News November 11, 2024

BJP వీడియోలపై ECIకి కాంగ్రెస్ ఫిర్యాదు

image

BJP ప్రకటనలపై ECIకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. JMM, INC, RJD నేతలను నెగటివ్‌గా చూపిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారని పేర్కొంది. BJP4Jharkhand సోషల్ మీడియా అకౌంట్లలో వీటిని పోస్ట్ చేశారని తెలిపింది. ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనే అని వెల్లడించింది. ఝార్ఖండ్‌లో ఆదివాసీలకు తాము వ్యతిరేకమని, BJP వాళ్లు అనుకూలమన్నట్టుగా బ్రాండింగ్ చేస్తున్నారని ఆరోపించింది. ఫిర్యాదు వివరాలను జైరామ్ రమేశ్ Xలో షేర్ చేశారు.

News November 11, 2024

18 నుంచి ‘అగ్రి’ కోర్సులకు మూడో దశ కౌన్సెలింగ్

image

TG: అగ్రికల్చర్, హార్టికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 18 నుంచి మూడో దశ కౌన్సెలింగ్ జరగనుంది. రెండు దశల కౌన్సెలింగ్‌ తర్వాత స్పెషల్‌ కోటా, రెగ్యులర్‌ కోటాలో 213 ఖాళీలు ఏర్పడినట్టు వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ శివాజీ తెలిపారు. పూర్తి వివరాల కోసం www.pjtau.edu.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. మెరిట్ ఆధారంగానే సీట్ల భర్తీ ఉంటుందని, దళారుల మాటలు నమ్మొద్దని సూచించారు.

News November 11, 2024

16లో 10.. మజ్లిస్ ‘మహా’ టార్గెట్!

image

మహారాష్ట్రలో కనీసం 10 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో మజ్లిస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోకి దిగింది. ఈసారి ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉన్న 16 చోట్ల తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రెండు వారాల పాటు 16 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. కాగా గత ఎన్నికల్లో MHలో MIM 35 చోట్ల పోటీ చేసి రెండు సీట్లు గెలుచుకుంది.

News November 11, 2024

బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా: సూర్య

image

సౌతాఫ్రికాతో రెండో T20లో తమ బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నట్లు కెప్టెన్ సూర్య వెల్లడించారు. 125 స్కోరును డిఫెండ్ చేసుకోవాల్సిన స్థితిలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టడం అద్భుతమన్నారు. అతను ఈ స్టేజీకి రావడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఇంకా 2 మ్యాచ్‌లు ఉన్నాయని, చాలా ఎంటర్‌టైన్‌మెంట్ మిగిలే ఉందని వ్యాఖ్యానించారు. నిన్నటి మ్యాచ్‌లో భారత్‌పై SA 3 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

News November 11, 2024

యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు ట్రంప్ సూచన

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం తర్వాత డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడినట్లు ‘రాయిటర్స్’ వెల్లడించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంపై ఇరువురూ చర్చించారని తెలిపింది. వీలైనంత త్వరగా వివాదానికి ముగింపు పలకాలని ట్రంప్ సూచించినట్లు పేర్కొంది. అమెరికా-రష్యా సంబంధాల పునరుద్ధరణకు పిలుపునిచ్చినట్లు రాసుకొచ్చింది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు <<14566201>>జెలెన్‌స్కీతోనూ<<>> ట్రంప్ చర్చించారు.

News November 11, 2024

113 మంది AMVIలకు నియామకపత్రాలు ఇవ్వనున్న CM

image

TG: రవాణాశాఖలో కొత్తగా 113 మందికి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లుగా నియామకపత్రాలను సీఎం రేవంత్ ఈరోజు అందించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొంటారు. కాగా AMVIలకు ఫీల్డ్ లెవల్‌లో విధులు అప్పగించాలని, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

News November 11, 2024

రూ.2.90 లక్షల కోట్లు.. నేడే పూర్తిస్థాయి బడ్జెట్

image

AP: 2024-25కు రూ.2.90 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ నేడు శాసనసభకు సమర్పించనున్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. ఇవే పద్దులను కొల్లు రవీంద్ర, నారాయణ మండలి ముందు ఉంచుతారు. అమరావతి, పోలవరం, సంక్షేమం, విద్య, వైద్యానికి అధికంగా నిధులు కేటాయిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌తో నిధులు ఖర్చు చేసిన విషయం తెలిసిందే.

News November 11, 2024

రెండో T20లోనూ విండీస్‌పై ఇంగ్లండ్ గెలుపు

image

వెస్టిండీస్‌తో జరిగిన 2వ టీ20లోనూ ఇంగ్లండ్ గెలిచింది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 158/8 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ జోస్ బట్లర్ 83(45బంతుల్లో 8ఫోర్లు, 6సిక్సులు) పరుగులతో రాణించారు.

News November 11, 2024

భారీ వర్ష సూచన

image

AP: బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి 3 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని IMD వెల్లడించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో రేపటిలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది తమిళనాడు లేదా శ్రీలంక తీరాలవైపు పయనిస్తుందని అంచనా వేసింది. ఏయే జిల్లాలకు వర్షం ముప్పు ఉందో <>ఇక్కడ క్లిక్<<>> చేసి తెలుసుకోవచ్చు.

News November 11, 2024

జనవరి 13 నుంచి మహా కుంభమేళా.. ఏర్పాట్లు షురూ

image

12 ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభమేళాకు యూపీలోని ప్రయాగ్‌రాజ్ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 13(పుష్య పూర్ణిమ) నుంచి ఫిబ్రవరి 26(శివరాత్రి) వరకు వైభవంగా కొనసాగనుంది. హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలలోనూ కుంభమేళాను జరపనున్నారు. దేశవిదేశాల నుంచి లక్షలాది మంది ప్రజలు, వేలాది మంది సాధువులు, అఘోరాలు రానుండటంతో అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు.