News January 17, 2025

పోలవరం ఆలస్యానికి జగనే కారణం: మంత్రి నిమ్మల

image

AP: గోదావరి, కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్‌కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తన కేసులు, బెయిల్ కోసం జలాలపై హక్కులను ఆయన వదులుకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని రైతులు క్షమించబోరని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కూడా జగనే కారణమని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు రెండు ఫేజ్‌లలో 51.15 మీటర్లు, 45.72 మీటర్లు అంటూ ద్రోహం చేశారని మండిపడ్డారు.

News January 17, 2025

రాత్రి భోజనం చేయకపోతే…

image

బరువు తగ్గుతామని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. నైట్ భోజనం చేయకపోతే మధ్యరాత్రి ఆకలివేసి నిద్రకు భంగం కలుగుతుంది. ఎసిడిటీ, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. మరుసటి రోజంతా నీరసంగా ఉంటుంది. బద్దకం, చికాకు పెరుగుతుంది. ఉదయం లేవగానే బాగా ఆకలేసి ఎక్కువ తింటారు. ఇది బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. అందుకే ప్రతిరోజూ రాత్రి తప్పకుండా భోజనం చేయాలి. అయితే రోస్టెడ్‌తో పాటు ఫాస్ట్‌ఫుడ్‌ వంటివి తినకూడదు.

News January 17, 2025

పదిహేనేళ్లలో రూ.5400 నుంచి రూ.4లక్షలు

image

డిగ్రీలున్నా ఉద్యోగాలు రాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు తక్కువ శాలరీ అని వచ్చినదాన్ని వద్దనుకుంటారు. అలా కష్టపడినవారికి ఎక్స్‌పీరియన్స్ తోడైతే విజయాన్ని ఎంజాయ్ చేయొచ్చనే విషయాన్ని గుర్తించరు. అలాంటి వారికి కళ్లు తెరిపించే ఓ ఉదాహరణ నెట్టింట వైరలవుతోంది. ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి 2008లో నెలకు రూ.5400 జీతం వచ్చే ఉద్యోగాన్ని నిలబెట్టుకొని ఇప్పుడు ఏడాదికి రూ.50లక్షలు సంపాదిస్తున్నారు.

News January 17, 2025

రేపు మధ్యాహ్నం రోహిత్ శర్మ ప్రెస్ మీట్

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ రేపు మ.12.30 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ముంబై వాంఖడే స్టేడియం వద్ద చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్‌ను ప్రకటిస్తారు. అలాగే కొన్ని రోజులుగా డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదాలంటూ వస్తున్న వార్తలపై స్పందించే అవకాశం ఉంది. కోచ్ గంభీర్ పాల్గొనే విషయంపై క్లారిటీ లేదు. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్.

News January 17, 2025

లక్షణాలు లేని హార్ట్ ఎటాక్‌ను గుర్తించిన యాపిల్ వాచ్!

image

ఓ వ్యక్తికి సైలెంట్ హార్ట్ ఎటాక్ రాగా.. దీనిని యాపిల్ గుర్తించిందని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. ‘నా 60 ఏళ్ల స్నేహితుడు వ్యాయామం చేస్తుండగా మొబిట్జ్ టైప్ 2 అట్రియో-వెంట్రిక్యులర్ బ్లాక్ (ఒక రకమైన హార్ట్ బ్లాక్) లక్షణాలు గమనించారు. అతడిలో ఎలాంటి సిమ్‌టమ్స్ కనిపించలేదు. వెంటనే కార్డియాలజిస్ట్ చికిత్స చేయడంతో కోలుకున్నాడు. అతని యాపిల్ వాచ్‌లో హార్ట్ ఎటాక్ అంటూ అలర్ట్ రావడం చూశాం’ అని తెలిపారు.

News January 17, 2025

రేపు ఉ.10 గంటలకు..

image

AP: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి APR నెల కోటాను TTD రేపు ఉ.10 గంటలకు విడుదల చేయనుంది. ఈ టికెట్ల కోసం 20వ తేదీ ఉ.10 గంటల వరకు <>ఆన్‌లైన్‌లో<<>> రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో ఎంపికైన వారికి టికెట్ల కేటాయింపు జరుగుతుంది. అలాగే కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవా టికెట్లను ఈ నెల 21న ఉ.10కి రిలీజ్ చేయనుంది. రూ.300 టికెట్లు ఈ నెల 24న విడుదల కానున్నాయి.

News January 17, 2025

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. 12 మంది భారతీయుల మృతి

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతున్న 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది. మరో 16 మంది అదృశ్యమైనట్లు వెల్లడించింది. మొత్తం 126 మంది ఇండియన్స్ యుద్ధంలో పాల్గొనగా 96 మంది సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. ఇటీవల కేరళకు చెందిన ఓ వ్యక్తి రష్యా తరఫున పోరాడుతూ చనిపోయిన విషయం తెలిసిందే. యుద్ధంలో భారతీయుల మరణాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

News January 17, 2025

ఉద్యోగులపై పెండింగ్ కేసులు.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

image

AP: ఉద్యోగులపై విజిలెన్స్, శాఖాపరమైన కేసుల దర్యాప్తు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం సరికాదని Dy.CM పవన్ అన్నారు. దీనివల్ల వారి పని తీరుపై ప్రభావం పడుతుందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్లో ఉన్న కేసులపై ఆరా తీశారు. 3 వారాల్లో తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. త్వరగా కేసులను పరిష్కరించడంపై దృష్టిసారించాలన్నారు.

News January 17, 2025

సెలవులు ముగిశాయ్

image

తెలంగాణలోని స్కూళ్లకు నేటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. దాదాపు వారం రోజులు పండగ హాలిడేస్ ఎంజాయ్ చేసిన విద్యార్థులు రేపటి నుంచి బడి బాట పట్టనున్నారు. రాబోయే 2, 3 నెలలు పరీక్షాసమయం కావడంతో స్టూడెంట్స్ ఇక పుస్తకాలకే అంకితం కానున్నారు. కాగా ఈనెల 11 నుంచి 17 వరకు ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అటు జూనియర్ కాలేజీలు ఇవాళ్టి నుంచి పున:ప్రారంభం అయ్యాయి.

News January 17, 2025

రేషన్‌కార్డుల ఎంపికలో గందరగోళం.. విమర్శలు

image

TG: రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తమకు అందజేసిన జాబితా ప్రకారం గ్రామాల్లో సిబ్బంది సర్వే చేస్తున్నారు. ప్రజాపాలన సందర్భంగా కార్డు కోసం అప్లై చేసినా జాబితాలో పేరు లేకపోవడం ఏంటని చాలామంది సిబ్బందిని నిలదీస్తున్నారు. అర్హుల ఎంపికకు ప్రభుత్వం దేన్ని ప్రాతిపదికగా తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. కులగణన ఆధారంగా సర్కార్ జాబితా రూపొందించినట్లు సమాచారం.