News September 30, 2025

సంక్రాంతి బరిలో మూడు సినిమాలు

image

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పండుగకు రిలీజయ్యే సినిమాల జాబితా మూడుకు చేరింది. జనవరి-2026, 9న రాజాసాబ్, 14న నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’ విడుదల కానుంది. అలాగే సంక్రాంతికి వస్తున్నామని మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మేకర్స్ ఇదివరకే వెల్లడించారు. మరి ఈ మూడు సినిమాల్లో దేనికోసం మీరు ఎదురుచూస్తున్నారు?

News September 30, 2025

41 మంది మృతి.. పరామర్శ లేదు, వివరణ లేదు!

image

కరూర్ తొక్కిసలాట ఘటనతో TVK చీఫ్ విజయ్ ఇంకా రాజకీయ పరిణతి సాధించనట్లు స్పష్టమవుతోంది. దుర్ఘటనలో 41 మంది చనిపోయినా, 50 మందికి పైగా గాయపడ్డా బాధిత కుటుంబసభ్యులను ఇప్పటివరకు పరామర్శించలేదు. కనీసం ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. ‘ఆ ఘటనతో నా గుండె పగిలింది’ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మాత్రమే చేశారు. మరోవైపు విజయ్ పరిహారం ప్రకటించారని, ప్రస్తుతం ఆయన షాక్‌లో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు.

News September 30, 2025

వరిలో ఇనుపదాతు లోపం-నివారణకు సూచనలు

image

వరి పంట నారు దశ, వెన్ను అంకురార్పణ సమయంలో ఇనుము సూక్ష్మపోషకాన్ని ఎక్కువగా వినియోగించుకుంటుంది. ఒకవేళ ఇనుపదాతువు లోపిస్తే పంట విత్తిన 10 నుంచి 15 రోజులలో మొక్కల లేత ఆకులు తెలుపు రంగులోకి మారి ఈనెల మధ్యభాగం పత్రహరితాన్ని కోల్పోతుంది. లీటరు నీటిలో 10 గ్రాముల అన్నభేది చూర్ణము, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి, ఎకరానికి 200 లీటర్ల ద్రావణాన్ని వారం వ్యవధిలో 2,3 సార్లు పిచికారీ చేసి ఈ లోపాన్ని నివారించవచ్చు.

News September 30, 2025

5 సార్లు ఎంపీగా గెలిచిన మల్హోత్రా కన్నుమూత

image

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా (94) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఢిల్లీకి చెందిన ఆయన 5 సార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను భారీ తేడాతో ఓడించి సంచలనం సృష్టించారు. మల్హోత్రా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

News September 30, 2025

భారీ జీతంతో విదేశాల్లో ఉద్యోగాలు

image

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్(OTT) ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. జర్మనీలో ఉద్యోగాలు చేయాలనుకునేవారు అక్టోబర్ 15వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు 2500-3000 యూరోలు జీతంగా చెల్లిస్తారు. https://naipunyam.ap.gov.in/

News September 30, 2025

స్థానిక ఎన్నికలు.. ఖర్చు చేయాలా? వద్దా?

image

TG: స్థానిక ఎన్నికల షెడ్యూల్‌తో రిజర్వేషన్లపై ఆశావహుల్లో అయోమయం నెలకొంది. ఓ వైపు <<17849599>>కేసు<<>> కోర్టులో ఉండగానే షెడ్యూల్ రావడమే దీనికి కారణం. దీంతో పండగ పూట ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఖర్చు పెట్టాలా వద్దా అనే విషయమై వారు గందరగోళానికి గురవుతున్నారు. ఒకవేళ తీరా ఖర్చు చేశాక రిజర్వేషన్లు రద్దు చేస్తూ తీర్పు వస్తే పరిస్థితి ఏంటని కొందరు ఆలోచిస్తున్నారు. కోర్టు తీర్పు వస్తేనే వీరి ఆందోళనకు తెరపడనుంది.

News September 30, 2025

మళ్లీ పాక్‌తో తలపడనున్న భారత్

image

మెన్స్ ఆసియాకప్‌లో పాక్‌‌ను భారత్ మూడుసార్లు చిత్తుచేసిన విషయం తెలిసిందే. ఇక మహిళల జట్టు వంతు వచ్చింది. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో నేడు SLను ఢీకొట్టనున్న భారత్, OCT 5న కొలంబోలో PAKతో తలపడనుంది. అలాగే విశాఖలో 9న SAతో, 12న AUSతో ఆడనుంది. ఇండోర్‌లో 19న ENGతో, నవీముంబైలో 23న NZతో, 26న BANను ఢీకొంటుంది. ఇక 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్, NOV 2 ఫైనల్ జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల వేదికలు ఇంకా ఖరారు కాలేదు.

News September 30, 2025

కుటుంబం కోసం స్టీరింగ్ చేతబట్టి..

image

సరుకు రవాణా ట్రక్కుల్లో డ్రైవర్లుగా పురుషులే కనిపిస్తుంటారు. కానీ హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన నీల్‌కమల్‌ ఠాకూర్‌ కొండదారుల్లో టన్నుల కొద్దీ లోడ్ ఉన్న ట్రక్కులను అలవోకగా డ్రైవ్ చేస్తున్నారు. భర్త మరణంతో ఆమె స్టీరింగ్ చేతబట్టాల్సి వచ్చింది. కుటుంబం కోసం కష్టమైన వృత్తిని ఎంచుకొని ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. నీల్‌ చూపిన దారిలో ఇప్పుడు మరెందరో అతివలు నడుస్తున్నారు.
<<-se>>#InspiringWomen<<>>

News September 30, 2025

GST లాభాలపై రాష్ట్రవ్యాప్త ప్రచారం: సీఎం

image

AP: జీఎస్టీని రెండు శ్లాబులకే పరిమితం చేసినందున రాష్ట్ర ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ పేరిట కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని అధికారులను కోరారు. అక్టోబర్ 19 వరకు 65 వేల సమావేశాలు, కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జీఎస్టీ ఫలాలు తెలిసేలా హోర్డింగులు ఏర్పాటు చేయాలని సూచించారు.

News September 30, 2025

జాతీయ-అంతర్జాతీయ వార్తలు

image

* నేడు బిహార్ తుది ఓటర్ జాబితా రిలీజ్
* ఇటలీ ప్రధాని మెలోనీ బయోగ్రఫీ ‘ఐయామ్ జార్జియా-మై రూట్స్ ప్రిన్సిపుల్స్’కి PM మోదీ ముందు మాట
* భారత్-భూటాన్‌ల మధ్య 2 రైల్వే లైన్‌లు ప్రకటించిన కేంద్రం.. బెంగాల్‌లోని బనార్హట్, అస్సాంలోని కోక్రాజార్ నుంచి ఈ లైన్ల ఏర్పాటు
* ఆన్‌లైన్‌లో శబరిమల అయ్యప్ప ప్రసాదం.. ట్రావెన్‌కోర్ సంస్థానం పరిధిలోని 1,252 దేవాలయాల నుంచి ప్రసాదాలు బుక్ చేసుకునేలా త్వరలో సేవలు.