India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: MLC కవిత హిందూ మజ్దూర్ సభ గౌరవ అధ్యక్షురాలిగా నియమితులయ్యే అవకాశం ఉంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి(TBGKS)గా ఆమె అందించిన సేవలకు గుర్తుగా HMS అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని సంఘం నాయకులు నిర్ణయించారు. AUG 31న మంచిర్యాల(D) శ్రీరాంపూర్లో జరిగే సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఇటీవలే TBGKS అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను తొలగించి, కొప్పుల ఈశ్వర్ను ఎన్నుకున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనుంది. ‘తుఫాన్ ఆగిపోయింది.. ఇప్పుడు గాలి వీస్తోంది’ అంటూ సెకండ్ సింగిల్పై అంచనాలు పెంచేసింది. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా, DVV దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.

TG: డిగ్రీ ఫస్టియర్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే దోస్త్ ఫేజ్-2 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 24, 25న వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంది. ఈ కౌన్సెలింగ్లో భాగంగా ఒక కాలేజీలో సీటు పొందిన విద్యార్థి, అదే కాలేజీలో మరో బ్రాంచిలో సీటు ఖాళీగా ఉంటే మార్చుకోవచ్చు. మరో కాలేజీలో అలాంటి అవకాశం ఉండదు.

HYDలో మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్యను చంపి <<17500952>>ముక్కలుగా చేసిన<<>> ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. నిన్న భార్యను చంపి రంపంతో ముక్కలుగా చేసినట్లు పోలీసులు గుర్తించారు. తల, కాళ్లు, చేతులను మూసీలో పడేశానని.. ఛాతి భాగం తీసుకెళ్లలేకపోయానని మహేందర్ చెప్పాడు. పడేసిన అవయవాల కోసం నదిలో గాలిస్తున్నారు.

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల 29న జరిగే క్యాబినెట్ భేటీలో స్పష్టత రానుంది. BCలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లాలనుకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. నెలాఖరులో పోలింగ్ జరగొచ్చని సమాచారం. కాగా ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక, న్యాయ సలహా మేరకు ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనుంది.

‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్కు మద్దతు ఇచ్చిన తుర్కియేకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. గత 3 నెలల్లో భారత పర్యాటకుల సంఖ్య 50% తగ్గింది. ఈ ఏడాది మేలో 31,659 మంది ఇండియన్స్ ఆ దేశంలో పర్యటించగా, జులైలో ఆ సంఖ్య 16,244కి తగ్గింది. ‘ఆపరేషన్ సిందూర్’లో తుర్కియేకు చెందిన డ్రోన్లను పాక్ ఉపయోగించింది. అటు పాక్కు సపోర్ట్ చేసిన అజర్బైజాన్లోనూ భారత పర్యాటకుల సంఖ్య గతేడాది జూన్తో పోలిస్తే 60% తగ్గింది.

TG: JNTUతో పాటు అనుబంధ కాలేజీల్లో మిగిలిపోయిన ఇంజినీరింగ్ సీట్లకు ఈ నెల 26 నుంచి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. 26న వర్సిటీ క్యాంపస్, సుల్తాన్పూర్, 28న జగిత్యాల, మంథని, 29న వనపర్తి, సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్ కాలేజీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆయా కాలేజీల్లో సీట్లు కావాల్సిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని అధికారులు సూచించారు.

కోడిగుడ్డులోని పచ్చసొన మంచిది కాదని కొందరు దాన్ని దూరం పెడతారు. అయితే ఎగ్ ఎల్లోతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని ICMR తెలిపింది. అందులోని విటమిన్ B12, D, A, ఐరన్, ఒమెగా-3 అనే హెల్తీ ఫ్యాట్స్తో శరీరానికి పోషకాలు అందుతాయి. Lutein, Zeaxanthin కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొలిన్ వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. రోజుకు రెండు గుడ్లు (ఎల్లోతో సహా) తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

APలో కొత్త మద్యం బ్రాండ్ల ఎంట్రీకి బ్రేక్ పడింది. అనుమతి కోసం ఎక్సైజ్ శాఖ చేసిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు తిరస్కరించినట్లు తెలుస్తోంది. కొత్త వాటిలో చాలా వరకూ సిమిలర్ సౌండింగ్(పాత బ్రాండ్ల పేర్లకే చిన్న మార్పులు చేసి ప్రవేశపెడతారు) ఉండటంతో దీనిపై ముందుకెళ్లకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అటు ప్రస్తుతం బ్రాండ్ల ధరల సవరణ టెండర్ల అంశమూ క్యాబినెట్ ముందుకు రాగా, సిఫార్సుల ఆధారంగా ధరల్లో సవరణలుంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఏపీలోని విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.230, గుంటూరు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రూ.180గా ఉంది. అటు హైదరాబాద్లో రూ.190-200, వరంగల్లో రూ.210 వరకు విక్రయిస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.