India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతోన్న ‘పుష్ప-2’ సినిమా ప్రమోషనల్ టూర్ ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. మిడ్ నవంబర్లో ట్రైలర్ ఈవెంట్ సహా 6 నగరాల్లో మూవీ టీమ్ ప్రోమోషన్స్లో పాల్గొంటుందని సినీ వర్గాలు తెలిపాయి. పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్లో అల్లు అర్జున్ సందడి చేయనున్నట్లు పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
కేంద్ర మంత్రి కుమార స్వామి, అయన కుమారుడు నిఖిల్పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ అనుమతుల మంజూరు కేసులో దర్యాప్తు చేస్తున్నతనను కుమార స్వామి బహిరంగంగా బెదిరించారని ఆరోపిస్తూ సిట్ చీఫ్, ADGP చంద్రశేఖర్ ఈ ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా కర్ణాటక క్యాడర్ నుంచి మరో క్యాడర్కు బదిలీ చేయిస్తానని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
2036 ఒలింపిక్స్, పారాలింపిక్స్ను భారత్లో నిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ మేరకు క్రీడల నిర్వహణకు ఆసక్తిని కనబరుస్తూ ఒలింపిక్స్ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్కు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపింది. ఈ లేఖను Oct 1న పంపినట్టు తెలిసింది. గతంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ 2036లో ఒలింపిక్స్ నిర్వహణపై భారత ఆకాంక్షను వ్యక్తం చేశారు.
AP: పల్నాడు జిల్లా మాచవరంలో సరస్వతి పవర్ భూములను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు పవన్ వద్ద వాపోయారు. ‘అప్పట్లో తక్కువ ధరకే భూములు లాక్కున్నారు. మా పిల్లలకు ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా కంపెనీ పెట్టలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ సంస్థకు ఇచ్చిన లీజును రద్దు చేయాలి. లేదంటే పరిశ్రమ పెట్టి ఉపాధి కల్పించాలి’ అని వారు డిమాండ్ చేశారు.
AP: వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. మాజీ సీఎం జగన్ తన ఇంటి గేటు దగ్గర సిబ్బందికే రూ.12 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు చేస్తున్నాం. అయినా కొన్ని నేరాలు జరుగుతుండటంతో బాధగా ఉంది. శిక్షలు అమలు చేసేందుకు ప్రత్యేక కోర్టులు కావాలి. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకుంటాం’ అని ఆమె హెచ్చరించారు.
UP <<14535006>>మదర్సా<<>> చట్టానికి అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఒక విషయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫాజిల్, కామిల్ కింద డిగ్రీలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇవి UG నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తాయని వెల్లడించింది. మైనారిటీ స్టూడెంట్స్ బయటకెళ్లి గౌరవంగా బతికేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది. ఈ చట్టాన్ని 2004లో ములాయం సింగ్ యాదవ్ తెచ్చారు.
AP: Dy.CM పవన్ వ్యాఖ్యలపై తాను కామెంట్ చేయనని DGP ద్వారక తిరుమలరావు అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో తాము పనిచేయమని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని, ఏ కేసునైనా వాస్తవ పరిస్థితుల ఆధారంగానే విచారిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పోలీసులు ఉద్యోగ ధర్మం మరుస్తున్నారని నిన్న <<14527392>>పవన్<<>> వ్యాఖ్యానించారు.
ప్రైవేటు ఆస్తి ప్రజా వనరు కాదన్న సుప్రీంకోర్టు <<14535099>>తీర్పు<<>>లో కొన్ని అంశాలపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్తో జస్టిస్ బీవీ నాగరత్న విబేధించారు. 1978లో జస్టిస్ కృష్ణ అయ్యర్ సోషలిస్ట్ ఫిలాసఫీ ఇప్పటికి సరికాదని, వారి మైనారిటీ వ్యూ పరిగణనలోకి తీసుకోలేమని చంద్రచూడ్ అన్నారు. అప్పటి ప్రభుత్వ పాలసీల ఆధారంగా ఇచ్చిన గత జడ్జిల వైఖరిని ఇప్పుడు సరికాదన్న అభిప్రాయంతో తాను ఏకీభవించడం లేదని జస్టిస్ నాగరత్న తెలిపారు.
TG: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తిలో తేమ శాతం 8-12 మధ్య ఉండేలా చూసుకోవాలన్నారు. కొనుగోళ్లకు సంబంధించిన సమాచారం కోసం వాట్సాప్ నంబర్ 8897281111ను సంప్రదించాలని చెప్పారు. పత్తి కొనుగోళ్లపై సమీక్షించిన ఆయన, నోటిఫై చేసిన ప్రతి జిన్నింగ్ మిల్లు పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
గాలి, నీరు, బొగ్గు, సూర్యరశ్మి ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయడమే ఇప్పటివరకు చూశాం. అయితే, స్వీడన్లోని చాల్మర్స్ వర్సిటీ నిపుణులు సిల్క్ థ్రెడ్తో చేసిన వస్త్రాలతో కరెంట్ తయారుచేసే పద్ధతి కనుగొన్నారు. కండక్టివ్ ప్లాస్టిక్ మెటీరియల్ పూత ఉన్న సిల్క్ థ్రెడ్తో చేసిన దుస్తులు శరీరంలోని వేడిని గ్రహించి విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఇలా వచ్చిన విద్యుత్ను USB ద్వారా పోర్టబుల్ పరికరాలను ఛార్జ్ చేయొచ్చు.
Sorry, no posts matched your criteria.