News September 14, 2025

తిరుమల శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి సర్వదర్శనం క్యూ లైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి కొనసాగుతోంది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. శనివారం 82,149 మంది స్వామి వారిని దర్శించుకోగా 36,578 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు వచ్చిందని ప్రకటించింది.

News September 14, 2025

నేడు మళ్లీ చర్చలు.. విఫలమైతే కాలేజీలు బంద్

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్(FATHI) రేపటి నుంచి ఇంజినీరింగ్ కాలేజీల <<17690252>>బంద్‌కు<<>> పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిధుల విడుదలపై నిన్న Dy.CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబుతో FATHI జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇవాళ మరోసారి మీటింగ్ జరగనుంది. సయోధ్య కుదరకపోతే రేపటి నుంచి ప్రొఫెషనల్ కాలేజీలు, 16 నుంచి డిగ్రీ, PG కాలేజీలు బంద్ చేసే అవకాశముంది.

News September 14, 2025

మైథాలజీ క్విజ్ – 5

image

1. 8 దిక్కులు మనకు తెలుసు. మరి 10 దిశల్లో మరో రెండు దిశలు ఏవి?
2. గోదావరి నది ఏ జ్యోతిర్లింగ క్షేత్ర సమీపంలో జన్మించింది?
3. వసంత పంచమి ఏ తెలుగు మాసంలో వస్తుంది?
4. అంబ ఎవరిపై ప్రతీకారం తీర్చుకునేందుకు శిఖండిగా పుట్టింది?
5. జనకుడికి నాగలి చాలులో ఎవరు కనిపించారు? (సరైన సమాధానాలను రేపు 7AM పబ్లిష్ చేస్తాం.)
– <<17690127>>మైథాలజీ క్విజ్-4<<>> ఆన్సర్స్: 1.శివుడు 2.రావణుడు 3.కేరళ 4.పూరీ జగన్నాథ ఆలయం 5.వరాహ అవతారం

News September 14, 2025

ఇంట్లో గడియారం ఏ దిక్కున ఉండాలి?

image

వాస్తు శాస్త్రం ప్రకారం.. గడియారాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇది ఇంట్లో సానుకూలత, శాంతిని పెంచుతుందని అంటున్నారు. ‘దక్షిణ దిశలో గడియారం ఉంచడం అశుభం. ఇది పురోగతిని అడ్డుకుంటుంది. అలాగే విరిగిన లేదా ఆగిపోయిన గడియారాలను ఇంట్లో ఉంచకూడదు. గడియారాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. గడియారాన్ని బహుమతిగా ఇవ్వడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు’ అని సూచిస్తున్నారు.

News September 14, 2025

AP న్యూస్ రౌండప్

image

*తిరుమల కొండలు, భీమిలి ఎర్రమట్టి దిబ్బలకు UNESCO రూపొందించిన తాత్కాలిక జాబితాలో చోటు.
*జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా 60,953 కేసులు పరిష్కారం, రూ.109.99 కోట్ల పరిహారం అందజేత.
*గుంటూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు. రెండు ఘటనల్లో నలుగురు మృతి.
*రేపు మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదలకు విద్యాశాఖ కసరత్తు.
*స్వచ్ఛాంధ్ర పురస్కారాలు.. తొలి విడతలో 16 విభాగాలకు 52 అవార్డులు.

News September 14, 2025

వరి: సెప్టెంబర్‌లో ఎరువుల యాజమాన్యం ఇలా..

image

తెలుగు రాష్ట్రాల్లో వరినాట్లు దాదాపు <<17675869>>పూర్తయ్యాయి<<>>. పంట వివిధ దశల్లో ఉంది. పిలక దశలో ఉన్న పైర్లలో ఎకరానికి 35KGల యూరియాను బురద పదునులో చల్లుకోవాలి. అంకురం దశలో ఉంటే 35KGల యూరియాతోపాటు 15KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును వేసుకోవాలి. పిలకలు వేసే దశలో పొలంలో కనీసం 2CM వరకు నీరు ఉండేలా చూసుకోవాలి. కాగా ఈ నెలలో వరినాట్లు వేయరాదు. వేస్తే పూత దశలో చలి వల్ల గింజ పట్టక దిగుబడిపై ప్రభావం చూపుతుంది.

News September 14, 2025

టారిఫ్ వార్: ట్రంప్‌కు చైనా స్ట్రాంగ్ కౌంటర్

image

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు చైనాపై 50-100% టారిఫ్స్ వేయాలని ట్రంప్ నిన్న NATOకు <<17700504>>లేఖ<<>> రాసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్‌కు చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘మేం యుద్ధాలను సృష్టించం.. పాల్గొనం. యుద్ధాలతో సమస్యలను పరిష్కరించలేం. ఆంక్షలు వాటిని మరింత క్లిష్టతరం చేస్తాయి’ అని స్పష్టం చేశారు. కాగా చైనా ముందు నుంచి ట్రంప్ చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.

News September 14, 2025

రోజురోజుకూ పడిపోతున్న ఉల్లి ధరలు

image

AP: కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు పాతాళం వైపు పయనిస్తున్నాయి. రైతుల వద్ద క్వింటాను మార్క్‌ఫెడ్ రూ.1,200కు కొనుగోలు చేయగా నిల్వలు పెరిగిపోయాయి. కొత్త సరకు వస్తే దించుకోవడానికి స్థలం లేకపోవడంతో తమ వద్ద ఉన్న స్టాకును కొనాలని వ్యాపారులను మార్క్‌ఫెడ్ కోరింది. తొలుత ఆసక్తి చూపని వ్యాపారులు ఆపై నాణ్యతను బట్టి క్వింటా రూ.50 నుంచి రూ.450 వరకు కొన్నారు. 800 టన్నుల వరకు కొనుగోళ్లు జరిగాయి.

News September 14, 2025

‘వాహనమిత్ర’కు ఎవరు అర్హులంటే?

image

AP: <<17704079>>వాహనమిత్ర<<>> కింద రూ.15 వేలు పొందాలంటే ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్‌గా ఉండాలి. గూడ్స్ వాహనాలకు వర్తించదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీలో ఒక్క వాహనానికే పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, IT కట్టేవారు ఉండకూడదు. సిటీల్లో 1000 చ.అ.లకు మించి స్థిరాస్తి ఉన్నవారు అనర్హులు. AP రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లుండాలి. కరెంట్ బిల్లు నెలకు 300యూనిట్లలోపు రావాలి.

News September 14, 2025

వరి: సెప్టెంబర్‌లో కలుపు, చీడపీడల నివారణ

image

* నాటిన 12 రోజులకు వరి పొలంలో కలుపు ఉంటే సైహలోఫాప్-పి-బ్యులైల్ 1.5ML లేదా బిస్‌ఫైరిబాక్ సోడియం 0.5ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* అగ్గి తెగులు: ఐసోప్రోథయోలేన్ 1.5ML లేదా కాసుగామైసిన్ 2.5ML లేదా ట్రైసైక్లజోల్+మ్యాంకోజెబ్ 2.5గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* పాముపొడ తెగులు: హెక్సాకొనజోల్ 2ML లేదా ప్రొపికొనజోల్ 1ML లేదా వాలిడామైసిన్ 2ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.