India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా విడుదలకు ముందే చరిత్ర సృష్టిస్తోంది. ఓవర్సీస్లో అత్యంత వేగంగా $500K ప్రీమియర్ ప్రీ-సేల్స్ జరిపినట్లు మేకర్స్ ప్రకటించారు. మూవీ విడుదలకు ఇంకా 30 రోజులు ఉన్నప్పటికీ అప్పుడే ఆఫ్ మిలియన్ క్రాస్ చేసిందన్నారు. విడుదల తేదీ నాటికి రికార్డు ప్రీ కలెక్షన్లు సాధిస్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. క్రూడాయిల్ ధరల పెరుగుదల, ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. సెన్సెక్స్ 79,927 (-450), నిఫ్టీ 24,360 (-123) వద్ద ట్రేడవుతున్నాయి. మీడియా, PSU బ్యాంక్, రియాల్టి, Oil & Gas సూచీలు పుంజుకున్నాయి. మెటల్, ఫార్మా షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. హిందాల్కో, Adani Ent, సిప్లా, అల్ట్రాటెక్ సెమ్ టాప్ లూజర్స్.
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటి’ చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు. ఇవాళ జేజమ్మ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. సిగార్ పీలుస్తూ ఆగ్రహంతో ముఖం నిండా రక్తంతో ఉన్న ఆమె వైల్డ్ ఫొటో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వేదం’ తర్వాత వారి కాంబోలో తెరకెక్కుతున్న రెండో మూవీ ఇది. ఇవాళ సా.4.05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ కానుంది.
రంజీ ట్రోఫీలో భాగంగా J&Kతో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మేఘాలయ కుప్పకూలింది. 53/0 స్థితి నుంచి 73 పరుగులకే ఆలౌటైంది. 20 పరుగుల తేడాతో 10 మంది బ్యాటర్లు ఔటయ్యారు. నలుగురు డకౌట్ కాగా, మరో నలుగురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఓపెనర్లు బమంబా 21, అర్పిత్ 24 రన్స్ చేయగా, ఎక్స్ట్రాల రూపంలో 16 పరుగులు వచ్చాయి.
మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మహా వికాస్ అఘాడీ (MVA) ఐదు హామీలను ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.3వేలు ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతోపాటు రైతులకు రూ.3లక్షల వరకు రుణమాఫీ, నిరుద్యోగులకు నెలకు రూ.4వేలు ఇస్తామని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్యబీమా కల్పిస్తామన్నారు.
టీమ్ఇండియా బౌలర్ చాహల్కు గడ్డుకాలం నడుస్తోంది. అవకాశం వచ్చిన ప్రతిసారి అదరగొట్టే చాహల్కు ప్రస్తుతం ఛాన్సులే రావట్లేదు. దీంతో IPLలో, Tటీ20ల్లో చాహల్ ప్రతిభను గుర్తించట్లేదని అభిమానులు విమర్శలు చేస్తున్నారు. RCB,RR తరఫున చాహల్ (139, 66) అత్యధిక వికెట్లు పడగొట్టినా జట్టు నుంచి రిలీజ్ చేశారని మండిపడుతున్నారు. T20 క్రికెట్లోనూ అత్యధిక వికెట్లు పడగొట్టినా జట్టులో చోటు ఇవ్వట్లేదంటున్నారు. మీ కామెంట్?
ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించేలా చట్టం తీసుకొస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. సోషల్ మీడియా పిల్లలకు హాని చేస్తోందనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో చట్టం ప్రవేశపెడతామని, ఆమోదించిన 12 నెలల తర్వాత అమల్లోకి వస్తాయని తెలిపారు. మన దగ్గర ఇలాంటి చట్టం వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.
దేశంలోని టాప్ కంపెనీల్లో ఇంటర్న్షిప్ పొందేలా నిరుద్యోగుల కోసం కేంద్రం PM ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.5000 చొప్పున ఏడాది పాటు ఇస్తారు. కంపెనీలో చేరే ముందు మరో రూ.6వేలు ఇస్తారు. ఏడాది పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది. 21-24 ఏళ్లలోపు వారు అర్హులు. SSC నుంచి డిగ్రీలోపు చదివి ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షలు దాటకూడదు. ఈ నెల 10 చివరి తేదీ. దరఖాస్తు కోసం ఇక్కడ <
అమెరికా ఎన్నికల ఫలితాలను కచ్చితంగా ఒప్పుకోవాల్సిందేనని కమలా హారిస్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. తాను ఇప్పటివరకు సాధించినదాని పట్ల సంతృప్తిగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. ‘చాలా మంది దేశం చీకటిలోకి వెళ్తుందని భావిస్తున్నారు. కానీ అలా జరగదని నేను నమ్ముతున్నా. అమెరికా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ప్రజలందరికీ న్యాయం, గౌరవం, అవకాశాల కోసం పోరాటం కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.
AP: సమగ్రశిక్ష పథకం కింద పనిచేస్తున్న CRP, MIS కోఆర్డినేటర్లు, CRTలకు మెగా డీఎస్సీలో వెయిటేజీ మార్కులు ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. వీరు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నారని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ పేర్కొంది. విధుల్లో బిజీగా ఉన్నందున మిగిలిన అభ్యర్థుల్లా వీరికి సన్నద్ధతకు అవకాశం ఉండదని తెలిపింది. 2019 డీఎస్సీలోనూ వెయిటేజ్ మార్కులు ఇచ్చారని గుర్తు చేసింది.
Sorry, no posts matched your criteria.