News January 27, 2025

పరిధి దాటేసిన ఏఐ.. మరింత ప్రమాదం?

image

AI ఉపయోగాలు కోకొల్లలు. కానీ దాని వల్ల వాటిల్లే ఉపద్రవాల గురించే ఆందోళన ఎక్కువగా ఉంది. దానిని నిజం చేసేలా AI మోడల్ తాజాగా తనను తానే క్లోనింగ్ చేసుకుంది. అలీబాబా, మెటా సంస్థలకు చెందిన రెండు లాంగ్వేజ్ మోడల్స్‌ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ‘మోడల్ షట్‌డౌన్ కాకుండా ఉండేందుకు అపరిమిత క్లోనింగ్ చేసుకోగలుగుతోంది. అవసరమైతే వ్యవస్థను రీస్టార్ట్ చేస్తోంది. ఇది చాలా ప్రమాదకరం’ అని పరిశోధకులు హెచ్చరించారు.

News January 27, 2025

ఇంటిపై నుంచి బాలికను తోసేసి చంపిన కోతి

image

ఇంటి డాబాపై చదువుతున్న పదో తరగతి బాలికను కోతులు భయపెట్టి కిందకు తోసేసిన ఘటన బిహార్‌లోని సివాన్‌లో జరిగింది. విద్యార్థిని ప్రియ డాబాపై చదువుకుంటుండగా కోతుల గుంపు దాడి చేసింది. భయంతో ఆమె బిల్డింగ్ అంచులకు వెళ్లగా ఓ కోతి కిందకి తోసేసింది. తీవ్రంగా గాయపడ్డ ప్రియను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కోతుల బెడద విపరీతంగా ఉంది.

News January 27, 2025

కిడ్నీ రాకెట్.. ప్రధాన సూత్రధారి అరెస్ట్

image

TG: సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి డాక్టర్ పవన్ అలియాస్ లియోన్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి పారిపోయిన అతడితో పాటు మరో వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రిలో అక్రమంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసి, ఒక్కో సర్జరీకి రూ.50-60లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. తీవ్రత దృష్ట్యా ఈ కేసును ప్రభుత్వం CIDకి అప్పగించింది.

News January 27, 2025

స్టాక్‌మార్కెట్లు విలవిల.. నిఫ్టీ 23,000 సపోర్టు బ్రేక్

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 22,955 వద్ద చలిస్తోంది. కీలకమైన 23,000 సపోర్ట్ జోన్‌ను బ్రేక్ చేసింది. మరోవైపు సెన్సెక్స్ 440 పాయింట్లు పతనమై 75,774 వద్ద కొనసాగుతోంది. ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 6.44% పెరిగి 17.83 వద్దకు చేరుకుంది. FMCG మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. BRITANNIA, HUL, ITC, ICICIBANK, NESTLE IND టాప్ గెయినర్స్.

News January 27, 2025

అమల్లోకి ‘ప్రత్యేక’ పాలన

image

TG: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం నిన్నటితో ముగిసింది. దీంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈనెల 28తో కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు కూడా ముగియనుంది. GHMC, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మరికొన్ని మున్సిపాలిటీల పదవీకాలం మరో ఏడాది ఉంది.

News January 27, 2025

డెలివరీ తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్

image

పాపకు జన్మనిచ్చిన తర్వాత బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తెల్లటి దుస్తుల్లో ఆమె ఓ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె లుక్ చూడగానే అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దీపిక బొద్దుగా మారిపోయిందని, నటి రేఖలా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. కాగా దీపిక గత సెప్టెంబర్‌లో పాపకు జన్మనిచ్చారు. గర్భిణీగా ఉండగానే ‘కల్కి’ మూవీలో నటించారు.

News January 27, 2025

సచివాలయాలపై సర్కారు కీలక నిర్ణయం

image

AP: గ్రామ సచివాలయాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉండే ఆవాస ప్రాంతాలను వాటి సమీప సచివాలయాల్లో చేర్చనుంది. జనాభా ప్రాతిపదికన సిబ్బందిని నియమించనుంది. ఈ మేరకు సచివాలయాల శాఖ పంపిన ప్రతిపాదనను ఆమోదించింది. ఇక సచివాలయాలన్నింటినీ నాలెడ్జ్ హబ్‌లుగా మార్చాలని సర్కారు నిర్ణయించింది. కృత్రిమ మేధ సాయంతో ప్రజల్ని MSME పారిశ్రామికవేత్తలుగా చేసే దిశగా శిక్షణ అందించనుంది.

News January 27, 2025

ట్రంప్ కొరడా: కాళ్ల బేరానికొచ్చిన కొలంబియా Prez

image

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ కొరడాకు కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో దిగొచ్చారు. ఆంక్షలు అమలు చేసిన కొన్ని గంటల్లోనే కాళ్లబేరానికి వచ్చారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న తమ దేశస్థులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానం పంపించారు. వారిని క్రిమినల్స్‌గా చూడొద్దని, గౌరవంగా పంపాలని కోరారు. అమెరికాతో నిరంతరం టచ్‌లో ఉంటామన్నారు. అంతకు ముందు <<15276291>>US<<>> విమానాల ల్యాండింగ్‌కు ఆయన అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.

News January 27, 2025

GBSతో మహారాష్ట్రలో తొలి మరణం

image

గిలియన్-బార్ సిండ్రోమ్(GBS)తో భారత్‌లో తొలి మరణం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ అనారోగ్యంతో ఒకరు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోగుల సంఖ్య 101కి చేరిందని, వారిలో 16మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని పేర్కొంది. జీబీఎస్ అనేది అరుదైన నరాల సంబంధిత అనారోగ్యం. ఇది తలెత్తిన వారిలో సొంత రోగ నిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది.

News January 27, 2025

ఆ సినిమా చూసే.. భార్యను ముక్కలుగా నరికాడు

image

మలయాళ క్రైమ్, థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’ సినిమా స్ఫూర్తితోనే తన భార్య మాధవిని హత్య చేసినట్లు గురుమూర్తి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దత్తత తీసుకున్న కూతురిని తల్లి, కుమారుడు కలిసి హత్య చేస్తారు. ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ఓ ట్యాంకులో వేసి కెమికల్స్ పోసి కరిగిస్తారు. ఆ నీళ్లను వాష్ రూమ్ ఫ్లష్ ద్వారా వదులుతారు. ఆ మూవీలో చేసినట్లే గురుమూర్తి కూడా మాయం చేశాడు.