News November 13, 2024

BRS మాజీ ఎమ్మెల్యేకు రిమాండ్

image

TG: లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు రిమాండ్ విధించింది. ఆయనకు 14రోజుల రిమాండ్ విధించగా పోలీసులు జైలుకు తరలిస్తున్నారు. ఈక్రమంలో కొడంగల్ కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నరేందర్ రెడ్డిని తరలిస్తున్న కారును బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

News November 13, 2024

ఐపీఎస్, ఐఏఎస్‌లు జాగ్రత్తగా ఉండాలి: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని KTR విమర్శించారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్టయిన పట్నం నరేందర్ ఫ్యామిలీని ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ‘తనపై దాడి జరగలేదని కలెక్టరే చెప్పారు. మరి కేసులు ఎందుకు పెట్టారు? అధికారులు అతి చేస్తే ఏపీలో ఏం జరిగిందో చూస్తున్నాం. రాష్ట్రంలో IPS, IASలు జాగ్రత్తగా ఉండాలి. అక్రమ అరెస్టులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్తాం’ అని చెప్పారు.

News November 13, 2024

తన క్యాన్సర్‌ను తనే నయం చేసుకున్న శాస్త్రవేత్త!

image

క్రొయేషియాకు చెందిన సైంటిస్ట్ బియాటా హలాసీ(49) జాగ్రేబ్ వర్సిటీలో వైరాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఆమెకు గతంలో రొమ్ము క్యాన్సర్ సోకి తగ్గింది. 2020లో మళ్లీ సోకగా సొంతంగా ఆంకాలిటిక్ వైరోథెరపీని(OVT) చేసుకున్నారు. పొంగు చూపే వైరస్, వెసిక్యులర్ స్టొమాటిటిస్ వైరస్(VSV) రెండింటినీ తన కణితిపై ప్రయోగించి క్యాన్సర్ నుంచి విముక్తురాలయ్యారు. వైద్య ప్రపంచంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

News November 13, 2024

ICC ర్యాంకింగ్స్.. నం.1 ప్లేస్‌లో పాక్ బౌలర్

image

ICC తాజాగా ప్రకటించిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాక్ బౌలర్ షాహీన్‌షా అఫ్రీది నంబర్ 1 ర్యాంక్ సాధించారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు అద్భుతమైన ప్రదర్శన చేశారు. మూడు వన్డేల్లో 8 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌కు ముందు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 4వ ప్లేస్‌లో ఉన్న అఫ్రీది ఏకంగా తొలి స్థానానికి దూసుకొచ్చారు. IND తరఫున కుల్దీప్(4), బుమ్రా(6), సిరాజ్(8) టాప్-10లో ఉన్నారు.

News November 13, 2024

చంద్రబాబుకు అప్పు రత్న బిరుదు ఇవ్వాలి: జగన్

image

AP: చంద్రబాబు హయాంలో అప్పులు 19శాతం పెరిగితే, తాను సీఎంగా ఉన్న కాలంలో 15శాతం మాత్రమే పెరిగినట్లు YS జగన్ వెల్లడించారు. రూ.10 లక్షల కోట్లు, రూ.14లక్షల కోట్ల అప్పు అని తమపై తప్పుడు ప్రచారం చేసి, బడ్జెట్‌లో రూ.6లక్షల కోట్ల అప్పు మాత్రమే చూపించారని ఆరోపించారు. అంటే చంద్రబాబు, కూటమి నేతలు చేసిందంతా తప్పుడు ప్రచారం కాదా? అని ప్రశ్నించారు. అప్పు రత్న అనే బిరుదును చంద్రబాబుకు ఇవ్వాలని సెటైర్లు వేశారు.

News November 13, 2024

ALERT: రేపు భారీ వర్షాలు

image

AP: అల్పపీడనం బలహీనపడినప్పటికీ రేపు కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఈనెల 15, 16 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. రేపు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, ATP, సత్యసాయి, TPTY జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అల్లూరి, కోనసీమ, ప.గో, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, YSR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.

News November 13, 2024

కుట్రపూరితంగానే కలెక్టర్‌పై దాడి: భట్టి

image

TG: కుట్రపూరితంగానే కలెక్టర్‌పై BRS శ్రేణులు దాడి చేశాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని Dy CM భట్టి విక్రమార్క ఆరోపించారు. అమాయక గిరిజనులను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారని మండిపడ్డారు. పరిశ్రమల వల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ‘పరిశ్రమలు రావాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూమి కోల్పోతున్నవారికి మెరుగైన ప్యాకేజీతో పాటు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తాం’ అని వెల్లడించారు.

News November 13, 2024

ఏపీ శ్రీలంక అవుతుందని దుష్ప్రచారం చేశారు: జగన్

image

APకి రూ.10లక్షల కోట్ల అప్పులున్నాయంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు తమపై తప్పుడు ప్రచారం చేశారని జగన్ ఆరోపించారు. ‘ఓ పద్ధతి ప్రకారం మా ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేశారు. పరిమితికి మించి వైసీపీ అప్పులు చేసిందని అబద్ధాలు చెప్పారు. ఏపీ మరో శ్రీలంక అవుతుందని ముందు చంద్రబాబు మాట్లాడారు. ఆ తర్వాత పవన్, పురందీశ్వరి ఆయనకు వత్తాసు పలికారు. గవర్నర్‌తోనూ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించారు’ అని జగన్ మండిపడ్డారు.

News November 13, 2024

కాసేపట్లో కోర్టుకు పట్నం నరేందర్ రెడ్డి

image

TG: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆయనను విడుదల చేయాలంటూ కోర్టుకు వెళ్లే దారిలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. లగచర్లలో ఉన్నతాధికారులపై జరిగిన దాడిలో నరేందర్ కుట్ర ఉందన్న ఆరోపణలతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

News November 13, 2024

ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్: జగన్

image

AP:పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు మోసాలు బయటకొస్తాయనే భయంతోనే ఇన్ని నెలల పాటు బడ్జెట్ ప్రవేశపెట్టలేదని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా 4 నెలలు మాత్రమే ఉంటే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్‌లో ఆమేరకు నిధులు కేటాయించేవారు. ప్రజలను మోసం చేసేలా బడ్జెట్ ఉంది’ అని మండిపడ్డారు.