‌రుగుతుంది. 2019లో ఆయ‌న అధ్య‌క్షుడిగా ఎన్నికై ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. త్వ‌ర‌లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామ‌ని పార్టీ నేత ద‌ల్జీత్ చీమా తెలిపారు. 2007-17 మధ్య ప్ర‌భుత్వంలో ఉండ‌గా బాద‌ల్ మ‌తాచారాల ఉల్లంఘనకు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న‌పై విమ‌ర్శ‌లున్నాయి.

News November 16, 2024

‘పుష్ప-2’ నుంచి ఊర మాస్ పోస్టర్

image

సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. రేపు ఈ చిత్ర ట్రైలర్ బిహార్‌లోని పట్నాలో రిలీజ్ కానుండగా అల్లు అర్జున్ దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.

News November 16, 2024

తమ్ముడి మృతిపై చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

image

AP: తన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందడంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నా తమ్ముడు, చంద్రగిరి మాజీ MLA రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో తెలియచేస్తున్నా. రామ్మూర్తి ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించారు. మా నుంచి దూరమై మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని Xలో ట్వీట్ చేశారు.

News November 16, 2024

ఈ దేశాల నుంచి జాబ్ ఆఫర్ వ‌స్తే జాగ్ర‌త్త‌!

image

Southeast Asia నుంచి, ముఖ్యంగా కంబోడియా, థాయ్‌లాండ్‌, మ‌య‌న్మార్ నుంచి జాబ్ ఆఫర్ వస్తే జాగ్ర‌త్త‌పడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎందుకంటే 2022 నుంచి ఈ దేశాల‌కు వెళ్లిన వారిలో 30 వేల మంది భార‌తీయుల ఆచూకీ లభించకపోవడం క‌ల‌క‌లం రేపుతోంది. ఉద్యోగాల పేరుతో ర‌ప్పించి వీరితో బ‌ల‌వంతంగా సైబ‌ర్ క్రైమ్స్ చేయిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై విచార‌ణ‌కు భార‌త ప్ర‌భుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియ‌మించింది.

News November 16, 2024

ఝాన్సీ ఆస్పత్రి ప్రమాదం: నర్స్ అగ్గిపెట్టె వెలిగించడం వల్లనే?

image

యూపీలోని ఝాన్సీ ఆస్పత్రిలో ఓ నర్సు అగ్గిపెట్టె వెలిగించడం వల్లనే <<14624059>>అగ్ని ప్రమాదం జరిగిందని<<>> భగవాన్ దాస్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ‘ఆ సమయానికి నేను వార్డులోనే ఉన్నాను. ఆక్సిజన్ సిలిండర్ కనెక్షన్ ఇస్తున్న సమయంలో ఓ నర్సు అగ్గిపెట్టెను వెలిగించారు. దీంతో వెంటనే నిప్పు అంటుకుంది. నలుగురు పిల్లల్ని గుడ్డలో చుట్టి బయటికి తీసుకొచ్చేశాను. తర్వాత ఇతరుల సాయంతో మరింతమందిని కాపాడగలిగాం’ అని పేర్కొన్నారు.

News November 16, 2024

నయన్ పోస్ట్‌పై త్వరలోనే స్పందించనున్న ధనుష్!

image

హీరో ధనుష్‌పై హీరోయిన్ నయనతార <<14627063>>సంచలన పోస్ట్ <<>>నేపథ్యంలో ఆయన తరఫు లాయర్ స్పందించారు. హీరోయిన్ పోస్ట్‌కు త్వరలోనే ధనుష్ సమాధానం చెప్తారని పేర్కొన్నారు. కాగా నయనతారపై చేసిన డాక్యుమెంటరీ‌ ట్రైలర్‌లో ఉపయోగించిన 3 సెకన్ల వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులు జారీ చేశారు. దీనిపై నయన్ తీవ్రంగా స్పందిస్తూ పోస్ట్ చేశారు.

News November 16, 2024

చిన్నాన్నతో అనుబంధం మరువలేనిది: లోకేశ్

image

AP: తన చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడి మృతితో మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ అయ్యారు. చిన్నాన్నతో చిన్నప్పటి అనుబంధం కళ్ల ముందే మెదలాడుతోందన్నారు. ‘ఇన్నాళ్లు ఆయన కంటికి కనిపించే ధైర్యం. కానీ ఇకపై చిరకాల జ్ఞాపకం. అంతులేని దుఖంలో ఉన్న పిన్ని, తమ్ముళ్లు ధైర్యంగా ఉండాలి. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

News November 16, 2024

వ్యాక్సిన్ల వ్యతిరేకికి వైద్యశాఖ.. ఫార్మా కంపెనీలకు ప్రతికూలమే!

image

వ్యాక్సిన్ల‌కు బ‌ద్ద‌వ్య‌తిరేకి అయిన రాబ‌ర్ట్ ఎఫ్ కెనెడీను US ఆరోగ్య‌ మంత్రిగా ట్రంప్ నామినేట్ చేయడం భారత ఫార్మా సంస్థలపై ప్రభావం చూపవచ్చని తెలుస్తోంది. 2023-24లో విదేశీ ఎగుమ‌తుల్లో అమెరికాకు భార‌త్ 31% మందులు స‌ర‌ఫ‌రా చేసింది. 2024-25లో US$ 7.2 బిలియ‌న్ల విలువైన మందులను విదేశాలకు భారత్ ఎగుమతి చేసింది. కెనడీ రాక భారత్ సహా ఇతర దేశాల సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం.