India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రముఖ హాలీవుడ్ నటుడు టోనీ రాబర్ట్స్(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన మరణించినట్లు కుమార్తె వెల్లడించారు. ప్లే ఇట్ ఎగైన్, సామ్, రేడియో డేస్, స్టార్ డస్ట్ మెమోరీస్, హన్నా అండ్ హర్ సిస్టర్స్, ద గర్ల్స్ ఇన్ ద ఆఫీస్, కీ ఎక్స్ఛేంజ్, డర్టీ డాన్సింగ్, మై బెస్ట్ ఫ్రెండ్స్ వైఫ్ సహా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన గాయకుడు కూడా.

ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక యమునా నది శుద్ధి ఎక్కడ అంటూ ప్రతిపక్షాలు AAP ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. తాను రివర్స్ కౌంటర్ ఇద్దామని భావించి హరియాణా ప్రభుత్వం యమునా నదిని విషంగా మార్చి సరఫరా చేస్తోందని కేజ్రీవాల్ ప్రచారం చేశారు. ఈ ఆరోపణలపై ఈసీ కూడా AKను వివరణ కోరింది. హరియాణా సీఎం సైనీ ఆ నీటిని తాగి చూపించిన వీడియోను రిలీజ్ చేయడంతో కేజ్రీ ‘విష’ ప్రచారం AAPకే బెడిసికొట్టింది.

కొన్నేళ్లుగా ఢిల్లీలో ఎలాంటి పనులు జరగకపోవడంతోనే AAP ఓడిపోయిందని యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వం పనిచేయకుండా BJP అన్ని విధాలుగా ప్రయత్నించింది. LGతో ఆర్డర్స్ నిలిపివేసి, ఏజెన్సీల ద్వారా తప్పుడు కేసులు పెట్టి నాయకులను జైల్లో పెట్టించింది. పరోక్షంగా BJP పాలించింది. అభివృద్ధి మానేసి మత విద్వేషం పేరుతో ప్రజల బ్రెయిన్ వాష్ చేయడంలో BJP ఇక్కడా విజయం సాధిస్తుందా’ అని ప్రశ్నించారు.

ఇంగ్లండ్తో జరగబోయే రెండో వన్డేలో టీమ్ఇండియా క్రికెటర్ యశస్వీ జైస్వాల్ను తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతారని సమాచారం. కెప్టెన్ రోహిత్తో కలిసి వైస్కెప్టెన్ శుభ్మన్ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారని టాక్. రేపు కటక్లో ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. కాగా తొలివన్డేతోనే జైస్వాల్ అరంగేట్రం చేయగా మోకాలిగాయం కారణంగా కోహ్లీ ఈ మ్యాచ్కు దూరమయ్యారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP ఘన విజయం సాధించింది. దీంతో ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పర్వేశ్ వర్మ, మనోజ్ తివారీ, బన్సూరి స్వరాజ్, విజేందర్ గుప్తా, హరీశ్ ఖురానా, కైలాశ్ గహ్లోత్, వీరేంద్ర సచ్దేవ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్పై గెలిచిన వెంటనే పర్వేశ్ శర్మ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఢిల్లీ ఎన్నికల్లో BJP విజయానికి పెరిగిన ఓటు షేరే కారణం. 32 ఏళ్ల తర్వాత ఆ పార్టీ 47% ఓటుషేర్ సాధించింది. 1993లో 47.82% ఓట్లు పొందిన కాషాయ దళం మళ్లీ 2025లో 47% సాధించడం గమనార్హం. 1998లో 34.02, 2003లో 35.22, 2008లో 36.34, 2013లో 33.00, 2015లో 32.30, 2020లో 38.51 శాతంతోనే సరిపెట్టుకుంది. చివరి రెండు లోక్సభ ఎన్నికల్లో ఎక్కువే పొందినా అసెంబ్లీలో అందుకోకపోవడంతో ఢిల్లీ పీఠం అందని ద్రాక్షగా మారింది.

☞ కాంగ్రెస్తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం
☞ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ సహా కీలక నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర, సంజయ్ తదితర నేతలు జైలుకెళ్లడం
☞ కేజ్రీవాల్ జైలుకెళ్లాక AAPలో నాయకత్వ లోపం
☞ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా మెలగకపోవడం
☞ అభివృద్ధి, చెత్త తొలగించకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించకుండా BJPపై పదేపదే విమర్శలు చేస్తుండటం
☞ పదేళ్ల AAP పాలన చూశాక, బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఓటర్ల ఆలోచన

బంగారం ధరలు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 పెరిగి రూ.79,450లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 పెరగడంతో రూ.86,670 పలుకుతోంది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరోసారి రుజువైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమన్నారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీ ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కనీసం 40% ఓటుషేర్ సంపాదించేది. మాజీ CM షీలాదీక్షిత్ నాయకత్వంలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న పార్టీ. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వరుసగా మూడో సారీ ఖాతా తెరవకుండా హ్యాట్రిక్ డకౌట్ రికార్డు ఖాతాలో వేసుకుంది. క్రితంసారి 3% ఓటుషేర్ సాధించిన హస్తం పార్టీ ఈసారి 7 శాతంతో ఆనందపడాల్సి వస్తోంది. ఆ పార్టీ దుస్థితిపై మీ కామెంట్.
Sorry, no posts matched your criteria.