News January 17, 2025

ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్‌మెంట్

image

IND యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. UPకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో తాజాగా ఆయన ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీంతో వీరికి సహచర క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రియా సరోజ్ ఇటీవల మచ్లిషహర్ సెగ్మెంట్ నుంచి 25 ఏళ్లకే ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఢిల్లీ వర్సిటీలో చదివి సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేశారు. తండ్రి 3 సార్లు ఎంపీగా గెలిచారు.

News January 17, 2025

BIG BREAKING: గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీ మార్పులు

image

AP: 14వేలకు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ‘గత ప్రభుత్వం వాటిలో 11 మంది చొప్పున సిబ్బందిని కేటాయించింది. ఇకపై 3,500+ జనాభా పరిధి ఉన్న సచివాలయంలో 8 మంది, 2,500+ ఉన్న చోట ఏడుగురిని, మిగతా వాటిలో ఆరుగురు సిబ్బందిని ఉంచుతాం. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ, పట్టణాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ హెడ్‌గా ఉంటారు’ అని పేర్కొన్నారు.

News January 17, 2025

ప్రకృతి విలయం నుంచి తేరుకునేందుకు దశాబ్దం!

image

అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌‌లో ఏర్పడిన కార్చిచ్చు వల్ల రూ.లక్షల కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వినాశకర కార్చిచ్చు ప్రభావం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఒక దశాబ్ద కాలం పట్టొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. దీనివల్ల మౌలిక సదుపాయాలు, గృహాలు & ప్రకృతికి విస్తృతమైన నష్టం వాటిల్లింది. పురోగతి క్రమంగా ఉన్నప్పటికీ, అధికారులు నగరాన్ని పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి.

News January 17, 2025

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

image

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 13 వరకు సమావేశాలు కొనసాగుతాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు.

News January 17, 2025

అలాంటి ఇళ్ల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్

image

AP: ఆక్రమణలకు గురైన అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. వీరు 15-10-2019 నాటికి దరఖాస్తు చేసుకుని ఉండాలని తెలిపారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లలో పలు కారణాలతో ఇళ్లు నిర్మించుకోని వారి పట్టాలను రద్దు చేస్తున్నామన్నారు. అలాంటి వారికి కోరుకున్న చోట ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు.

News January 17, 2025

దేశం గర్వించేలా మరింత కష్టపడతా: మనూ భాకర్

image

ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు అందుకోవడంపై ఒలింపిక్ మెడలిస్ట్, భారత షూటర్ మనూ భాకర్ స్పందించారు. ‘గౌరవ రాష్ట్రపతి నుంచి ఖేల్ రత్న అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా భావిస్తున్నా. ఈ గుర్తింపు నా దేశం గర్వపడేలా చేసేందుకు మరింత కష్టపడి పనిచేయడానికి, విజయాలు పొందేందుకు స్ఫూర్తినిస్తోంది. నాకు మద్దతునిచ్చిన, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.

News January 17, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ

image

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. నష్టాలను అధిగమించి, ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పాదనతో లాభాల బాట పెట్టేందుకు రూ.11,440 కోట్ల రివైవల్ ప్యాకేజీని ప్రకటించింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌కు ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. AP అభివృద్ధి పట్ల NDAకి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు.

News January 17, 2025

పేదలకు ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం కీలక ప్రకటన

image

AP: పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించిన మార్గదర్శకాలను వెల్లడించారు. ‘వారు గతంలో ఎప్పుడూ ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదు. BPL ఫ్యామిలీ అయి ఉండాలి. కచ్చితంగా ఆధార్ ఉండాలి. మెట్ట ప్రాంతంలో 5 ఎకరాలు, మాగాణిలో 2.5 ఎకరాలు మించి ఉండకూడదు’ అని పేర్కొన్నారు.

News January 17, 2025

సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై క్యాబినెట్‌లో చర్చ

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు, సచివాలయాల్లో RTGS ఏర్పాటుపై CM చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్‌లో చర్చ జరిగింది. అటు నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిపై ప్రభుత్వానికి మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది.

News January 17, 2025

రెచ్చిపోయిన దొంగలు.. కర్ణాటకలో మరో భారీ చోరీ

image

కర్ణాటకలో మరో భారీ చోరీ జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్‌లో బ్యాంకులోకి చొరబడిన దొంగల ముఠా నగదు, బంగారం ఎత్తుకెళ్లింది. కారులో వచ్చి బ్యాంకు సిబ్బందిని తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. నిన్న బీదర్‌లోనూ దొంగల ముఠా ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసే వాహనం సిబ్బందిపై <<15169507>>కాల్పులు<<>> జరిపి రూ.93 లక్షలు ఎత్తుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మరణించారు.