India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మోస్తరు నష్టాల్లో మొదలైన స్టాక్మార్కెట్లు ప్రస్తుతం రేంజుబౌండ్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,156 (-2), సెన్సెక్స్ 76,448 (48) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ, మీడియా, ఫార్మా, ఆటో షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. FMCG, ఫైనాన్స్, బ్యాంకు, మెటల్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. విప్రో, అల్ట్రాటెక్, ట్రెంట్, M&M, టెక్M టాప్ గెయినర్స్. HUL, యాక్సిస్ బ్యాంకు, నెస్లేఇండియా, ఎస్బీఐ, BPCL టాప్ లూజర్స్.

చాలాకాలం తర్వాత రోహిత్ శర్మ డొమెస్టిక్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చారు. J&Kతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆయన ముంబై తరఫున బరిలోకి దిగారు. కెప్టెన్ రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. దీంతో యశస్వీతో కలిసి రోహిత్ ఓపెనింగ్కు వచ్చారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఫామ్ లేమితో ఇబ్బందిపడ్డ హిట్ మ్యాన్ ఈ ట్రోఫీలో ఏమేరకు రాణిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా రోహిత్ చివరిసారి 2015లో రంజీ మ్యాచ్ ఆడారు.

TG: వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ బడుల్లో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే హైకోర్టుకు తెలుపగా, ఎలా అమలు చేయాలనేదానిపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. దేశంలో 2009లో తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రీ ప్రైమరీ, ఒకటో తరగతిలో 25% సీట్లు పేదలకు ఇవ్వాల్సి ఉంటుంది. దేశంలో TGతో పాటు మరో 6 రాష్ట్రాలు మాత్రమే దీనిని అమలు చేయడం లేదు.

TG: భార్యను చంపి ఉడికించిన <<15227723>>కేసులో<<>> సంచలనాలు వెలుగుచూశాయి. వెంకటమాధవిని చంపిన భర్త గురుమూర్తి ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్నాడు. మటన్ కొట్టే కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి కుక్కర్లో ఉడికించాడు. ఎముకలను కాల్చి దంచి పొడి చేశాడు. వీటన్నింటినీ కవర్లలో కట్టి డ్రైనేజీల్లో, చెరువులో పడేశాడు. భార్యను చంపడానికి ముందు అతడు ప్రాక్టీస్ కోసం కుక్కను చంపినట్లు తెలుస్తోంది.

భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి DOGE నుంచి తప్పుకొనేలా ఎలాన్ మస్క్ పొగపెట్టారని సమాచారం. ఇందుకోసం ఆయన గట్టిగానే పావులు కదిపారని పొలిటికో తెలిపింది. కొన్ని కారణాలతో ట్రంప్ సర్కిల్లోని కొందరు రిపబ్లికన్లు ఆయన్ను వ్యతిరేకించారని పేర్కొంది. ముందే ఆయన్ను తొలగించేందుకు సిద్ధమయ్యారని వివరించింది. H1B వీసాల అంశంలో తెల్లవారి కల్చర్పై ట్వీట్ అంశాన్ని వాడుకొని మస్క్ వారి మద్దతు కూడగట్టారని వెల్లడించింది.

డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అటు పుష్ప-2 నిర్మాతలు రవిశంకర్, నవీన్, చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో మూడోరోజు రైడ్స్ జరుగుతున్నాయి. దిల్రాజు కుటుంబ సభ్యుల ఇళ్లతోపాటు సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై ఆరా తీస్తున్నారు.

విశాఖలో చిప్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ను CM CBN కోరారు. సర్వర్ల నిర్వహణలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని ఆ సంస్థ క్లౌడ్ CEO థామస్ కురియన్ను రిక్వెస్ట్ చేశారు. స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని DP వరల్డ్ సంస్థను, విశాఖను గ్లోబల్ డెలివరీ సెంటర్గా చేసుకోవాలని పెప్సికోను కోరారు. APని ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేలా సహకరించాలని బిల్ గేట్స్కు CM విజ్ఞప్తి చేశారు.

దిల్స్కూప్.. క్రికెట్ అభిమానులకు ఈ షాట్ సుపరిచితమే. దీని సృష్టికర్త దిల్షాన్ కూడా పరిచయమే. ఇప్పుడు ఆ దిల్షాన్ కూతురు లిమాన్స WU-19 WCలో ఆడుతున్నారు. తండ్రిలాగే స్పిన్ ఆల్రౌండర్ అయిన ఈ 16 ఏళ్ల అమ్మాయి U-19 WCలో ఇప్పటివరకు 5 మ్యాచ్లాడి 4 వికెట్లు పడగొట్టారు. అయితే బ్యాటింగ్లో పెద్దగా రాణించలేదు. ఇవాళ భారత్తో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్లోనూ లిమాన్స బరిలోకి దిగనున్నారు.

ఇంగ్లండ్తో T20 సిరీస్కు ఎంపికైన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నిన్నటి తుది జట్టులో లేకపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. అతడు ఫిట్నెస్ సాధించలేదా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా ముగ్గురు స్పిన్నర్లు ఆడించాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించడంతో షమీకి చోటు దక్కలేదని భావిస్తున్నట్లు మ్యాచ్ అయ్యాక అభిషేక్ చెప్పారు. దీంతో 2వ T20లో షమీ తుది జట్టులో ఉండే అవకాశముంది.

స్టాక్మార్కెట్లు నేడు నెగటివ్ జోన్లో మొదలయ్యే అవకాశముంది. గిఫ్ట్నిఫ్టీ 40pts మేర పతనమవ్వడం దీనినే సూచిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. క్రూడాయిల్, US బాండ్ యీల్డులు, బంగారం ధరలు తగ్గినప్పటికీ డాలర్ ఇండెక్స్ పెరగడం కలవరపెడుతోంది. నిఫ్టీ 23,150 పైస్థాయిలో నిలదొక్కుకోవడం కీలకం. నేడు DR REDDY, HPCL, ADANI ENERGY, ADANI GREEN ENERGY, TEJAS NETWORK ఫలితాలు రానున్నాయి.
Sorry, no posts matched your criteria.