India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రానికి గర్వకారణమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ప్రధాని మోదీ ఆమోదించిన రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అందించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్లాంట్కు పెద్దపీట వేసిన ప్రధాని మోదీకి ఈ క్రెడిట్ దక్కాలి. కేంద్రానికి ధన్యవాదాలు’ అని తెలిపారు.
FIFA ప్రపంచ కప్-2030 నేపథ్యంలో మొరాకోలోని పలు నగరాలను వివిధ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు సందర్శించనున్నారు. అందుకు అనుగుణంగా నగరాలు మరింత అందంగా కనిపించేందుకు 30 లక్షల వీధి కుక్కలను వధించాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని జంతు హక్కుల ప్రచారకర్త జేన్ గుడాల్ ఖండించారు. అంతర్జాతీయ ఫుట్బాల్ అసోసియేషన్ను సంప్రదించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పారాలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించిన తెలుగు తేజం దీప్తి జీవాంజి అర్జున అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా దీప్తి అవార్డు తీసుకున్నారు. వరంగల్ జిల్లా కల్లెడకు చెందిన దీప్తి పారాలింపిక్స్ ఉమెన్స్ 400మీ పరుగులో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు.
కొత్తగా తెచ్చిన ‘వెజ్ మోడ్ ఎనేబుల్మెంట్ ఫీ’పై విమర్శలతో జొమాటో వెనక్కి తగ్గింది. తాను వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసినందుకు అదనంగా ₹2 ఛార్జ్ చేయడంపై ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘దేశంలో శాకాహారిగా ఉండటం ఖర్చుతో కూడుకున్నది’ అని జొమాటో CEOను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశాడు. ఇది వైరల్ కాగా స్పందించిన CEO దీపిందర్, తప్పుకు క్షమాపణ కోరడంతో పాటు ఈ స్టుపిడ్ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేస్తానన్నారు.
స్టీల్ ప్లాంట్కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. నిన్నటి క్యాబినెట్ సమావేశంలో ప్లాంట్ ఈక్విటీ మద్దతు కింద రూ.10,000 కోట్లు ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయించాం. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఉక్కు రంగ ప్రాముఖ్యతను ఇది వెల్లడిస్తోంది’ అని పేర్కొన్నారు.
8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2016లో 7th పే కమిషన్ ఏర్పాటుచేయగా, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. దీంతో బేసిక్ శాలరీ ₹7K నుంచి ₹18Kకు పెరిగింది. ఇప్పుడు 8వ కమిషన్లో ఫిట్మెంట్ 2.86 ఉంటుందని, బేసిక్ జీతం ₹51,480కి పెరుగుతుందని నిపుణుల అంచనా. కనీస పెన్షన్ ₹9K నుంచి ₹20+Kకి పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు.
విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదాన్ని కేంద్రం కాపాడిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. స్టీల్ ప్లాంట్కు డైరెక్ట్ ఈక్విటీ కింద రూ.10,300Cr, షేర్ క్యాపిటల్ కింద రూ.1,140Cr బదిలీ చేసేలా కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. దీంతో ప్లాంట్ పరిరక్షణకు ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయని పేర్కొన్నారు.
AP: స్టీల్ ప్లాంట్కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయమని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈమేరకు ఆయన ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు అంటే పరిశ్రమ మాత్రమే కాదని, దీనికి ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో నిందితుడిని అరెస్టు చేయలేదని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఉదయం ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకోగా, అతడి ముఖం నిన్న విడుదలైన సీసీ ఫుటేజ్లోని నిందితుడితో సరిపోలడంతో దొరికాడని అంతా అనుకున్నారు. కానీ తాము విచారించిన వ్యక్తికి ఈ దాడితో సంబంధం లేదని కాసేపటి క్రితం పోలీసులు వెల్లడించారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ‘భాగ్యం’ క్యారెక్టర్లో హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ నటనపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి. అయితే, ఆమె తండ్రితో పాటు మేనత్త కూడా ఇండస్ట్రీ వారే అని చాలా మందికి తెలియదు. జంధ్యాల తెరకెక్కించిన ‘నెలవంక’తో పాటు పలు చిత్రాల్లో నటించిన రాజేశ్ కూతురే ఈ ఐశ్వర్య. అంతేకాదు ఆమె తెలుగులో పాపులర్ నటి శ్రీలక్ష్మికి మేనకోడలు. ఐశ్వర్య నటన ఎలా ఉందో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.