News November 7, 2024

మహిళలకు ప్రతినెలా రూ.3వేలు: రాహుల్ గాంధీ

image

మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మహా వికాస్ అఘాడీ (MVA) ఐదు హామీలను ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.3వేలు ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతోపాటు రైతులకు రూ.3లక్షల వరకు రుణమాఫీ, నిరుద్యోగులకు నెలకు రూ.4వేలు ఇస్తామని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్యబీమా కల్పిస్తామన్నారు.

News November 7, 2024

చాహల్‌పై చిన్న చూపెందుకు?

image

టీమ్ఇండియా బౌలర్ చాహల్‌కు గడ్డుకాలం నడుస్తోంది. అవకాశం వచ్చిన ప్రతిసారి అదరగొట్టే చాహల్‌కు ప్రస్తుతం ఛాన్సులే రావట్లేదు. దీంతో IPLలో, Tటీ20ల్లో చాహల్ ప్రతిభను గుర్తించట్లేదని అభిమానులు విమర్శలు చేస్తున్నారు. RCB,RR తరఫున చాహల్ (139, 66) అత్యధిక వికెట్లు పడగొట్టినా జట్టు నుంచి రిలీజ్ చేశారని మండిపడుతున్నారు. T20 క్రికెట్‌లోనూ అత్యధిక వికెట్లు పడగొట్టినా జట్టులో చోటు ఇవ్వట్లేదంటున్నారు. మీ కామెంట్?

News November 7, 2024

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధిస్తూ చట్టం: AUS PM

image

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించేలా చట్టం తీసుకొస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. సోషల్ మీడియా పిల్లలకు హాని చేస్తోందనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌లో చట్టం ప్రవేశపెడతామని, ఆమోదించిన 12 నెలల తర్వాత అమల్లోకి వస్తాయని తెలిపారు. మన దగ్గర ఇలాంటి చట్టం వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.

News November 7, 2024

APPLY NOW.. నెలకు రూ.5000

image

దేశంలోని టాప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ పొందేలా నిరుద్యోగుల కోసం కేంద్రం PM ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.5000 చొప్పున ఏడాది పాటు ఇస్తారు. కంపెనీలో చేరే ముందు మరో రూ.6వేలు ఇస్తారు. ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. 21-24 ఏళ్లలోపు వారు అర్హులు. SSC నుంచి డిగ్రీలోపు చదివి ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షలు దాటకూడదు. ఈ నెల 10 చివరి తేదీ. దరఖాస్తు కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News November 7, 2024

ఓటమిని ఒప్పుకోవాల్సిందే.. సంతృప్తిగానే ఉన్నా: కమలా హారిస్

image

అమెరికా ఎన్నికల ఫలితాలను కచ్చితంగా ఒప్పుకోవాల్సిందేనని కమలా హారిస్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. తాను ఇప్పటివరకు సాధించినదాని పట్ల సంతృప్తిగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. ‘చాలా మంది దేశం చీకటిలోకి వెళ్తుందని భావిస్తున్నారు. కానీ అలా జరగదని నేను నమ్ముతున్నా. అమెరికా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ప్రజలందరికీ న్యాయం, గౌరవం, అవకాశాల కోసం పోరాటం కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.

News November 7, 2024

DSCలో ‘సమగ్ర శిక్ష’ సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్

image

AP: సమగ్రశిక్ష పథకం కింద పనిచేస్తున్న CRP, MIS కోఆర్డినేటర్లు, CRTలకు మెగా డీఎస్సీలో వెయిటేజీ మార్కులు ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. వీరు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నారని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ పేర్కొంది. విధుల్లో బిజీగా ఉన్నందున మిగిలిన అభ్యర్థుల్లా వీరికి సన్నద్ధతకు అవకాశం ఉండదని తెలిపింది. 2019 డీఎస్సీలోనూ వెయిటేజ్ మార్కులు ఇచ్చారని గుర్తు చేసింది.

News November 7, 2024

పచ్చి పాలు తాగుతున్నారా?

image

పాలు తాగడం మంచి అలవాటే. కానీ, పచ్చి పాలను కాచకుండా తాగడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే శరీరానికి కలిగే దుష్ర్పభావాలు ఇవే. ఫుడ్ పాయిజనింగ్, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు సంభవించడం, యువకుల్లో ప్రాణాపాయం కలిగించే ఇన్ఫెక్షన్ రావడం, మహిళల్లో గర్భస్రావ పరిస్థితులు ఏర్పడటం వంటి ప్రమాదాలు జరగవచ్చు.

News November 7, 2024

కులగణనకు మద్దతుగా చైతన్య యాత్ర

image

TG: కులగణనకు మద్దతుగా అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు చైతన్య యాత్రను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. కులగణన సమగ్రంగా జరిగితే BCల లెక్క తేలుతుందన్నారు. దీంతో జనాభా ప్రకారం బీసీలకు బడ్జెట్, రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ యాత్ర ద్వారా 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలు, 650 మండలాలు, 12,750 గ్రామాల్లో బీసీలను చైతన్యం చేస్తామని ఆయన చెప్పారు.

News November 7, 2024

అమెరికా CIA చీఫ్‌గా కశ్యప్ పటేల్?

image

ట్రంప్ ప్రభుత్వంలో ఇండో అమెరికన్‌కు అత్యున్నత పదవి దక్కనున్నట్లు సమాచారం. గూఢచార సంస్థ CIA చీఫ్‌గా కశ్యప్ పటేల్‌ను నియమిస్తారని తెలుస్తోంది. గుజరాత్ మూలాలున్న ఈయన పూర్వీకులు తూర్పు ఆఫ్రికా నుంచి USకు వలస వచ్చారు. పటేల్ 1980లో న్యూయార్క్‌లో జన్మించారు. లండన్ వర్సిటీ నుంచి ఇంటర్నేషన్ లా అభ్యసించారు. ట్రంప్ తొలి టర్మ్‌లో డిఫెన్స్, ఇంటెలిజెన్స్ విభాగాల్లోని అత్యున్నత పదవుల్లో కశ్యప్ పనిచేశారు.

News November 7, 2024

BSNL సంచలనం.. సిమ్ లేకుండానే కాల్స్, మెసేజ్‌లు?

image

సిమ్ లేకుండానే కాల్స్, మెసేజ్‌‌లు చేసేలా సరికొత్త టెక్నాలజీని BSNL త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో నెట్‌వర్క్ లేకపోయినా, సముద్రాలు, విపత్తులు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నా సేవలు పొందవచ్చు. డైరెక్ట్ టూ డివైజ్ టెక్నాలజీ కోసం USకు చెందిన వయాశాత్‌తో కలిసి దీనిని పరీక్షిస్తోంది. శాటిలైట్, ప్రాంతీయ మొబైల్ నెట్‌వర్క్‌లను లింక్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. శాటిలైట్లే సెల్‌ఫోన్ టవర్లు అవుతాయి.