News November 13, 2024

ఎల్లుండి నుంచి ICICI క్రెడిట్ కార్డుల కొత్త రూల్స్

image

* క్యాష్ అడ్వాన్స్‌లపై ఫైనాన్స్ ఛార్జీలు 3.75%
* రూ.101-500 పెండింగ్ బిల్లుపై లేట్ ఛార్జీ రూ.100
* రూ.50వేల పెండింగ్ బిల్లుపై లేట్ ఛార్జీ రూ.1300
* రూ.100లోపు బిల్లు విషయంలో ఎలాంటి లేట్ ఫీజు ఉండదు
* ఎడ్యుకేషన్ విషయంలో థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా చెల్లింపులకు 1% ఛార్జీ వర్తింపు
* స్కూల్/కాలేజీకి నేరుగా పేమెంట్ చేస్తే ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుంది.

News November 13, 2024

ఎలాంటి వారికి మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలి: అనిత

image

AP: సొంత చెల్లి, తల్లిని తిట్టిన వారిని జగన్ ఏం చేయలేకపోతే, తాము అరెస్ట్ చేస్తున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ‘మహిళలను ఏమైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరు. కానీ జగన్ సీఎం ఉన్నప్పుడు కొందరు సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టారు. జడ్జిలు, వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు ఎలాంటి వారికి మద్దతిస్తున్నారో జగన్ ఆలోచించుకోవాలి’ అని ఆమె సూచించారు.

News November 13, 2024

వచ్చే జనవరిలో క్రెటా ఈవీ లాంచ్

image

భారత్‌లో తమ మూడో విద్యుత్ కారును తీసుకొచ్చేందుకు హ్యుందాయ్ రంగం సిద్ధం చేసింది. సంస్థకు చెందిన కోనా, ఐయోనిక్-5 ఈవీలు ఇప్పటి వరకు మార్కెట్లో ఉండగా క్రెటా ఈవీని వచ్చే ఏడాది జనవరిలో హ్యుందాయ్ లాంఛ్ చేయనుంది. లీకైన లుక్స్ బట్టి ఈ ఈవీ స్టైలింగ్ అంతా స్టాండర్డ్ క్రెటాలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈవీ సెగ్మెంట్‌లో క్రెటాతో మార్కెట్ షేర్ దక్కించుకోవాలని హ్యుందాయ్ భావిస్తోంది.

News November 13, 2024

రేపు అన్ని జిల్లాల్లో ఉద్యోగుల నిరసనలు

image

TG: వికారాబాద్(D) లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడికి నిరసనగా రేపు ఆందోళనలు చేయాలని ఉద్యోగుల ఐకాస నిర్ణయించింది. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట రేపు ఆందోళనలు చేపట్టాలని, లంచ్ టైమ్‌లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చింది. మరోవైపు లగచర్ల దాడి ఘటనను ఐఏఎస్ అధికారుల సంఘం సీరియస్‌గా తీసుకుంది. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

News November 13, 2024

గుండె ఆరోగ్యం పెరగాలంటే ఇలా చేయండి!

image

శీతాకాలంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని శారీరక వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వాకింగ్ చేయడం వల్ల గుండె వ్యాధులకు కారణమయ్యే కొవ్వు నిల్వలు కరిగిపోతాయి. జాగింగ్/ రన్నింగ్ చేస్తే హృదయనాళ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. సైక్లింగ్ వల్ల కీళ్లకు మేలు జరుగుతుంది. యోగాతో ఒత్తిడి తగ్గుతుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల హృదయనాళ వ్యవస్థ & కండరాల ఆరోగ్యం పెరుగుతుంది. SHARE IT

News November 13, 2024

ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

image

AP: 16వేల పైచిలుకు పోస్టుల భర్తీ కోసం త్వరలోనే DSC నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల్లో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గతంలో TDP అధికారంలో ఉన్నప్పుడు 11 DSCల ద్వారా 1.5 లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామని, అందులో 9 DSCలు చంద్రబాబు హయాంలోనే నిర్వహించామన్నారు. మెగా DSCపైనే తొలి సంతకం పెట్టామని, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు తొలుత టెట్ నిర్వహించామన్నారు.

News November 13, 2024

హీరోయిన్‌కు బెదిరింపులు: రూ.50 లక్షలు ఇవ్వాలంటూ..

image

హీరోయిన్ అక్షర సింగ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. 2 రోజుల్లో రూ.50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తానని ఆగంతకుడు ఆమెను బెదిరించాడు. దీనిపై ఆమె పట్నాలోని దానాపుర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా భోజ్‌పురి క్వీన్‌గా పిలుచుకునే అక్షర సింగ్ పలు సినిమాల్లో నటించారు. త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తున్నట్లు సమాచారం.

News November 13, 2024

‘కుబేర’ గ్లింప్స్ రిలీజ్ చేయనున్న మహేశ్‌బాబు

image

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామా మూవీ ‘కుబేర’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈనెల 15న సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేస్తారని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News November 13, 2024

BRS మాజీ ఎమ్మెల్యేకు రిమాండ్

image

TG: లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు రిమాండ్ విధించింది. ఆయనకు 14రోజుల రిమాండ్ విధించగా పోలీసులు జైలుకు తరలిస్తున్నారు. ఈక్రమంలో కొడంగల్ కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నరేందర్ రెడ్డిని తరలిస్తున్న కారును బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

News November 13, 2024

ఐపీఎస్, ఐఏఎస్‌లు జాగ్రత్తగా ఉండాలి: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని KTR విమర్శించారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్టయిన పట్నం నరేందర్ ఫ్యామిలీని ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ‘తనపై దాడి జరగలేదని కలెక్టరే చెప్పారు. మరి కేసులు ఎందుకు పెట్టారు? అధికారులు అతి చేస్తే ఏపీలో ఏం జరిగిందో చూస్తున్నాం. రాష్ట్రంలో IPS, IASలు జాగ్రత్తగా ఉండాలి. అక్రమ అరెస్టులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్తాం’ అని చెప్పారు.