India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనె తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ‘రాత్రి ఒక టీస్పూన్ కొబ్బరినూనె తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు గోరు వెచ్చటి నీళ్లు తాగాలి. ఇలా చేస్తే శరీరంలో పైత్యరసం సక్రమంగా ఉత్పత్తి జరిగి మలబద్ధకం తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి గాఢ నిద్ర పడుతుంది. లివర్, శరీరంలో కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు’ అని సూచిస్తున్నారు.

AP: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రేపట్నుంచి ప్రారంభమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘1.46 కోట్ల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రేపటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. ATM కార్డు సైజు, క్యూఆర్ కోడ్తో ఈ కార్డు ఉంటుంది’ అని తెలిపారు. ‘ఇది CM చంద్రబాబు ఆధ్వర్యంలో చేపట్టిన గొప్ప కార్యక్రమం. నాదెండ్ల మనోహర్కు ధన్యవాదాలు’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

AP: సీఎం సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి విరాళం అందించారు. హైదరాబాద్లో సీఎం చంద్రబాబును ఆదివారం కలిసి రూ.కోటి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వీరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు చర్చ జరిగింది. సహాయం అందించిన చిరంజీవికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ గతంలోనూ వరద సాయం కింద రూ.కోటి అందించారని గుర్తుచేశారు.

*తిరుపతి తారకరామా స్టేడియంలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలు-2025
*అక్టోబర్ 2నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ తొలగిస్తాం: నారాయణ
*నిడదవోలులో 59 మందికి రూ.29.72 లక్షల విలువైన CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేశ్
*YCP పునాదులను బలపరచడంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు కీలకపాత్ర పోషించాలి: సజ్జల
*శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి 3,80,380 క్యూసెక్కుల నీటి విడుదల

బ్యాంక్ నుంచి తొలిసారిగా లోన్ తీసుకునేవారికి మినిమమ్ సిబిల్ స్కోర్ నిబంధన తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంపై ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి క్లారిటీ ఇచ్చారు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందన్న కారణంతో బ్యాంకులు అప్లికేషన్లు రిజెక్ట్ చేయలేవన్నారు. మరోవైపు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే కంపెనీలు రూ.100కు మించి ఛార్జ్ చేసేందుకు అనుమతి లేదని తెలిపారు.

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘వరల్డ్ క్రికెట్లో ఫిట్నెస్ ట్రెండ్ను స్టార్ట్ చేసిన విరాట్ కోహ్లీకి హ్యాట్సాఫ్. భారత క్రికెట్లో అతడు ఫిట్నెస్ కల్చర్ తీసుకొచ్చారు. ఈ యుగంలో అతడే ఫిట్టెస్ట్ క్రికెటర్. విరాట్ కారణంగా ప్రతి ఒక్క యంగ్ క్రికెటర్ ఫిట్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఓ షోలో సెహ్వాగ్ వ్యాఖ్యానించారు. మీ అభిప్రాయమేంటి?

బాలయ్యకు <<17504424>>వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్<<>>లో చోటు దక్కడంపై CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘హీరోగా బాలకృష్ణ జర్నీ ఇండియన్ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలుస్తుంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కడం ఆయన కృషికి నిదర్శనం’ అని ట్వీట్ చేశారు. నారా లోకేశ్, బ్రాహ్మణి, నారా రోహిత్ సహా పలువురు హీరోలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ SMలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు.

TG: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో జరిగిన స్పీకర్ల సదస్సు సందర్భంగా ఆయనను కలిసి బిల్లు ప్రస్తావన తెచ్చారు. ‘అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. దీని గురించి సీఎం రేవంత్ మిమ్మల్ని ప్రత్యేకంగా కలిశారు’ అని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని అమిత్షా బదులిచ్చారు.

TG: సీఎం రేవంత్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 42శాతం రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే, ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల అంశంపైనా చర్చించనున్నట్లు వెల్లడించాయి. అట్నుంచి ఆయన ఎల్లుండి బిహార్ వెళ్లి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేపు ఉదయం ఓయూలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని తెలుస్తోంది.

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా-ప.బెంగాల్కు ఆనుకొని రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారముందని తెలిపింది.
Sorry, no posts matched your criteria.