News January 30, 2025

పెళ్లి పీటలు ఎక్కనున్న ప్రముఖ నటి

image

త్వరలోనే తాను వివాహం చేసుకోబోతున్నట్లు నటి అభినయ తెలిపారు. గత 15 ఏళ్లుగా తనతో కలిసి చదువుకున్న స్నేహితుడిని ప్రేమిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అతడిని పెళ్లాడబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. కాగా దివ్యాంగురాలైన(మూగ, చెవిటి) అభినయ హీరో విశాల్‌తో డేటింగ్ చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. కాగా వీరిద్దరూ కలిసి ‘పూజ’, ‘మార్క్ ఆంటోనీ’ చిత్రాల్లో నటించారు.

News January 30, 2025

క్యాన్సర్ రాకుండా చేసే వ్యాక్సిన్ రాబోతోంది!

image

శరీరంలో క్యాన్సర్ అభివృద్ధి చెందడం కంటే ముందే దానికి కారణమయ్యే కణాలను గుర్తించి అంతం చేసే వ్యాక్సిన్ రాబోతోంది. ఫార్మాస్యూటికల్ కంపెనీ GSK, Oxford వర్సిటీ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. బాడీలో క్యాన్సర్ వ్యాప్తి కావడానికి 20 ఏళ్ల వరకూ సమయం పడుతుందని, తాము తయారు చేసే వ్యాక్సిన్ ప్రీ కాన్సరస్ సెల్స్‌ను గుర్తించి వ్యాధి రాకుండా వాటిని అంతం చేస్తుందని వర్సిటీ ఫ్రొఫెసర్లు పేర్కొన్నారు.

News January 30, 2025

కేంద్ర మంత్రులకు తప్పిన ప్రమాదం

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలకు ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని 3 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా అంతకుముందు వైజాగ్ ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం లభించింది. కాసేపట్లో కార్మికులతో ముఖాముఖీ నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

News January 30, 2025

జన్మత: పౌరసత్వం రద్దు బిల్లు ప్రవేశపెట్టిన సెనేటర్లు

image

అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసా హోల్డర్ల పిల్లలకు జన్మత: పౌరసత్వం నిరోధించే బిల్లును రిపబ్లికన్ సెనేటర్లు కొందరు US సెనేట్లో ప్రవేశపెట్టారు. అక్రమ వలసలు, జాతీయ భద్రత బలహీనతకు బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ దోపిడీయే కారణమని సెనేటర్లు లిండ్సే గ్రాహమ్, టెడ్ క్రూడ్, కేటీ బ్రిట్ అంటున్నారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో దీనికి తెరపడుతుందన్నారు. ఇకపై నిర్దేశించిన తేదీ తర్వాత పుట్టే పిల్లలకే బర్త్‌రైట్ ఉండదు.

News January 30, 2025

ఘోర విమాన ప్రమాదం.. 60 మందికి పైగా దుర్మరణం!

image

USలోని వాషింగ్టన్‌లో రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన <<15306564>>విమాన ప్రమాదంలో<<>> ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు బయటపడ్డాయి. విమానంలో 60 మందికి పైగా ప్రయాణికులు ఉండగా ఎవరూ బతికి ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. విమాన శకలాలు పడిన పోటోమాక్ నదిలో ఉష్ణోగ్రత -1 నుంచి -2 సెల్సియస్ మధ్య ఉంది. ఈ పరిస్థితుల్లో మనుషులు 30-90 నిమిషాలు మించి జీవించలేరని నిపుణులు చెబుతున్నారు.

News January 30, 2025

తల్లి మృతి.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్

image

ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ తన తల్లి లివి సురేశ్ బాబును గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘అమ్మా, నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమతో పాటు నా కలలను సాకారం చేసుకునే శక్తినిచ్చావు. నువ్వు నన్ను వదిలి వెళ్లిపోలేదమ్మా. ఎప్పుడూ నా హృదయంలో, నా ప్రతి అడుగులో ఉంటావు. మీ ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా. నువ్వే నా బలం అమ్మా’ అని ఫేస్‌బుక్‌ పోస్టులో రాసుకొచ్చారు.

News January 30, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరికి బెయిల్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌, అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని షరతు పెట్టింది. పాస్ పోర్టులు సమర్పించాలని, దర్యాప్తునకు సహకరించాలని ఇద్దరినీ ఆదేశించింది. ఇదే కేసులో తిరుపతన్నకు కూడా కోర్టు ఇటీవలే బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News January 30, 2025

బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో సిరాజ్ డేటింగ్?

image

టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మహీరా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇటీవల ఆశా భోస్లే మనవరాలు, సింగర్ జనై భోస్లేతో సిరాజ్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆమె తనకు సోదరిలాంటిదని సిరాజ్ చెప్పడంతో ఆ వదంతులకు తెరపడింది.

News January 30, 2025

హీరోల గొడవ.. ఈ పార్ట్ సరిగా ప్లాన్ చేసుకోలేదా!

image

హీరోలు శివ కార్తికేయన్, విజయ్ ఆంటోనీల మధ్య టైటిల్స్ వివాదం నెలకొంది. విజయ్ తెలుగులో, శివ తెలుగు, తమిళ భాషల్లో ‘పరాశక్తి’ పేరుతో రానున్నారు. బిచ్చగాడు హీరో PARASHAKTHI స్పెల్లింగ్‌తో రిజిస్టర్ చేస్తే ‘డాక్టర్’ స్టార్ PARASAKTHI అని పేర్కొన్నారు. వేర్వేరు సినీ కౌన్సిళ్లలో భిన్న స్పెల్లింగుల కారణంగా ఈ వివాదం మొదలైంది. దీంతో కౌన్సిల్స్ బేసిక్ చెకింగ్స్ చేయాలి కదా అని సినీ జనాలు పెదవి విరుస్తున్నారు.

News January 30, 2025

2 పరుగులకే 6 వికెట్లు.. శార్దూల్ హ్యాట్రిక్

image

రంజీ ట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్లు అదరగొట్టారు. 2 పరుగులకే 6 వికెట్లు కూల్చేశారు. శార్దూల్ ఠాకూర్ హ్యాట్రిక్ సహా 4, మోహిత్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కాగా, అర్పిత్ సుభాష్ 2 పరుగులు చేశారు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్ చేతిలో ముంబై అనూహ్యంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో శార్దూల్ సెంచరీ చేశారు.