News January 31, 2025

గద్దర్ అన్న నువ్వు లేని లోటు ఎన్నటికీ తీరదు: భట్టి

image

TG: ప్రజా గాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా Dy.CM భట్టి విక్రమార్క ఆయనను స్మరించుకున్నారు. ‘సమాజంలో అసమానతల పైన ఎన్నో పోరాటాలకు ఊపిరి పోస్తివి. నీ పాటతో తెలంగాణకి ప్రాణం పోస్తివి. ప్రజా యుద్ధ నౌకగా ప్రపంచమంతా నీ పాటతో పరిచయమేర్పరుచుకొని గొప్పగా జీవించావు సోదరా. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఎంతో ఆప్యాయతగా అన్నగా, ఆప్తుడిగా నన్ను నడిపించావు. నువ్వు లేని లోటు ఎన్నటికీ తీరదు’ అని ట్వీట్ చేశారు.

News January 31, 2025

U19 WC: నేడు సెమీస్ పోరు.. భారత్ ఫైనల్‌కు వెళ్తుందా?

image

ఐసీసీ U19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. సెమీ ఫైనల్-1లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఉ.8 గంటలకు ప్రారంభం అవుతుంది. సెమీ ఫైనల్-2లో ఇండియా, ఇంగ్లండ్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ మ.12 గంటలకు స్టార్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

News January 31, 2025

పాత ఇందిరమ్మ ఇళ్లకూ ఆర్థికసాయం?

image

TG: ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు పొంది సొంత నిధులతో వాటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న వారికి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆర్థిక సాయం పూర్తిగా అందని, సగం డబ్బులు పొందిన లబ్ధిదారులకు సాయం చేయనున్నట్లు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వం ఎంత అమౌంట్ ఇచ్చింది, ఇంకెంత ఇవ్వాల్సి ఉందనే వివరాలను హౌసింగ్ శాఖ సేకరించింది. ఇలాంటి లబ్ధిదారులు సుమారు 2 లక్షల మంది ఉంటారని అంచనా.

News January 31, 2025

మోదీ కంటే కేజ్రీవాలే కన్నింగ్: రాహుల్ గాంధీ

image

PM మోదీ తరహాలోనే ఆప్ చీఫ్ కేజ్రీవాల్ అబద్ధాలు చెబుతుంటారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. వారిద్దరి మధ్య ఎలాంటి తేడా లేదన్నారు. ఇంకా చెప్పాలంటే మోదీ కంటే కేజ్రీవాల్ ఎక్కువ కన్నింగ్ అని దుయ్యబట్టారు. ఐదేళ్లలో యమునా నది నీళ్లను తాగేందుకు అనుకూలంగా మారుస్తానన్న హామీ నీటి మూటగా మారిందని ఫైరయ్యారు. తాము ఢిల్లీలో అధికారంలోకి వస్తే కర్ణాటక, తెలంగాణ తరహాలో హామీలు నెరవేరుస్తామన్నారు.

News January 31, 2025

Stock Markets: వరుసగా నాలుగోరోజూ లాభపడతాయా!

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా మొదలై రేంజుబౌండ్లో కదలాడే సూచనలు ఉన్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ 20pts పెరగడం దీనినే సూచిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. క్రూడ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఆర్థికసర్వే, రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటమే మేలు. నిఫ్టీ 24000 బ్రేక్ చేస్తే సెంటిమెంటు మరింత బలపడతుంది. రెసిస్టెన్సీ 23,307, సపోర్టు 23,167 వద్ద ఉన్నాయి.

News January 31, 2025

OTTలోకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

image

టొవినో థామస్, త్రిష జంటగా నటించిన మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’ ఓటీటీలోకి వచ్చేసింది. జీ5లో ఈ మూవీ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ ప్రసారమవుతోంది. మలయాళంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 24న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.

News January 31, 2025

బాత్‌రూమ్‌లోనే టూత్‌బ్రష్ పెడుతున్నారా?

image

దంతాలను శుభ్రం చేసుకున్నాక <<15261921>>టూత్‌బ్రష్‌లను<<>> బాత్‌రూమ్‌లోనే పెట్టడం ప్రమాదమని సిద్దిపేట GOVT డిగ్రీ కాలేజీ విద్యార్థుల అధ్యయనంలో తేలింది. కమోడ్‌ ఫ్లష్ చేసినప్పుడు నీతి తుంపర్ల ద్వారా 3రకాల బ్యాక్టీరియా బ్రష్‌లపైకి చేరుతోందని గుర్తించారు. స్ట్రెప్టోకోకస్ వల్ల దంతాల అరుగుదల, స్టెఫైలోకోకస్ ఆర్యస్‌తో మౌత్ అల్సర్, ఈ-కొలి వల్ల జీర్ణ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. బ్రష్‌లను ఎండ తగిలే చోట పెట్టాలంటున్నారు.

News January 31, 2025

రేపటి నుంచే భూముల మార్కెట్ ధరల పెంపు

image

APవ్యాప్తంగా రేపటి నుంచి భూముల మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరగనున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన 10-20% పెంపు ఉండనుంది. నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో నిర్మాణ విలువలపైనా 6% వరకు పెంపు ఉంటుంది. పెంకుటిళ్లు, రేకుల షెడ్లు, ఇతర వాటికి చదరపు అడుగుకు ₹740, ₹580, ₹420 వసూలు చేస్తారు. ప్లాట్‌లకు(G,1st, 2nd ఫ్లోర్)రూ.1,490, రూ.1,270, రూ.900 వసూలుకు నిర్ణయించారు.

News January 31, 2025

లిక్కర్ స్కాంలో కవిత: కేరళ ప్రతిపక్ష నేత

image

TG: ఢిల్లీ తరహాలో కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని, ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆరోపించారు. ‘పాలక్కడ్‌లోని ఒయాసిస్ కమర్షియల్ కంపెనీకి మద్యం తయారీ పర్మిషన్ ఇచ్చారు. సీఎం పినరయి, ఎక్సైజ్ మంత్రి రాజేశ్ ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని కవితనే కేరళకు వచ్చి మరీ నడిపించారు’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలను కవిత ఖండించారు.

News January 31, 2025

6,100 కానిస్టేబుల్ పోస్టులు.. BIG UPDATE

image

APలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన PET, PMT పరీక్షలు నిన్నటితో ముగిశాయి. 69K మంది హాజరవగా దాదాపు 39K మంది అర్హత సాధించినట్లు PRB ఛైర్మన్ రవిప్రకాశ్ తెలిపారు. వీరికి MAR చివరి వారం లేదా APR ఫస్ట్ వీక్‌లో తుది రాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోంగార్డుల రిజర్వేషన్‌పై హైకోర్టు తీర్పునకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. కాగా ఈ పోస్టులకు 2023 FEBలో 4.90L మంది ప్రాథమిక పరీక్ష రాశారు.