News November 15, 2024

దేవతలు భూమ్మీదికి దిగొచ్చే ‘దేవ్ దీపావళి’ తెలుసా?

image

భక్తిశ్రద్ధలతో జరుపుకొనే కార్తీక పౌర్ణమినే ఉత్తరాదిలో దేవ్ దీపావళి అంటారు. వర గర్వంతో చావే రాదని విర్రవీగుతూ సజ్జనులను బాధిస్తున్న త్రిపురాసురులను ఆ పరమశివుడు సంహరించింది ఈరోజే. అందుకే ఆ విశ్వేశ్వరుడి దేహంలో ఒక భాగంగా భావించే కాశీ నగరంలో ఈ పండుగను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈసారి గంగాతీరంలో 17లక్షల దీపాలను వెలిగిస్తున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు దేవతలు భూమికి దిగొస్తారని భక్తుల నమ్మిక.

News November 15, 2024

పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. పలువురి మృతి

image

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో నిన్న సాయంత్రం బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులు మృతిచెందారని, 14మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రసూల్ జాన్ అనే తాలిబాన్ ఉగ్రవాది తన ఇంటి వద్ద కారులో బాంబును బిగిస్తుండగా అది పేలిందని పేర్కొన్నారు. తాలిబాన్లు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాల్ని తరలించారని వెల్లడించారు.

News November 15, 2024

రోహిత్ పారిపోయే కెప్టెన్ కాదు: కైఫ్

image

టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ సవాళ్ల నుంచి పారిపోయే కెప్టెన్ కాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించారు. వీలుంటే వెంటనే టెస్టు జట్టుతో చేరేవారని పేర్కొన్నారు. ‘రోహిత్ ఓ నాయకుడు. ఆయనలో పారిపోయే నైజం లేదు. తొలి టెస్టు నుంచే ఆడాలని ఆయన కచ్చితంగా అనుకుంటూ ఉంటారు. అందుకే గైర్హాజరీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇంట్లో పరిస్థితి ఓకే అనుకుంటే వెంటనే పెర్త్‌కు వచ్చేస్తారు’ అని తెలిపారు.

News November 15, 2024

గ్రేప్4 అమలైతే ఢిల్లీ పరిస్థితి ఏంటి?

image

DL రిజిస్ట్రేషన్ గల BS-6 సొంత వాహనాలు, అత్యవసర సరుకు రవాణా కమర్షియల్ వాహనాలనే నగరంలోకి అనుమతిస్తారు. 6-9, 11వ తరగతులకూ <<14615373>>ఆన్‌లైన్ క్లాసులే<<>> ఉండాలని ప్రభుత్వం ప్రకటించే అధికారం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు 50% స్టాఫ్‌నే పిలవాలని ఆదేశించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణ, కూల్చివేత పనుల నిషేధం. కాలుష్యం ఇంకా తీవ్రమైతే అన్ని విద్యాసంస్థలూ మూసేయడంతో పాటు అత్యవసర వాహనాలే తిరిగాలనే ఆంక్షలొస్తాయి.

News November 15, 2024

కిడ్నీ పేషెంట్‌కు తమన్ సాయం

image

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గొప్ప మనసు చాటుకున్నారు. ఓ పేషెంట్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం సాయం చేశారు. ఈ విషయాన్ని AINU ఆస్పత్రి వైద్యుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. దీనికి ‘గాడ్ ఈజ్ గ్రేట్’ అంటూ తమన్ తన ఇన్‌స్టా స్టోరీలో రిప్లై ఇచ్చారు. దీంతో పలువురు ఆయన సేవాగుణాన్ని ప్రశంసిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి.

News November 15, 2024

లోకేశ్ నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: అంబటి

image

AP: వైసీపీ నేతలు తన తల్లిని అవమానించారని మంత్రి నారా <<14608443>>లోకేశ్<<>> చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘లోకేశ్.. శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తాను’ అని ట్వీట్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెడితే ముందుగా ప్రస్తుత స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌పైన పెట్టాలని, వారిని అరెస్టు చేయాలని అంబటి పేర్కొన్నారు.

News November 15, 2024

ఢిల్లీ గ్రేప్ ఆంక్షలు.. ఎలా డిసైడ్ చేస్తారు..?

image

ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ (GRAP) రూపొందించింది. వాయు కాలుష్య తీవ్రతను బట్టి దీన్ని 4 స్టేజ్‌లలో అమలు చేస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201-300 (పూర్): స్టేజ్ 1, AQI 301-400(వెరీ పూర్) ఉంటే స్టేజ్ 2 అమలు చేస్తారు. ప్రస్తుతం AQI 401-450(సివియర్) ఉండటంతో స్టేజ్ 3 ఆంక్షలు విధించింది. AQI 450 (సివియర్+) దాటితే చివరిదైన స్టేజ్ 4 ఆంక్షలు వస్తాయి.

News November 15, 2024

వారానికి 5 రోజుల పని మంచిది కాదు: నారాయణ మూర్తి

image

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి హార్డ్ వర్క్‌పై మరోసారి కామెంట్లు చేశారు. తాను రోజులో 14గంటలు కష్టపడేవాడినని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అభివృద్ధి చెందుతున్న ఇండియాలో 5రోజుల పని దినాల విధానం మంచిది కాదన్నారు. హార్డ్ వర్క్‌కు ప్రత్యామ్నాయం లేదని, మీరు అత్యంత తెలివైన వ్యక్తి అయినా కష్టపడాల్సిందేనని చెప్పారు. PM మోదీ వారానికి 100గంటలు పని చేస్తారని దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

News November 15, 2024

ఫైల్స్ దగ్ధం.. ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్‌పై అభియోగాలు

image

AP: మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో దస్త్రాల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 22ఎ అసైన్డ్ భూములపై కొందరు అక్రమంగా హక్కులు సాధించారని, ఆ ఆధారాలు ఉండొద్దనే రికార్డులు తగలబెట్టారని CID ప్రాథమిక నివేదికలో పేర్కొంది. దీనికి ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్‌ను బాధ్యులుగా గుర్తించిన ప్రభుత్వం వారిపై అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులిచ్చారు.

News November 15, 2024

వయనాడ్ విషాదం జాతీయ విపత్తు కాదు: కేంద్రం

image

అధికారికంగా 231 మంది చనిపోయిన వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా పరిగణించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇది సాధ్యం కాదని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు. కేరళ ప్రభుత్వం రూ.900 కోట్ల సాయం కోరగా, ఆ రాష్ట్రానికి కేటాయించిన రూ.388 కోట్లలో 291 కోట్లను రెండు విడతలుగా ఇచ్చినట్లు వెల్లడించారు. పైగా ఆ రాష్ట్ర SDRF ఖాతాలో తగినంత నిధులు (రూ.395 కోట్లు) ఉన్నాయన్నారు.