News January 29, 2025

ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి రాంప్రసాద్ ఏమన్నారంటే?

image

ఏపీలో త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై ముగ్గురు మంత్రులతో కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. కాగా వచ్చే నెల 6న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది.

News January 29, 2025

ప్రైవేట్ జూనియర్ కాలేజీల కీలక నిర్ణయం

image

తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్ పరీక్షలకు సెంటర్లు ఇవ్వొద్దని నిర్ణయించాయి. ఇంటర్ బోర్డు సెక్రటరీ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించాయి. ఫీజుల చెల్లింపులో కాలేజీలకు ఫైన్ వేయడాన్ని ఖండిస్తున్నామని, ప్రాక్టికల్స్‌కు సీసీ కెమెరాల నిబంధన సరికాదన్నాయి. కార్పొరెట్ కాలేజీలకు బోర్డు అధికారులు ఏజెంట్లుగా మారారని విమర్శించాయి.

News January 29, 2025

కంచి తరహాలో మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్

image

AP: మంగళగిరిలోని ఆటో‌నగర్‌‌లో మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటుకు CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ చర్యలు చేపట్టారని మంత్రి సవిత తెలిపారు. 10.80 ఎకరాల్లో పార్కు ఏర్పాటుకు ఇవాళ స్థలాన్ని పరిశీలించిన ఆమె మాట్లాడారు. TNలోని కంచి తరహాలో పార్కును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 365 రోజులూ చేనేత కార్మికులకు పని కల్పిస్తామని చెప్పారు. YCP పాలనలో సాయం అందక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

News January 29, 2025

ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల నీరు ఇవ్వాల్సిందే: మంత్రి సీతక్క

image

TG: వేస‌వి ముగిసే వ‌ర‌కు నీటి ఎద్ద‌డి లేకుండా ప్ర‌తి మనిషికి రోజుకు 100 లీట‌ర్ల నీరు అందించేలా మిష‌న్ భ‌గీర‌థ సిబ్బంది క‌ృషి చేయాల‌ని మంత్రి సీత‌క్క ఆదేశించారు. ఈ పథకానికి వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజలెందుకు ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదో అధ్యయనం చేయాలన్నారు. Feb 1-10 తేదీల మ‌ధ్య స‌మ్మ‌ర్ స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించి మిషన్ భగీరథ నీళ్లు వాడేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాల‌ని సూచించారు.

News January 29, 2025

విమానం కూలి 18 మంది మృతి!

image

దక్షిణ సూడాన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. యునిటీ స్టేట్ నుంచి జుబా వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలింది. ఈ ఘటనలో దాదాపు 18 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో 21 మంది ప్రయాణికులు, సిబ్బంది విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

News January 29, 2025

బెంజ్‌ కారుకు 100 ఏళ్ల చరిత్ర ఉందని మీకు తెలుసా?

image

మార్కెట్‌లో ఎన్నో రకాల కార్ల కంపెనీలు ఉండగా కొందరు మైలేజ్ చూస్తే.. మరికొందరు సేఫ్టీ చూస్తుంటారు. టాప్‌లో ఉన్న కార్ల కంపెనీలు ఏయే సంవత్సరాల్లో మొదలు పెట్టారో చాలా మందికి తెలియదు. ఇండియన్ కంపెనీ అయిన టాటా మోటార్స్‌ను 1945లో స్థాపించారు. 2003లో టెస్లా, హ్యుందాయ్ 1967, హోండా 1948, కియా 1944 , టయోటా 1935, నిస్సాన్ 1933, మెర్సిడెస్ బెంజ్ 1926, బెంట్లీ 1919, BMWని 1916లో ప్రారంభించారు.

News January 29, 2025

మూవీలో లీడ్ రోల్‌లో తమన్!

image

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి యాక్టర్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. తమిళ నటుడు అథర్వ హీరోగా నటించే సినిమాలో తమన్ లీడ్ యాక్టర్‌గా చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రొడక్షన్‌ దశలో ఉందని వెల్లడించాయి. దీంతో చాలా కాలం తర్వాత తమన్ సినిమాలో నటుడిగా కనిపించే అవకాశం ఉంది. కాగా, 2003లో రిలీజైన బాయ్స్ మూవీలో తమన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

News January 29, 2025

రేపు మాంసం దుకాణాలు బంద్

image

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రేపు హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మేక, గొర్రెల మండీలు, దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు కూడా నిఘా ఉంచాలని సూచించారు. ఏపీ, తెలంగాణలోనూ ఇదే తరహా ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

News January 29, 2025

అమ్మకానికి పులి మూత్రం.. పావు లీటర్ రూ.600!

image

చైనాలోని ఓ వైల్డ్ లైఫ్ జూ నిర్వాహకులు పులి మూత్రాన్ని విక్రయిస్తున్నారు. 250mlకి 50 యువాన్లు (₹600) తీసుకుంటున్నారు. టైగర్ మూత్రంలో అద్భుత ఔషధాలు ఉన్నాయని, దీనితో కండరాల నొప్పులు, ఆర్థరైటిస్ నయం అవుతాయని చెబుతున్నారు. పులి మూత్రాన్ని వైట్ వైన్, అల్లం ముక్కలతో మిక్స్ చేయాలని సూచిస్తున్నారు. అయితే దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదని, మూత్రాన్ని అమ్మడానికి లైసెన్స్ లేదని పలువురు సందర్శకులు అంటున్నారు.

News January 29, 2025

రేపు బీఆర్ఎస్ రాష్ట్ర‌వ్యాప్త నిరసనలు

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేపటికి 420 రోజులవుతుందని, కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేదని BRS ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నాయి. అలాగే, రేపు గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు నివాళులు అర్పించడంతో పాటు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అయినా ప్రభుత్వం కళ్లు తెరుచుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది.