India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
1959: 13 ఏళ్ల వయసులో న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో చేరిక
1964-68: పెన్సిల్వేనియా వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో BSc
1968: తండ్రికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలో కొలువు
1991-2009: ఆరు ఆస్తులు దివాళా తీసినట్లు ప్రకటన
2016: అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ఎన్నిక
2023: జైల్లో ఫొటో తీయించుకున్న తొలి అధ్యక్షుడిగా మచ్చ
2024: రెండు హత్యాయత్నాలు-తప్పిన ప్రమాదం, 47వ అధ్యక్షుడిగా ఎన్నిక
ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో BGT ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆడే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ ఫస్ట్ మ్యాచుకు దూరమైతే యశస్వి జైస్వాల్తో రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ అదే నిజమైతే వీరిద్దరిలో ఎవరు ఓపెనింగ్కి వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి?
TG: సుంకిశాల కాంట్రాక్టు సంస్థను బ్లాక్లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని KTR చేసిన ఆరోపణలపై వాటర్ బోర్డు స్పందించింది. ఆ ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. సుంకిశాల గోడ కూలడంపై విచారణకు కమిటీ వేశామని తెలిపింది. అటు నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయలేకపోయిన కాంట్రాక్టు సంస్థకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు వివరించింది. విచారణ తర్వాత చర్యలుంటాయంది.
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్కి నటనలో శిక్షణ మొదలైనట్లు సమాచారం. తన గురువు సత్యానంద్ వద్దే కుమారుడికీ శిక్షణ ఇప్పించాలని పవన్ భావించినట్లు తెలుస్తోంది. ఈరోజే అకీరా శిక్షణలో చేరారని, కొన్ని నెలల పాటు నటనలో మెలకువలు నేర్చుకుంటారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. పవన్ క్రమేపీ సినిమాలకు దూరమవుతున్న నేపథ్యంలో అకీరా ఇండస్ట్రీలోకి రానుండటంపై ఆయన ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
AP: రాష్ట్ర చరిత్రలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల భూములకు కొత్తగా తెచ్చే ఈ చట్టం వర్తిస్తుందని తెలిపారు. ఎవరైనా కబ్జాలకు పాల్పడితే 10-14 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. జగన్ పాలనలో వైసీపీ గుండాలు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.
AP: మద్యం వినియోగదారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నాణ్యమైన మద్యం అమ్మడమే లక్ష్యంగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆబ్కారీ శాఖ ల్యాబ్ల్లో అత్యాధునిక పరీక్షలు చేస్తామని తెలిపారు. బ్లెండ్ పరీక్షకు 9, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్కు 13 ప్రామాణిక పరీక్షలు ఉంటాయన్నారు.
టీమ్ ఇండియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుందని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. స్టీవ్ స్మిత్ లేదా రిషభ్ పంత్ ఎక్కువ రన్స్ చేస్తారని తెలిపారు. ఆసీస్ బౌలర్ హేజిల్వుడ్ అత్యధిక వికెట్లు తీస్తారని అంచనా వేశారు.
AP: గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు విషయంలో తనను తిట్టిన CM చంద్రబాబు ఇవాళ మెచ్చుకున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ట్వీట్ చేశారు. ‘శెభాష్ సుభాష్ అంటూ సీఎం చంద్రబాబు మెచ్చుకోలు నాకు కొండంత బలం. మొన్న తిట్టిన ఆయన ఈరోజు భుజం మీద చెయ్యి వేసి బాగా చేశావయ్యా.. ఓటర్ రిజిస్ట్రేషన్ 90% దాటించావ్ అంటే వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. తిట్టినా మెచ్చుకున్నా మాకు అన్ని ఆయనే’ అని సీఎంతో దిగిన ఫొటోను షేర్ చేశారు.
ఈ వారం ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు రిలీజ్ కానున్నాయి.
*నవంబర్ 7: సమంత, వరుణ్ ధవన్ నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ (అమెజాన్ ప్రైమ్)
*నవంబర్ 8: ఎన్టీఆర్ ‘దేవర’, రజనీకాంత్ ‘వేట్టయన్’, అనుపమ్ ఖేర్ ‘విజయ్ 69’ (నెట్ఫ్లిక్స్), సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’ (ఆహా), బాలకృష్ణ, సూర్య ‘అన్స్టాపబుల్’ షో (ఆహా)
TG: నవంబర్ 14న 15వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచినందుకు వైరా, మధిర గురుకుల విద్యార్థులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. SC, ST, BC, మైనార్టీల కోసం యంగ్ ఇండియా స్కూళ్లు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ యూనివర్సిటీ, ఒలింపిక్ పతకాలే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
Sorry, no posts matched your criteria.