News November 12, 2024

సిల్వర్‌ను బీట్ చేసిన BITCOIN: అతిపెద్ద 8వ అసెట్‌గా రికార్డ్

image

బిట్ కాయిన్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. $1.752 ట్రిలియన్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎనిమిదో అసెట్‌గా అవతరించింది. $1.726 ట్రిలియన్లతో ఉన్న సిల్వర్‌ను అధిగమించింది. గత 24 గంటల్లో BTC ఏకంగా 9% పెరిగి $88,570 డాలర్లకు చేరడం గమనార్హం. మెటా $1.472, టెస్లా $1.124, బెర్కషైర్ హాత్‌వే $1.007 ట్రిలియన్ల కన్నా BTC విలువే ఎక్కువ. ఇక బంగారం $17.6 ట్రిలియన్లతో అతిపెద్ద అసెట్‌గా ఉంది.

News November 12, 2024

బెంగళూరులో ఇంటి అద్దెలు.. చుక్కలు చూపిస్తున్నాయి

image

Silicon Valley of Indiaగా పేరొందిన బెంగ‌ళూరు అద్దె ఇంటి కోసం వెతుకుతున్న‌వారికి చుక్క‌లు చూపిస్తోంది. ఓ అపార్ట్‌మెంట్‌లో నెల‌కు ₹40 వేలు అద్దె ఉన్న ఇంటికి ₹5 ల‌క్ష‌లు అడ్వాన్స్ చెల్లించాల‌ని య‌జ‌మాని చెప్పడంతో హ‌ర్నిద్ కౌర్ అనే యువ‌తి నిర్ఘాంత‌పోయింది. దీనిపై ఆమె చేసిన పోస్టు వైరల్ అవ్వడంతో నెట్టింట చ‌ర్చ జరుగుతోంది. అద్దెకు బ‌దులు ఆమె ఇంటినే కొనేయ‌డం ఉత్త‌మ‌మ‌ని కొంద‌రు స‌ల‌హా ఇస్తున్నారు.

News November 12, 2024

Stock Market: మ‌ళ్లీ భారీ న‌ష్టాలు

image

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వ‌రుస న‌ష్టాలు చ‌విచూస్తున్నాయి. మంగ‌ళ‌వారం సెన్సెక్స్ 820 పాయింట్లు న‌ష్ట‌పోయి 78,675 వ‌ద్ద, నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయి 23,883 వద్ద స్థిర‌ప‌డ్డాయి. రెండు బెంచ్ మార్క్ సూచీల్లో Lower Lows మినహా ఏకమైనా అప్ ట్రెండ్ ప్యాటర్న్ దర్శనమివ్వలేదు. 23,900 పరిధిలో నిఫ్టీకి, 78,800 పరిధిలోని సెన్సెక్స్‌కి కొంత సపోర్ట్ లభించినా చివరికి ఆ స్థాయులు కూడా Break Down అయ్యాయి.

News November 12, 2024

దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ?

image

పాకిస్థాన్‌లో జరగాల్సిన <<14588299>>ఛాంపియన్స్ ట్రోఫీ<<>> దక్షిణాఫ్రికాకు తరలివెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాక్‌కు వెళ్లేందుకు భారత్ సుముఖంగా లేకపోవడం, హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించేందుకు PCB ఒప్పుకోకపోవడంతో SAలో ఈ టోర్నీని నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా తమ తుది నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.

News November 12, 2024

విజన్-2047 కోసం సలహాలివ్వండి: చంద్రబాబు

image

AP: బడ్జెట్ సమావేశాలపై MLAలు అవగాహన పెంచుకోవాలని CM చంద్రబాబు సూచించారు. అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన MLAలు, MLCలతో వర్క్‌షాపులో CM మాట్లాడారు. ‘ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై అధ్యయనం చేయాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. MLAలు నిరంతరం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. తెలుసుకోవాలి. సభలో ప్రతిపక్షం లేకపోయినా ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. విజన్2047పై సలహాలు ఇవ్వాలి’ అని CM కోరారు.

News November 12, 2024

అత్యవసర విచారణ ప్రక్రియలో కీలక మార్పు చేసిన CJI సంజీవ్ ఖన్నా

image

అత్యవసర కేసుల విచారణ విజ్ఞప్తులపై CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసుల లిస్టింగ్‌ను నోటిమాట ద్వారా విజ్ఞప్తి చేయడాన్ని నిషేధించారు. ‘ఇకపై నోటిమాట, రాతపూర్వకంగా ప్రస్తావించడం ఉండదు. ఈమెయిల్ లేదా ప్రత్యేకమైన స్లిప్‌పై రాసి ఇవ్వాలి. అలాగే అర్జంట్‌‌గా విచారణ చేపట్టేందుకు కారణాలు వివరించాలి’ అని ఆదేశించారు. మాజీ CJI చంద్రచూడ్ హయాంలో కొన్ని కేసులు ఓరల్ రిక్వెస్ట్‌తో స్వీకరించారు.

News November 12, 2024

కొత్త అవతారాల్లో ముగ్గురు హీరోలు.. ఆకట్టుకుంటున్న లుక్స్

image

టాలీవుడ్ యువ హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మనోజ్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన ‘గజపతి వర్మ’ పాత్రలో నటిస్తున్నారు. రోహిత్ ‘వరద’, శ్రీనివాస్ ‘సీను’ అనే పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే విడుదలయ్యాయి. ‘భైరవం’ టైటిల్‌తో రాబోయే ఈ మూవీకి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.

News November 12, 2024

‘ఘాటీ’ సెట్‌లో అనుష్కను కలిసిన ప్రభాస్?

image

రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అయితే, సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా ఇద్దరూ తరచూ కలుస్తుంటారని సినీవర్గాలు పేర్కొన్నాయి. తాజాగా అనుష్క నటిస్తోన్న ‘ఘాటీ’ మూవీ సెట్స్‌కి కూడా ప్రభాస్ వెళ్లినట్లు తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గతంలో ‘భాగమతి’ మూవీ సెట్‌లోనూ వీరిద్దరూ కలుసుకున్నట్లు వెల్లడించాయి.

News November 12, 2024

మ‌హారాష్ట్ర పోల్ బ్యాటిల్‌: మ‌రాఠీ Vs గుజరాతీ

image

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్ని మ‌రాఠీ Vs గుజరాతీల‌ మ‌ధ్య ప్రాంతీయ పోరుగా విప‌క్ష MVA న్యారేటివ్ బిల్డ్ చేస్తోంది. MH అవ‌కాశాల‌ను ఇత‌ర రాష్ట్రాలు దోచుకుంటున్నాయని ఇటీవ‌ల రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. ఫాక్స్‌కాన్‌, వేదాంత కంపెనీలు MH నుంచి గుజ‌రాత్‌కు త‌ర‌లిపోవ‌డాన్ని నేత‌లు ఉదాహ‌రిస్తున్నారు. మ‌రాఠీ పార్టీలైన శివ‌సేన‌, NCPల‌ను చీల్చి BJP అధికారాన్ని లాక్కుంద‌ని మరాఠీ న్యారేటివ్ సెట్ చేస్తున్నారు.

News November 12, 2024

క్రికెట్‌లోకి షమీ రీ ఎంట్రీ.. ఎప్పుడంటే..

image

పేసర్ మహ్మద్ షమీ సుమారు ఏడాది గ్యాప్ తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. రేపు మధ్యప్రదేశ్, బెంగాల్ మధ్య జరిగే రంజీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఆయన ఫిట్‌గా ఉన్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ ధ్రువీకరించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ODI వరల్డ్ కప్ ఫైనల్లో షమీ చివరిగా ఆడారు. రంజీల్లో బౌలింగ్ బాగుంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు ఏదో విధంగా ఆయన్ను టీమ్ ఇండియా ఆడించే అవకాశం ఉంది.