India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

1882: అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ జననం
1940: నటుడు, రచయిత మోహన్ మహర్షి జననం
1957: సినీ దర్శకుడు ప్రియదర్శన్ జననం
1948: భారత జాతి పిత మహాత్మా గాంధీ మరణం
2016: తెలుగు రచయిత్రి నాయని కృష్ణకుమారి మరణం
2016: భారత సైనిక దళాల మాజీ ఛీఫ్ జనరల్ కేవీ కృష్ణారావు మరణం
అమరవీరుల సంస్మరణ దినం

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇవాళ రంజీ మ్యాచ్ ఆడనున్నారు. డిల్లీలో రైల్వేస్తో జరగబోయే మ్యాచులో ఆయన బరిలోకి దిగుతారు. కాగా కోహ్లీ దాదాపు 13 ఏళ్ల తర్వాత దేశవాళీ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్లో విరాట్ నాలుగో స్థానంలో బరిలోకి దిగుతారు. ఈ మ్యాచ్ను ‘Jio Cinema’ టెలికాస్ట్ చేయనుంది. కాగా కోహ్లీ ఓవరాల్గా 23 రంజీ మ్యాచులు ఆడి 1,547 పరుగులు చేశారు. ఇందులో 5 శతకాలు ఉన్నాయి.

✒ తేది: జనవరి 30, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.10 గంటలకు
✒ ఇష: రాత్రి 7.25 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

✒ తిథి: శుక్ల పాడ్యమి సా.5.47 వరకు
✒ నక్షత్రం: శ్రవణం ఉ.8.49 వరకు
✒ శుభ సమయములు: సా.5.20 నుంచి 6.08 గంటల వరకు
✒ రాహుకాలం: మ.1.30-3.00 వరకు
✒ యమగండం: ఉ.6.00-7.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-10.48 వరకు, మ.2.48 నుంచి 3.36 గంటల వరకు
✒ వర్జ్యం: మ.12.42-2.15 వరకు
✒ అమృత ఘడియలు: రా.10.02-11.39 వరకు

కుంభమేళాలో 30 మంది భక్తులు తొక్కిసలాటలో మృతి చెందడం ఓ చిన్న ఘటన అంటూ UP మంత్రి సంజయ్ నిషాద్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ ఈవెంట్లలో ఇలాంటివి చిన్న ఘటనలని, పైగా అనివార్యమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. తొక్కిసలాట ఘటన బాధాకరమని చెబుతూనే ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించడం పెద్ద సవాల్ అని సంజయ్ నిషాద్ పేర్కొన్నారు.

☛ మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 30 మంది మృతి
☛ కుంభమేళా తొక్కిసలాటపై నేతల దిగ్భ్రాంతి
☛ ISRO 100వ ప్రయోగం సక్సెస్
☛ APలో రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్
☛ పెద్దిరెడ్డి ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
☛ ఫిబ్రవరి 10లోపు టూరిజం పాలసీ: రేవంత్ రెడ్డి
☛ రేపు BRS రాష్ట్ర వ్యాప్త నిరసనలు
☛ రేషన్ కార్డులపై మోదీ ఫొటో ఉండాలి: బండి సంజయ్
☛ భారీగా పెరిగిన బంగారం ధరలు

యమునా జలాల్లో హరియాణా విషం కలిపిందన్న AAP అధినేత కేజ్రీవాల్ వ్యాఖ్యలపై EC సీరియస్ అయి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ఆ నోటీసులకు వివరణ ఇస్తూ.. యమునా జలాల విషయంలో తన వాదనలపై EC దర్యాప్తు చేయాలన్నారు. ఢిల్లీ ప్రజలను రక్షించేందుకే తన ప్రయత్నం అని చెప్పారు. కేజ్రీ వ్యాఖ్యల నేపథ్యంలో తాను యమునా నీళ్లే తాగుతానని PM మోదీ, నది వద్దకు వెళ్లి హరియాణా CM నీళ్లు తాగి కౌంటర్ ఇచ్చారు.

TG: ‘ఇందిరమ్మ ఇళ్లు’ మొదటి విడతలో మంజూరైన 72 వేల ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి బిల్లుల చెల్లింపు వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగిస్తున్నట్లు చెప్పారు. నిర్మాణాల పురోగతి, బిల్లుల చెల్లింపుల నిరంతర పర్యవేక్షణకు అధికారులు AI వినియోగించాలన్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.