India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: యూనివర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంట్ వయసును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని UGC వేతన స్కేల్ పొందుతున్న అధ్యాపకులకే ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. సీనియర్ ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకునేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త నోటిఫికేషన్ ఇవ్వరా? అంటూ దీనిపై నిరుద్యోగ జేఏసీ మండిపడుతోంది.

TG: హైదరాబాద్ గోషామహల్లో నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్ డిజైన్ను ప్రభుత్వం విడుదల చేసింది. 20 ఎకరాల్లో, 32 లక్షల చదరపు అడుగుల్లో 2వేల బెడ్లతో దీన్ని నిర్మించనున్నారు. 29 మేజర్, 12 మైనర్ ఆపరేషన్ థియేటర్లు, రొబోటిక్ సర్జరీ ఉంటాయి. అండర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్లలో పార్కింగ్, ఆసుపత్రి సమీపంలో ఫైర్ స్టేషన్, చుట్టూ విశాలమైన రహదారులు నిర్మిస్తారు. రేపు సీఎం రేవంత్ దీనికి భూమిపూజ చేయనున్నారు.

నటి స్వరా భాస్కర్ X ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేశారు. దీనిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే రోజున విష్ చేయడం కూడా కాపీరైట్ ఉల్లంఘన కిందకు ఎలా వస్తుందని ఇన్స్టా పోస్టులో స్వరా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తన X ఖాతాలో గాంధీ నినాదం, రిపబ్లిక్ డే విషెస్ పోస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో కాపీ రైట్ ఉల్లంఘన ఏముందని, తన పోస్టును మరోసారి పరీక్షించాలని అభ్యర్థించారు.

AP: రాష్ట్ర ప్రజలకు ‘మన మిత్ర’ పథకాన్ని అంకితం చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘161 సేవలు అందజేసే ‘మన మిత్ర’ ప్రక్రియ ఓ మైలురాయి. మంత్రి లోకేశ్ మంచి ఆలోచనతో దీన్ని రూపొందించారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సేవలు అందుబాటులోకి తెచ్చాం. లోకేశ్, మెటా భారత ఉపాధ్యక్షుడు సంధ్యా దేవనాథన్కు అభినందనలు’ అని CM తెలిపారు. ఇవాళ మంత్రి లోకేశ్ ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఉత్తరాఖండ్లో లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వారు UCC నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ కోసం 15 రకాల డాక్యుమెంట్లు (ఆధార్, నివాస, వయసు నిర్ధారణ వంటివి) సమర్పించాలి. అలాగే ఒక పూజారి నుంచి NOC తీసుకోవాలి. 16 పేజీల ఫాం నింపి ₹500 ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. రిలేషన్లో ఉన్నవారి వయసు 21 ఏళ్లకు తక్కువ ఉంటే తల్లిదండ్రులకు సమాచారం ఇస్తారు.

ట్రిపుల్ రైడింగ్ వద్దని పోలీసులు పదే పదే చెబుతున్నా పెడచెవిన పెడుతుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయి. తాజాగా, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం-నరసాపురం NHపై ఘోర ప్రమాదం జరిగింది. బైక్-లారీ ఢీకొనగా బైక్ మీద ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను శాంతిరాజు( 26), పి.అజయ్ (22), బి.విజయచంద్రపాల్ (35)గా గుర్తించారు. పెయింట్ పనులకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

TG: CM రేవంత్, మాజీ CM KCRలను పోల్చుతూ కాంగ్రెస్ పార్టీ సెటైరికల్ ట్వీట్ చేసింది. రేవంత్ వర్క్హాలిక్ సీఎం అని.. ఏడాదిలో 300 మీటింగులు, 400 సమీక్షలు, లక్ష కి.మీ. ప్రయాణాలు చేశారని పేర్కొంది. రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చారంది. అటు కేసీఆర్ ఆల్కహాలిక్ లీడర్ అని ఫాంహౌస్లో పండుకొని వచ్చిన వాళ్లతో ఫొటోలు దిగుతారని ఎద్దేవా చేసింది. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ పండించడమే ఆయన పని అని విమర్శించింది.

బాబీ, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచినట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించినట్లు పేర్కొంది. బాలయ్య వేటకు వెళితే ఇలాగే ఉంటుందని రాసుకొచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా రూ.156 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫొటోషూట్ కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటారా? ఈ మెగా ఈవెంట్ ఓపెనింగ్ ప్రోగ్రామ్, కెప్టెన్ల ఫొటోషూట్ను ఐసీసీ, పీసీబీ రద్దు చేశాయని cricbuzz వెల్లడించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. భారత్ తటస్థ వేదిక UAEలో తన మ్యాచులు ఆడనుంది.

TG: ఈ ఏడాది వసంత పంచమి ఫిబ్రవరి 3న (సోమవారం) వస్తోంది. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకు సెలవు ఉండనుంది. హాలిడేపై మిగతా స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అటు ఏపీ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే కూడా ఇవ్వలేదు. దీంతో ఆ రాష్ట్రంలో విద్యాసంస్థలు యథావిధిగా నడవనున్నాయి.
Sorry, no posts matched your criteria.