India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వచ్చే నెల 3 వరకు అప్లై చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ 18 నుంచి 23 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం <
ఓటీటీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ నెట్ఫ్లిక్స్లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. త్వరలోనే హిందీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. కొరటాల శివ డైరెక్షన్లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా రూ.500కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే.
రష్యాకు మద్దతుగా తమపై యుద్ధానికి దిగిన ఉత్తర కొరియా దళాలకు భారీగా ప్రాణ నష్టం సంభవించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. ప్రస్తుతం 11వేల మంది కిమ్ సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల్లోని కుర్స్క్ రీజియన్లో ఉన్నారని తెలిపారు. తాము ప్రతిఘటించకపోతే మరింత మంది సైనికులను ఆ దేశం యుద్ధంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఉ.కొ సైనికులను పంపడంపై అమెరికా గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.
AP: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల MLC ఎన్నిక నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. MLC రఘురాజుపై శాసనమండలి ఛైర్మన్ అనర్హత వేటు వేయగా, హైకోర్టు దాన్ని రద్దు చేసింది. ఇప్పటికే ఈ స్థానంలో బై ఎలక్షన్ ప్రక్రియను ఈసీ ప్రారంభించగా, ఈ నెల 11తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నెల 28న పోలింగ్ నిర్వహించాల్సి ఉండటంతో ఎన్నిక నిర్వహణపై స్పష్టత కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈసీకి లేఖ రాశారు.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో ప్రతి ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. APలోని బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హిందువుల్లో పెళ్లిళ్లు చేయాలంటే పెద్దలు ప్రధానంగా చూసేది గోత్రం. సప్తర్షులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అత్రి, జమదగ్ని, గౌతముడు, భరద్వాజ, కశ్యపుడు వంశాలను స్థాపించారని, వారి పేర్ల మీదే గోత్రాలు ఏర్పడ్డాయని నమ్మిక. కాలక్రమంలో వంశీకుల పేర్ల మీద మరిన్ని గోత్రాలు వచ్చాయని చెబుతారు. ఒకే గోత్రం ఉన్న వారిని తోబుట్టువులుగా భావించి వివాహం చేయరు. అలా చేస్తే ఆరోగ్యవంతులైన పిల్లలు పుట్టరని భావిస్తారు.
AP: సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చూసి ఎంతో బాధపడేదాన్నని హోంమంత్రి అనిత అన్నారు. ‘కానీ నేను గట్టిదాన్ని. అందుకే చలించలేదు. బలహీన క్షణంలో కఠినమైన నిర్ణయం తీసుకోలేదు. లేదంటే ఆ పోస్టులు చూసి సూసైడ్ చేసుకునేదాన్ని. మానసికంగా బలహీనంగా ఉంటే అంతే సంగతులు. ఆత్మహత్యే శరణ్యం. సోషల్ మీడియాలో కొందరు ఉగ్రవాదుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని ఊరికే వదిలే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఎలాన్ మస్క్కు క్యాబినెట్ పదవి కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అలాగే ఇండో-అమెరికన్లు వివేక్ రామస్వామి, కశ్యప్ పటేల్, బాబీ జిందాల్, నిక్కీ హేలీకి చోటు దక్కనున్నట్లు సమాచారం. తులసీ గబ్బార్డ్, మైక్ పాంపియో, బ్రూక్ రోలిన్స్, మార్కో రూబియో, రాబర్ట్ F.కెన్నడీ Jr, మైక్ వాల్ట్జ్, మిల్లర్లను ట్రంప్ తన క్యాబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.
US అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన సంగతి తెలిసిందే. కాగా ఆయనకు అత్యంత సన్నిహితుడైన <<13637824>>JD వాన్స్<<>> ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ శతాబ్దంలో ఆయన గడ్డం ఉన్న తొలి ఉపాధ్యక్షుడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. 1933లో మీసాలతో ఉన్న చార్లెస్ కర్టిస్ వైస్ ప్రెసిడెంట్గా పని చేశారు. చార్లెస్ ఫెయిర్ బ్యాంక్స్ గడ్డం ఉన్న చివరి వైస్ప్రెసిడెంట్(1905-09)గా నిలిచారు.
పండుగ సీజన్ కావడంతో గత నెలలో భారత వాహన మార్కెట్ మంచి అమ్మకాల్ని నమోదు చేసింది. అత్యధికంగా మారుతీ ఎర్టిగా కారు 18,785 యూనిట్లను విక్రయించింది. 2023 అక్టోబరుతో పోలిస్తే ఇది 32 శాతం వృద్ధి. తర్వాతి స్థానాల్లో స్విఫ్ట్(17,539), క్రెటా(17,497), బ్రెజా(16,565), మారుతీ సుజుకీ ఫ్రాంక్స్(16,419), బలేనో(16,082), టాటా పంచ్(15,470), స్కార్పియో(15,677), టాటా నెక్సాన్(14,759), గ్రాండ్ విటారా(14,083) ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.