India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు అందాయి. FIIల నుంచి కొనుగోళ్ల మద్దతు లేకపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. సెన్సెక్స్ 79,448 (-37), నిఫ్టీ 24,143 (-5) వద్ద చలిస్తున్నాయి. ఆటో, ఐటీ, ఫైనాన్స్ షేర్లు రాణిస్తున్నాయి. పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, మారుతీ, TCS, HCL టెక్ టాప్ గెయినర్స్. ASIAN PAINTS, అదానీ పోర్ట్స్, ONGC టాప్ లూజర్స్.
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(CHSL) టైర్-2 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను SSC రేపు విడుదల చేయనుంది. అభ్యర్థులు <
TG: ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై ‘ఎస్మా’ ప్రయోగించాలని కలెక్టర్లను ఆదేశించారు. పంటల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే కేసులు పెట్టాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా కలెక్టర్లు చూడాలన్నారు. ఏమైనా సమస్యలుంటే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు.
TG: నిర్మల్ జిల్లాలోని బాసర RGUKT హాస్టల్ గదిలో విద్యార్థిని స్వాతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా పెర్కిట్కు చెందిన ఆమె పీయూసీ రెండో ఏడాది చదువుతోంది. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.600 తగ్గి రూ.78,760కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 తగ్గడంతో రూ.72,200 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.1,000 తగ్గడంతో రూ.1,02,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడటంపై ఇప్పటివరకు క్లారిటీ లేదని కోచ్ గంభీర్ చెప్పారు. అయితే హిట్మ్యాన్ ఆడతారనే ఆశిస్తున్నట్లు మీడియాతో తెలిపారు. సిరీస్ మొదలయ్యే ముందు దీనిపై క్లారిటీ ఇస్తామన్నారు. ఒకవేళ రోహిత్ తొలి టెస్టు ఆడకపోతే బుమ్రా సారథిగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాహుల్, అభిమన్యు ఈశ్వరన్లలో ఒకరు యశస్వీతో కలిసి ఓపెనింగ్ చేస్తారని తెలిపారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశమైంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూపొందించిన 2024-25 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. అంతకుముందు అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఉల్లిధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వారం రోజుల క్రితం కేజీ రూ.50లోపు ఉన్న ధర ప్రస్తుతం రూ.70-80కి చేరింది. దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లోనూ ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఉల్లి రేట్లు పెరగడంతో ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు.
ఈ సంవత్సరంలో ఇంకో 50 రోజులే ఉన్నాయి. కాసేపు వెనక్కి వెళ్తే ఈ ఏడాది ఇంత ఫాస్ట్గా అయిందేంటి అని చాలామందికి అన్పిస్తుంది. ఇంకొందరికేమో రోజులు మారుతున్నా, మన లైఫ్ మాత్రం మారడం లేదేంటి? అనే వెలితి కన్పిస్తుంది. పరిగెడుతున్న కాలంలో మీ బెస్ట్, వరెస్ట్ మెమొరీస్ ఏమిటి? మిగిలిన ఈ హాఫ్ సెంచరీ డేస్లో ఏం చేద్దామనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
ఏపీ ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘<<14569063>>నైతిక విలువల సలహాదారు<<>>’ పదవిని స్వీకరిస్తున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నానని, పదవుల కోసం కాదని చెప్పారు. నేటి యువత సన్మార్గంలో నడిస్తేనే దేశానికి మంచిపేరు వస్తుందని పేర్కొన్నారు. కాగా ఏపీ ప్రభుత్వం చాగంటికి క్యాబినెట్ ర్యాంకుతో ఈ పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.