News September 20, 2025

H-1B వీసా ఫీజు పెంపు.. వీరికి మినహాయింపు

image

H-1B వీసా ఫీజును <<17767574>>భారీగా<<>> పెంచిన US కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ప్రస్తుతం H-1B వీసా కలిగి ఉన్నవారు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కానీ 12 నెలలు లేదా అంతకుమించి ఇతర దేశాల్లో ఉంటున్నవారు రేపటిలోగా తిరిగి USకి వెళ్లాలి. గడువు దాటితే ఫీజు కట్టి వెళ్లాల్సిందే. మరోవైపు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అనుమతించిన వారికి, హెల్త్‌కేర్, మిలిటరీ, ఇంజినీరింగ్ తదితర కీలక రంగాల ఉద్యోగులకు మినహాయింపు ఉండనుంది.

News September 20, 2025

24 లేదా 25 తేదీల్లో మెగా DSC నియామక పత్రాల ప్రదానం

image

AP: రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 24 లేదా 25వ తేదీన నియామక పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 19న నియామక ఉత్తర్వుల అందజేతకు నిర్ణయించినా వర్షాల కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా అధికారిక షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

News September 20, 2025

రేపు OG ప్రీ రిలీజ్ ఈవెంట్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంకా మోహన్ కాంబోలో సుజీత్ తెరకెక్కించిన OG మూవీ ఈనెల 25న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని LB స్టేడియంలో రేపు 4PM నుంచి 10.30 PM వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సమయంలో రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్‌బాగ్, BJR స్టాట్యూ సర్కిల్, పబ్లిక్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

News September 20, 2025

స్థానిక ఎన్నికలపై CM కీలక భేటీ

image

TG: స్థానిక ఎన్నికలు SEP30లోపు పూర్తవాలన్న HC తీర్పును ప్రభుత్వం వచ్చేవారం అప్పీల్ చేయనుంది. కొందరు మంత్రులు, న్యాయ నిపుణులతో CM దీనిపై ఇవాళ చర్చించారని సచివాలయ వర్గాలు Way2Newsకు తెలిపాయి. BC రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం, గవర్నర్ వద్ద బిల్లుల పెండింగ్, వానలు, పండగల సెలవులు తదితరాలు ఆలస్యానికి కారణాలుగా HCకి తెలపాలని నిర్ణయించారట. కాగా, ఇది ఇప్పుడే బయటకు చెప్పొద్దని భేటీలో రేవంత్ హెచ్చరించారు.

News September 20, 2025

భారత్ ఓటమి

image

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. 413 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు స్మృతి మంధాన(125) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. హర్మన్ ప్రీత్(52), దీప్తి శర్మ(72) అర్ధశతకాలతో రాణించినా.. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో విజయానికి 43 పరుగుల దూరంలో ఆలౌటైంది. దీంతో 1-2తో భారత్ సిరీస్ కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో కిమ్ మూడు వికెట్లు తీసి సత్తా చాటారు.

News September 20, 2025

ఇడ్లీ, దోశపై GST.. ప్రచారాస్త్రం కానుందా..?

image

కేంద్రం తాజా GST మార్పుల్లో ఇడ్లీ, దోశలను 5% శ్లాబులోనే ఉంచడం విమర్శలకు దారితీస్తోంది. ఉత్తరాదిన ఎక్కువ తినే రోటీలను 0% పన్నులోకి తీసుకొచ్చి సౌత్‌లో పాపులర్ టిఫిన్ల ట్యాక్స్ మార్చలేదు. అసలే ఉత్తరాది, హిందీ ఆధిపత్య అంశాలు తరచూ ప్రస్తావనకు వచ్చే తమిళనాట రానున్న వేసవిలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అక్కడి పార్టీలకు ఈ పన్ను BJPపై ప్రచారాస్త్రంగా మారవచ్చని విశ్లేషకుల అంచనా. టిఫిన్ ట్యాక్స్‌పై మీ కామెంట్?

News September 20, 2025

పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

image

AP: పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.

News September 20, 2025

Dy.CM పవన్‌కు ధన్యవాదాలు: బోండా ఉమ

image

AP: అసెంబ్లీలో <<17761609>>ప్రస్తావించిన సమస్య<<>>ను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం. ఇలాంటి నాయకత్వం వల్లే ప్రజల్లో మీపై మరింత గౌరవం, విశ్వాసం పెరుగుతున్నాయి’ అని బోండా ట్వీట్ చేశారు.

News September 20, 2025

CAG: రాష్ట్రాల అప్పులు.. రూ.59.6 లక్షల కోట్లు

image

దేశంలోని 28 రాష్ట్రాల అప్పులు పదేళ్లలో మూడింతలు పెరిగాయి. 2013-14లో రూ.17.57 లక్షల కోట్లు ఉండగా 2022-23 వరకు రూ.59.6 లక్షల కోట్లకు చేరాయి. ఈ మేరకు స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్‌లో కంట్రోలర్&ఆడిటర్ జనరల్(CAG) సంజయ్ వెల్లడించారు. అప్పు, GSDP రేషియో పరంగా పంజాబ్(40.35%), నాగాలాండ్(37.15%), బెంగాల్(33.7%) టాప్‌లో ఉన్నాయి. ఒడిశా(8.45%), MH(14.64%), GT(16.37%) తక్కువ రేషియో నమోదు చేశాయి.

News September 20, 2025

భారత్‌తో మ్యాచ్.. పాక్ డ్రామా షురూ!

image

ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌ మధ్య రేపు సూపర్-4 మ్యాచ్ జరగనుంది. దీంతో ఇవాళ జరగాల్సిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను పాక్ బాయ్‌కాట్ చేసింది. తొలి మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని PCB అలకబూనిన విషయం తెలిసిందే. UAEతో మ్యాచ్ ఆడబోమంటూ పెద్ద <<17741773>>డ్రామానే<<>> చేసింది. చివరికి తోక ముడిచి మ్యాచ్ ఆడింది. రేపటి మ్యాచ్ నేపథ్యంలో మళ్లీ కొత్త నాటకానికి తెరలేపింది. దీంతో ఇరుదేశాల మధ్య ఆట ఉత్కంఠగా మారింది.