News February 7, 2025

ప్రధానితో భేటీపై నాగార్జున ట్వీట్

image

ప్రధాని మోదీతో భేటీపై నాగార్జున స్పందించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించడంపై నాగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బుక్‌ను మోదీకి అందించడం గౌరవంగా భావిస్తున్నానని, ఇది తన తండ్రి సినీ వారసత్వానికి నివాళిగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆయన సేవలను మోదీ గుర్తించడం తమ కుటుంబం, దేశ సినీ ప్రేమికులకు ఒక విలువైన జ్ఞాపకమని నాగార్జున పేర్కొన్నారు.

News February 7, 2025

మోనాలిసా లక్కంటే నీదేనేమో….!

image

మోనాలిసా… కుంభమేళాలో తన ఆకర్షించే కళ్లతో ఫేమస్ అయిన ఈ అమ్మాయి ప్రస్తుతం ‘డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో నటిస్తోంది. దీనికి రెమ్యునరేషన్‌గా రూ.21లక్షలు తీసుకుందని సమాచారం. అంతేకాకుండా లోకల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం రూ.15 లక్షలతో డీల్ చేసుకుందట. పూసలమ్మి రోజుకు రూ.1000 సంపాదిస్తే చాలనుకున్న మోనాలిసాకు ఇప్పుడు డబ్బుతో పాటు దేశవ్యాప్తంగా ఫేమ్‌ వచ్చేసింది. లక్కంటే ఇదేనేమో మీరేమంటారు.

News February 7, 2025

పవన్ సిక్ అయ్యాడా.. అలిగాడా?: అంబటి

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ నిజంగానే అస్వస్థతకు గురయ్యాడా లేదా షూటింగ్‌లో ఉన్నాడా అని YCP నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్‌పై పవన్ అలిగాడేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ‘అధికారంలోకి వచ్చాక కూటమి సర్కార్ ఒక్క హామీని నేరవేర్చలేదు. హామీలు అమలు చేయకుండా జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. కూటమి పాలనలో అన్నీ మోసాలు, దాడులు, అరాచకాలే. గ్యారంటీ ఇచ్చిన పవన్ కూడా అడ్రస్ లేడు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News February 7, 2025

కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన

image

TG: రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే, ఇప్పటికే ఉన్న వాటిల్లో పేరు, చిరునామా, తదితరాలను సులభంగా అప్డేట్ చేసుకునేలా ‘మీ సేవ’ కేంద్రాల్లో ఆన్‌లైన్ దరఖాస్తులను అందుబాటులోకి తెచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్దిష్టమైన సమయం లేదని, ఎప్పటికీ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

News February 7, 2025

గురుకులాలు, హాస్టళ్లకు నిధులివ్వండి: మంత్రి స్వామి

image

AP: PM-AJAY పథకం కింద ఎంపిక చేసిన 526 గ్రామాలకు రూ.110cr విడుదల చేయాలని కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, రామ్‌దాస్ అథవాలేను మంత్రి స్వామి కోరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన 75 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్మాణానికి రూ.245cr, గురుకులాల్లో మౌలిక వసతులకు రూ.193cr.. SC, ST అట్రాసిటీ బాధితులకు రూ.95.84cr, తదితరాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. వీటిపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.

News February 7, 2025

TPCC కార్యవర్గ కూర్పుపై కసరత్తు కొలిక్కి

image

TG: TPCC కార్యవర్గ కూర్పుపై కసరత్తు తుదిదశకు చేరింది. నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇచ్చే అవకాశముంది. కార్యవర్గంలో సామాజిక న్యాయం పాటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి చామల, రోహిణ్, రాజేందర్.. SCల నుంచి సంపత్, కవ్వంపల్లి, ప్రీతం.. STల నుంచి బలరాం, బెల్లయ్య, మురళి.. మైనారిటీల నుంచి ఖురేషి, అజారుద్దీన్, ఫిరోజ్‌ ఖాన్‌లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

News February 7, 2025

గుడ్లను ఇలా ఉడికిస్తున్నారా?

image

గుడ్డులో పోషకాలు, రంగు, రుచి ప్రత్యేకంగా ఉండాలంటే ఓ పద్ధతి ప్రకారం ఉడికించాలని US శాస్త్రవేత్తలు తెలిపారు. గుడ్డు సరిగ్గా ఉడకాలంటే ముందుగా మరుగుతున్న నీటిలో నుంచి గోరు వెచ్చని నీటిలోకి.. అలాగే గోరు వెచ్చని నీటిలో నుంచి మరుగుతున్న నీటిలోకి ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మార్చాలి. ఇలా 32 నిమిషాలపాటు చేయాలి. ఆ తర్వాత చల్లని నీటిలో ఉంచి పెంకు తీయాలి. ఇలా చేస్తే గుడ్డులోని పోషకాలు సమతుల్యంగా లభిస్తాయి.

News February 7, 2025

కాలేజీలో నాపై ఎంతోమందికి క్రష్: రష్మిక

image

కళాశాలలో చాలామందికి తనపై క్రష్ ఉండేదని నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలిపారు. ఆ తర్వాత దేశం మొత్తానికి క్రష్‌గా మారానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘కిరిక్ పార్టీ(కన్నడ) సినిమా తర్వాత నేషనల్ క్రష్ ట్యాగ్ వచ్చింది. ఈ ట్యాగ్ దేశం మొత్తం పాకిపోయింది. ప్రస్తుతం దేశ ప్రజలందరూ నన్ను ప్రేమిస్తున్నారు. ఇది నాకు చాలా ప్రత్యేకంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. రష్మిక కాలి గాయంతో బాధపడుతూ రెస్ట్ తీసుకుంటున్నారు.

News February 7, 2025

ఆదాయం ప్రకటించిన ఎల్‌ఐసీ

image

LIC ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.11,506 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతంతో పోలిస్తే 17 శాతం పెరిగినట్లు పేర్కొంది. ప్రీమియంల ద్వారా రూ.1,06,891 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ త్రైమాసికంలో మెుత్తంగా సంస్థ ఆదాయం రూ.2,01,994 కోట్లు కాగా గతంతో పోలిస్తే రూ.10,453 కోట్లు తగ్గినట్లు ప్రకటించింది. ఈ నష్టాలతోLIC షేరు 2.15శాతం తగ్గి రూ.811 వద్ద ముగిసింది.

News February 7, 2025

గ్రేట్.. ఆరు నెలల బోనస్ ఇచ్చిన స్టార్టప్

image

ఉద్యోగుల విధేయతను గౌరవిస్తూ ఓ కంపెనీ వారికి 6 నెలల జీతాన్ని బోనస్‌గా ఇచ్చింది. TNలోని కోయంబత్తూరులో ఉన్న AI స్టార్టప్ ‘KOVAI.CO’ను శరవణ కుమార్ స్థాపించారు. మొత్తం 140 మంది ఉద్యోగులుండగా, వారికి రూ.14 కోట్లు బోనస్‌గా ఇచ్చారు. ‘స్టార్టప్‌లలో పనిచేసేందుకు ఎవరూ మొగ్గుచూపారు. మూడేళ్లు మాతో పనిచేస్తే 2025 జనవరి జీతంలో ఆరు నెలల బోనస్ ఇస్తానని ప్రకటించి ఆ మాటను నిలబెట్టుకున్నా’ అని శరవణ కుమార్ తెలిపారు.