News October 30, 2025

మళ్లీ భీకర దాడులు.. గాజాలో 104 మంది మృతి

image

ఇజ్రాయెల్-గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరోసారి బ్రేకయ్యింది. గాజాపై తాజాగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 104 మంది పౌరులు మరణించగా, 250 మందికి గాయాలయ్యాయి. తమ సైనికుడిని హమాస్ చంపేయడంతో టెర్రర్ గ్రూపులపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ ఆరోపణలను హమాస్ ఖండించింది. స్కూళ్లు, నివాసాలపై IDF బాంబులు వేసినట్లు ఆరోపించింది.

News October 30, 2025

ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో రికార్డు

image

మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సౌతాఫ్రికా ప్లేయర్ మారిజానె కాప్(44W) నిలిచారు. నిన్న ENGతో సెమీస్‌లో 5 వికెట్లు తీసిన ఆమె, భారత మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి(43)ని అధిగమించారు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో లిన్ ఫుల్‌స్టన్(39), మేఘన్ షుట్(39), కరోల్ హోడ్జెస్(37), సోఫీ ఎక్లెస్టోన్(37) ఉన్నారు. కాగా నిన్న SFలో మారిజానె కాప్ బ్యాటింగ్‌లోనూ విలువైన 42 రన్స్ చేశారు.

News October 30, 2025

నాణ్యమైన కొబ్బరి మొక్కల ఎంపిక ఎలా?

image

కొబ్బరిలో అధిక దిగుబడి రావాలంటే మొక్కల ఎంపిక కీలకం. మొక్కల వయస్సు 10-12 నెలలు ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ఆకుల సంఖ్య 6, అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క కాండం మొదలు చుట్టుకొలత పొట్టి రకానికి 8 సెం.మీ., పొడవు రకానికి 10 సెం.మీ. కంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క ఎత్తు పొట్టి రకాలకు 80 సెం.మీ. మరియు పొడవు, హైబ్రిడ్ మొక్కలకు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News October 30, 2025

ఈ ప్రకృతే భగవంతుడా?

image

మానవులు ప్రకృతిలో జన్మించి, ఆ ప్రకృతి ఇచ్చే అన్నం, నీరు, గాలి వంటి జడ వస్తువులతోనే ఎదుగుతున్నారు. ఈ జడ జగత్తును నడిపించే శక్తి దైవమే అని అనాదిగా విశ్వసిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. కదలిక లేని దానిని చలింపజేయడానికి ఏదో ఒక చైతన్య శక్తి అవసరం. ఆ అగోచర శక్తికి ఆకారం లేకపోయినా.. అది అనంత రూపాలు, అసంఖ్యాక నేత్రాలు కలిగి ఉన్నట్లు మనం భావిస్తాం. అది పరమాత్మయే అని కీర్తిస్తాం. <<-se>>#Aushadam<<>>

News October 30, 2025

దీపారాధన, దీపదానం.. వీటి మధ్య తేడాలేంటి?

image

దీపారాధన అంటే మనం వెలిగించే వెలుగు. దీపదానం అంటే మనం పంచే వెలుగు. మనస్సులోని అజ్ఞానం తొలగిపోవడానికి, భగవంతుడిని ఆరాధించడానికి దేవుడి ముందు దీపాన్ని వెలిగించడాన్ని దీపారాధన అంటారు. పుణ్యం కోసం దీపాలతో పాటు స్వయంపాకం బ్రాహ్మణులకు దానం చేయడాన్ని దీపదానం అంటారు. కార్తీక మాసంలో దీపదానం చేయడం ఎంతో పుణ్యమని పండితులు చెబుతున్నారు. ☞ ఇలాంటి ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News October 30, 2025

BIG ALERT: నేడు భారీ వర్షాలు

image

తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంది. అటు ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడవచ్చని వెల్లడించింది.

News October 30, 2025

బాలింతల ఆహారంలో ఇవి ఉన్నాయా?

image

గర్భం దాల్చినప్పటి బిడ్డకు రెండేళ్లు ముగిసేవరకు మహిళలకు అదనపు పోషకాలు అందించాలంటున్నారు నిపుణులు. ఇవే బిడ్డ శారీరక, మానసిక పెరుగుదలకు తోడ్పడుతుంది. అందుకే బాలింతలు మొదటి 6నెలలు రోజువారీ ఆహారంలో 600 క్యాలరీలు, 13.6 గ్రా ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవాలంటున్నారు. 6-12 నెలల మధ్యలో 520 క్యాలరీలు, 10.6గ్రా ప్రొటీన్‌ తీసుకోవాలి. వీటితో పాటు ప్రతిరోజూ 290mg అయోడిన్, 550mg కోలిన్ తీసుకోవాలంటున్నారు.

News October 30, 2025

తిరుమలలో మరిన్ని శాశ్వత క్యూలైన్లు

image

AP: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. SSD టోకెన్లు కలిగిన భక్తుల కోసం తిరుమలలోని ఏటీజీహెచ్ అతిథి గృహం సమీపంలో నూతన షెడ్లు, క్యూలైన్ల మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించింది. బాటగంగమ్మ ఆలయం నుంచి గోగర్భం జలాశయం కూడలి వరకు 3కి.మీ మేర రూ.17.60 కోట్లతో శాశ్వత క్యూలైన్లు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించనుంది. భక్తుల రద్దీని దృష్టిని ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News October 30, 2025

ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ సౌకర్యాలు.. తొలుత కొడంగల్‌లో

image

TG: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వసతులు కల్పించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకోనుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొడంగల్‌లో చేపట్టనున్నారు. స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంటర్నెట్, లైబ్రరీలు, క్రీడా మైదానాలు వంటివి ఏర్పాటు చేస్తారు. టీచర్లు, స్టూడెంట్స్‌కు ID కార్డులు, 8-10th స్టూడెంట్స్‌కు IIT, NEET ఫౌండేషన్ మెటీరియల్ అందిస్తారు.

News October 30, 2025

ప్రకృతి సేద్యంలో వరి సాగు.. సుడిదోమ నివారణ ఎలా?

image

ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి పంటను సాగు చేస్తున్నప్పుడు సుడిదోమ ఉద్ధృతి పెరిగితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా వరి పొలంలో కాలిబాటలను తప్పనిసరిగా తీయాలి. పసుపు పచ్చ మరియు తెల్లని జిగురు అట్టలను ఎకరానికి 20 నుంచి 25 చొప్పున అమర్చాలి. 5 నుంచి 6 లీటర్ల తూటికాడ, కుంకుడు కాయల రసాన్ని 100 లీటర్ల నీటికి కలిపి మొక్కల పాదుల దగ్గర పిచికారీ చేయాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి.