News November 8, 2024

హెచ్‌డీఎఫ్‌సీ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు

image

రుణగ్రహీతలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షాక్ ఇచ్చింది. రెండు షార్ట్ టర్మ్ టెన్యూర్లపై, ఒక లాంగ్ టర్మ్ లోన్లపై వడ్డీ రేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటుని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఏడాది కాలపరిమితితో తీసుకునే వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 9.45శాతానికి చేరుకుంది. అలాగే ఒక్క రోజు రుణాలపై వడ్డీ రేటు 9.15 శాతానికి చేరుకోగా, నెల రుణాలపై వడ్డీ 9.20 శాతానికి చేరుకుంది.

News November 8, 2024

తిరుమలలో భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి గోగర్భం జలాశయం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 52,643 మంది భక్తులు దర్శించుకోగా, 24,527 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు లభించింది. కాగా ఇవాళ తిరుమలలో వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

News November 8, 2024

సిద్ధూ మూసేవాలా తమ్ముడిని పరిచయం చేసిన పేరెంట్స్

image

ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత అతని పేరెంట్స్ IVF ద్వారా మార్చిలో మరో మగ బిడ్డకు జన్మనిచ్చారు. అతనికి శుభ్‌దీప్(సిద్ధూ రియల్ నేమ్ ఇదే) అని పేరు పెట్టారు. తాజాగా అతని ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తమకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తన భార్య ఆరోగ్యం బాగుందని పేర్కొన్నారు. కాగా 58 ఏళ్ల వయసులో పిల్లాడిని కనడంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

News November 8, 2024

APPLY NOW: 457 ప్రభుత్వ ఉద్యోగాలు

image

UPSC ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్-2025కు ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. రైల్వే, టెలికం, డిఫెన్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 457 పోస్టులను భర్తీ చేస్తారు. బీఈ/బీటెక్ పూర్తైన 21-30 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. నవంబర్ 23 నుంచి 29 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష వచ్చే ఏడాది జూన్ 8న రెండు సెషన్లలో జరుగుతుందని తాజాగా UPSC ప్రకటించింది.
వెబ్‌సైట్: <>https://upsc.gov.in/<<>>

News November 8, 2024

నేడు మలేషియాకు KTR

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇవాళ మలేషియా పర్యటనకు వెళ్లనున్నారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాటైన 2014లో ఈ అసోసియేషన్‌ను KCR ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దశాబ్ది వేడుకల్లో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించడంతో KTRతో పాటు జగదీశ్ రెడ్డి, గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, బాల్క సుమన్ బయల్దేరుతున్నారు.

News November 8, 2024

‘వైట్‌హౌస్’ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా మహిళను నియమించిన ట్రంప్

image

అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ పదవుల భర్తీపై దృష్టి పెట్టారు. తాజాగా ‘వైట్‌హౌస్’ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీ వైల్స్‌ను నియమించారు. ఓ మహిళ ఈ బాధ్యతలు చేపట్టడం వైట్‌హౌస్ చరిత్రలో ఇదే తొలిసారి. ట్రంప్ విజయంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ‘సూసీ ఎంతో తెలివైనవారు. వినూత్నంగా ఆలోచిస్తారు. అమెరికాను మరోసారి ఉన్నత స్థానంలో నిలపడానికి ఆమె శక్తివంచన లేకుండా పనిచేస్తారు’ అని ట్రంప్ ప్రశంసలు కురిపించారు.

News November 8, 2024

మీడియా ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తాం: జగన్

image

AP: 40% ఓట్లు వచ్చిన YCPని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని YS జగన్ మండిపడ్డారు. అసెంబ్లీలో అధికార కూటమి, మరొక పక్షం YCP మాత్రమే ఉందని, అలాంటి తమ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే తప్పులు, ప్రజా సమస్యలు వినిపిస్తామనే భయంతోనే ఆ గుర్తింపు ఇవ్వట్లేదని ఆరోపించారు. అసెంబ్లీ జరిగినన్ని రోజులు మీడియా ద్వారా ప్రతిరోజూ ప్రతిపక్షంగా ప్రశ్నలు అడుగుతూనే ఉంటామన్నారు.

News November 8, 2024

అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ నబీ రిటైర్మెంట్

image

అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆయనకు చివరి సిరీస్ అని ప్రకటించింది. కాగా 2009లో అఫ్గాన్ ఆడిన తొలి వన్డేలో నబీ సభ్యుడు. ఇప్పటివరకు ఆయన 165 వన్డేలు ఆడారు. 3,549 పరుగులతోపాటు 171 వికెట్లు కూడా పడగొట్టారు. 2019లోనే నబీ టెస్టుల నుంచి తప్పుకున్నారు. ఇకపై ఆయన టీ20ల్లోనే కొనసాగుతారు.

News November 8, 2024

నిస్సాన్‌లో 9,000 మందికి లేఆఫ్స్

image

జపాన్‌లో మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ‘నిస్సాన్’ భారీగా లేఆఫ్స్‌కు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందులో యూరప్‌లోనే 4,700 జాబ్స్ ఉన్నట్లు వెల్లడించింది. అలాగే కార్ల ఉత్పత్తిని 20% తగ్గిస్తామని తెలిపింది. నిస్సాన్ వార్షికాదాయ అంచనాను 70 శాతం($975 మిలియన్) కుదించింది. తాము తీసుకునే చర్యలతో మళ్లీ పుంజుకుంటామని CEO మకోటో ఉచిద ధీమా వ్యక్తం చేశారు.

News November 8, 2024

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టుకార్డుల ఉద్యమం

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టుకార్డుల ఉద్యమానికి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ సిద్ధమైంది. ఈ నెల 10న విశాఖ ఆర్కే బీచ్ రోడ్ కాళీ మాత ఆలయం వద్ద ఈ ఉద్యమం ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీకి దాదాపు 10 లక్షల పోస్టుకార్డులు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈ కార్డుల ద్వారా ప్రధానిని కోరుతామని కన్వీనర్ రమణమూర్తి చెప్పారు.