India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీవిత చరిత్ర తెరకెక్కనుంది. ‘శ్రీనన్న అందరివాడు’ అనే టైటిల్తో రూపుదిద్దుకునే ఈ మూవీలో పొంగులేటి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. సీనియర్ నటుడు సుమన్.. పొంగులేటి పాత్రను పోషిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. బయ్యా వెంకట నర్సింహ రాజ్ దీనికి డైరెక్టర్, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాసర్ల శ్యాం పాటలు రాస్తున్నారు.

AP: మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు చిలకలూరిపేటకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ మంత్రి విడదల రజినితో విభేదాల కారణంగా ఇప్పటికే ఆయన వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజశేఖర్ వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్గానూ పనిచేశారు.

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్లో పంటకు సరైన ధర దక్కదు.

AP: అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం బాధగానే ఉందని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు అన్నారు. జగన్ ప్రజా తీర్పును గౌరవించాలని, ఎమ్మెల్యేల సంఖ్య ముఖ్యం కాదని చెప్పారు. ఎమ్మెల్యేల బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సరికాదన్నారు. 2019లో 23 సీట్లే వచ్చినా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్మీట్లలో మాట్లాడతామనడం సరికాదని హితవు పలికారు.

పరమానందయ్య శిష్యులు వాగు దాటాక తమను తాము లెక్కించుకోని కథ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ హాస్య కథ వెనుక ఓ గొప్ప పరమార్థం ఉంది. 11 మంది శిష్యులు తమను తాము లెక్కించుకోలేక పది మందే ఉన్నామని బాధపడినట్లుగా, మనం కూడా ఆనందం, సత్యం ఎక్కడో బయట ఉంటాయని బాధపడతాం. వాటి కోసం వెతుకుతాం. ‘అహం బ్రహ్మాస్మి’ అంటే ‘నేనే బ్రహ్మ పదార్థం’ అనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడే జీవితం పరిపూర్ణమవుతుందని దీని సారాంశం.

TG: తాము మేడిగడ్డ-మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు ₹84వేల కోట్లు వెచ్చిస్తే కాంగ్రెస్ తమ్మిడిహట్టి-ఎల్లంపల్లికి ₹35వేల కోట్లు కేటాయించిందని హరీశ్రావు విమర్శించారు. ‘కాళేశ్వరంతో 37లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలనేది లక్ష్యమైతే, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47లక్షల ఎకరాలకే సాగు నీరట! ₹35వేల కోట్లతో కేవలం 4.47లక్షల ఎకరాలకు నీరివ్వాలనే ఆలోచన అద్భుతం. ఇది కదా అసలైన మార్పంటే?’ అని హరీశ్ సెటైర్ వేశారు.

TG: బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 30న గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అమరవీరుల స్మారక చిహ్నం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2500 మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీ చేపట్టనున్నారు. ఆ సమయంలో హెలికాప్టర్ నుంచి పూలను చల్లి వారికి స్వాగతం పలుకుతారు. 28న LB స్టేడియంలో 20వేల మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్ రికార్డు సాధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. ఆరోజు ధ్వజారోహణం నుంచి వేడుకలు మొదలై, అక్టోబర్ రెండవ తేదీన ముగుస్తాయి. రోజువారి వివరాలివే..
Day 1(sep 24) : బంగారు తిరుచ్చి ఉత్సవం, పెద్దశేష వాహనం.
Day 2(sep 25) : చిన్న శేష వాహనం, హంస వాహనం
Day 3(sep 26) : సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం

Day 4(sep 27): కల్పవృక్ష వాహనం,సర్వ భూపాల వాహనం
Day 5(sep 28) : మోహినీ అవతారం, గరుడ వాహనం
Day 6(sep 29) : హనుమంత వాహనం, స్వర్ణ రథోత్సవం, గజ వాహనం
Day 7(sep 30) : సూర్య ప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
Day 8(Oct 1) : రథోత్సవం, అశ్వ వాహనం
Day 9(sep 2) : పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, చక్రస్నానం, ధ్వజావరోహణం

సొరకాయల పంట నాటిన 55-75 రోజులకు కోతకు వస్తుంది. లేత కాయలను గోటితో నొక్కినప్పుడు తొక్క లోపలికి గోరు సులభంగా పోతుంది. అలాగే లేత కాయల తొక్క మీద నూగు ఉంటుంది. కాయ లోపల గింజలు, గుజ్జు గట్టిపడక ముందే కాయలను కోసి మార్కెట్కు తరలించాలి. ముదిరిన కాయల తొక్క గట్టిపడి క్రమంగా తెలుపు రంగులోకి మారుతుంది. కాయలను కోసేటప్పుడు తొడిమలతో సహా కోసి మార్కెట్కు తరలించాలి. కోసిన కాయలు 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
Sorry, no posts matched your criteria.