India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చంద్రబాబు సీప్లేన్పై కహానీలు మొదలుపెట్టారని YS జగన్ విమర్శించారు. సీప్లేన్ ఇప్పటిది కాదని 114 ఏళ్ల క్రితమే 1910లో నడిచిందని తెలిపారు. ‘గుజరాత్, కేరళల్లో ఇప్పటికే నడిపి ఆపేశారు. దీన్ని అభివృద్ధికి ప్రమాణంగా చెప్పుకోవడం డప్పాలు కొట్టుకోవడం కాదా? మేం రూ.8,480 కోట్లతో వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. 14 మెడికల్ కాలేజీలు కట్టాం. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు నిర్మించాం’ అని ట్వీట్ చేశారు.
నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈనెల 14 వరకు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు కాకినాడ, కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. రాబోయే 4 రోజుల వాతావరణ వివరాల కోసం <
AP: ప్రజాస్వామ్యంలో విమర్శలు సాధారణమని Dy.CM పవన్ అన్నారు. కానీ పరిమితులు దాటి కుటుంబాలు, కుల మతాలు, దేవతలను దూషించడం కరెక్ట్ కాదని ట్వీట్ చేశారు. దేహబలం, డబ్బు, క్రిమినల్స్ సపోర్ట్ ఉందని బెదిరిస్తే, భయపడటానికి ఇక్కడ ఎవరూ లేరని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని సోషల్ మీడియా దుర్వినియోగదారులు ఇతరులను తిట్టేముందు 100సార్లు ఆలోచించుకోవాలన్నారు. కర్మ ఫలం ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరించారు.
బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు ఆస్ట్రేలియాకు బయలుదేరుతున్న గంభీర్ ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. న్యూజిలాండ్ సిరీస్లో భారత్ వైట్ వాష్కు గురవ్వడంపైనా ఆయన స్పందించే అవకాశం ఉంది. BGTలో తొలి టెస్టు ఈ నెల 22న పెర్త్లో మొదలుకానుండగా ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఆస్ట్రేలియా బయలుదేరారు.
హత్యకు గురైన ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ నిజ్జర్ సహాయకుడు అర్షదీప్ డల్లాను కెనడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. గత నెల 27-28 తేదీల్లో హాల్టన్ ప్రాంతంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనకు సంబంధించి డల్లాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. డల్లా తన భార్యతో కలిసి సర్రేలో నివసిస్తున్నాడు. అతడిపై భారత్లో కిడ్నాప్, హత్య, ఉగ్రవాద సంబంధిత కేసులు ఉన్నాయి.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య గెబేహాలో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
భారత జట్టు: సంజూ, అభిషేక్, సూర్యకుమార్, తిలక్, హార్దిక్, రింకూ, అక్షర్, అర్షదీప్, బిష్ణోయ్, ఆవేశ్, వరుణ్ చక్రవర్తి
సౌతాఫ్రికా జట్టు: రికిల్టన్, హెండ్రిక్స్, మార్క్రమ్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, సైమ్లేన్, కొయెట్జీ, మహరాజ్, పీటర్
AP: దాదాపు 30 వేల దరఖాస్తులు పరిశీలించి తగిన వ్యక్తులకు <<14568142>>నామినేటెడ్ పదవులు<<>> ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. నామినేటెడ్ పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. పదవులు పొందిన వారు పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన వారికి అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు.
పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేందుకు BCCI నిరాకరించినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తమ మ్యాచులను దుబాయ్లో ఆడేలా హైబ్రిడ్ షెడ్యూల్ని PCBకి బీసీసీఐ ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించాలని పాక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమ దేశం నుంచి ఒక్క మ్యాచ్ను కూడా బయటికి తరలించే ప్రసక్తే లేదని పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ ఇప్పటికే తేల్చిచెప్పారు.
AP: విశాఖ రైల్వే జోన్ కోసం స్థలం కేటాయింపులు జరిగాయని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో బీజేపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ సత్తుపల్లి వరకు పూర్తయిందని, అతి త్వరలో మిగిలిన పనులు పూర్తి చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే యోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు.
రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత జట్టును సమర్థవంతంగా లీడ్ చేయగలిగే సత్తా బుమ్రాకు ఉందని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. ‘బుమ్రా సీనియర్ బౌలర్. ఎప్పుడు బౌలింగ్ చేయాలో అతడికి తెలుసు. కెప్టెన్సీతో పాటు బౌలింగ్ బాధ్యతలను బ్యాలన్స్ చేయగలడు. కోహ్లీ, అశ్విన్ లాంటి సీనియర్లు కూడా అతనికి అందుబాటులో ఉంటారు’ అని చెప్పారు. AUSతో తొలి టెస్టులో రోహిత్ ఆడకపోవచ్చని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.