News September 19, 2025

OFFICIAL: ఆస్కార్ బరిలో జాన్వీ మూవీ

image

ఆస్కార్స్-2026కు భారత్ నుంచి హోమ్‌బౌండ్(Homebound) మూవీ అఫీషియల్‌గా నామినేట్ అయింది. బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ ప్రధాన పాత్రల్లో నీరజ్ ఈ మూవీని తెరకెక్కించారు. పోలీస్ అవ్వాలనుకునే ఇద్దరు మిత్రులకు ఎదురైన సవాళ్లే ఈ చిత్ర కథ. ఈ ఏడాది కేన్స్‌, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించగా అద్భుత స్పందన వచ్చింది. కాగా ఈ మూవీ ఈనెల 26న థియేటర్లలో విడుదల కానుంది.

News September 19, 2025

సమస్యల పరిష్కారంపై CM దృష్టి పెట్టాలి: రాజగోపాల్‌రెడ్డి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ MLA రాజగోపాల్‌రెడ్డి సూచించారు. ‘స్థానిక సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలి. మెజారిటీ MLAల అభిప్రాయం కూడా ఇదేనని భావిస్తున్నాను. సంక్షేమ పథకాలతో పాటు సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనన్న వాస్తవాన్ని CM గుర్తించి వ్యవహరించాలి’ అని ట్వీట్ చేశారు. కాగా దీన్ని BRS నేత హరీశ్‌రావు రీట్వీట్ చేయడం గమనార్హం.

News September 19, 2025

రాష్ట్రంలో రెండు కొత్త పథకాలు ప్రారంభం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం 2 కొత్త పథకాలు ప్రారంభించింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథ మహిళలకు రూ.50,000 ఆర్థిక సాయం అందించనుంది. ‘రేవంతన్నా కా సహారా’ కింద ఫకీర్, దూదేకుల వంటి వెనుకబడిన వర్గాలకు రూ.లక్ష గ్రాంట్‌తో మోపెడ్స్ ఇవ్వనుంది. అర్హులు నేటి నుంచి OCT 6 వరకు <>tgobmms.cgg.gov.in<<>>లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News September 19, 2025

సంగీత రంగంలో జుబీన్ సేవలు అనిర్వచనీయం: PM మోదీ

image

ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ <<17761932>>మరణంపై<<>> ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత సంగీత రంగానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. తన పాటలతో అన్ని వర్గాల ప్రజలను అలరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తి జుబీన్ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా మిగిలి ఉంటారని ట్వీట్ చేశారు.

News September 19, 2025

లిక్కర్ స్కాం కేసు: ఈడీ సోదాల్లో రూ.38లక్షలు స్వాధీనం

image

AP: లిక్కర్ స్కాం కేసులో దేశ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో <<17748928>>2వ రోజు<<>> ED సోదాలు నిర్వహించింది. HYD, బెంగళూరు, చెన్నై, తంజావూరులో తనిఖీలు చేసి లెక్కల్లో చూపని రూ.38లక్షలు స్వాధీనం చేసుకుంది. లిక్కర్ స్కాంలో ప్రభుత్వ ఖజానాకు రూ.4వేల కోట్లు నష్టం వాటిల్లిందని.. ప్రధాన మద్యం బ్రాండ్ల స్థానంలో నిందితులు కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చారని FIRలో సీఐడీ పేర్కొంది. దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.

News September 19, 2025

నేను రాలేదు.. కాంగ్రెస్సే నన్ను బయటకి పంపింది: తీన్మార్ మల్లన్న

image

TG: కాంగ్రెస్ నుంచి తాను బయటికి రాలేదని, ఆ పార్టీయే తనను బయటకు పంపిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ముగిశాక నా ఎమ్మెల్సీ పదవి గురించి ఆలోచిద్దాం. సీఎం రేవంత్ బీసీల ద్రోహి. భూమిలేని రైతులకు రెండెకరాల భూమి ఇవ్వాలి. వరంగల్‌ను రెండో రాజధానిగా ప్రకటించాలి. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తాం’ అని తెలిపారు.

News September 19, 2025

కొత్త మేకప్ ట్రెండ్.. జంసూ

image

కొరియన్ అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ల ముఖంలో ఒక మెరుపు ఉంటుంది. అందుకే చాలామంది కొరియన్ ట్రెండ్స్‌నే ఫాలో అవుతుంటారు. వాటిల్లో కొత్తగా వచ్చిందే జంసూ. ముందుగా ముఖానికి బేబీ పౌడర్ పూసుకుని, పెద్ద గిన్నెలో చల్లటి నీళ్లు వేసి, పౌడర్ రాసుకున్న ముఖాన్ని 30 సెకన్ల పాటు ఆ నీళ్లలో ఉంచుతారు. దీని వల్ల ముఖానికి వేసుకున్న మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీన్ని ప్రయత్నించి చూడండి.

News September 19, 2025

మరో 474 పార్టీలను తొలగించిన EC

image

ఎలక్షన్ కమిషన్(EC) దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల ప్రక్షాళన చేపట్టింది. జూన్ నుంచి కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా యాక్టివ్‌గా లేని మొత్తం 808 పార్టీలను తొలగించింది. ఆగస్టు 9న 334, తాజాగా రెండో ఫేజ్‌లో 474 పార్టీలను లిస్ట్ నుంచి తీసేసింది. అత్యధికంగా UPలో 121, APలో 17 పార్టీలపై వేటు పడింది. ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలను EC తొలగిస్తోంది. 3వ ఫేజ్‌లో 359 పార్టీలు పరిశీలనలో ఉన్నాయి.

News September 19, 2025

కెరీర్‌‌లో బ్రేక్ వచ్చిందా?

image

ఉద్యోగంలో విరామం తీసుకుని, మళ్లీ చేరాలనుకుంటున్న మహిళల కోసం పలు కంపెనీలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. మహిళా ఇంజినీర్ల కోసం టాటా టెక్నాలజీస్‌ ‘రీఇగ్నైట్‌ 2025’, ‘రిటర్న్‌షిప్‌’ కార్యక్రమాన్ని హెచ్‌సీఎల్‌ టెక్‌, మహిళా నిపుణుల కోసం ఇన్ఫీ ‘రీస్టార్ట్‌ విత్‌ ఇన్ఫోసిస్‌’ అనే కార్యక్రమాలు ప్రారంభించాయి. యాక్సెంచర్‌ ఇండియా ‘కెరీర్‌ రీబూట్‌’, విప్రో ‘బిగిన్‌ ఎగైన్‌’ కూడా ఇదే కోవలోకి వస్తాయి.

News September 19, 2025

EXCLUSIVE: త్వరలో గ్రూప్-2 ఫైనల్ లిస్టు!

image

TG: దసరాలోగా గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైనవారి లిస్టు విడుదల కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం 783 పోస్టులకు ఈనెల 13న సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విషయం తెలిసిందే. గ్రూప్-1 నోటిఫికేషన్‌కు న్యాయపరమైన చిక్కులు ఎదురైన కారణంగా ముందుగా గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ పూర్తి చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పండగకు ముందే తుది జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.