India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సిటడెల్: హనీబన్నీ, మీర్జాపూర్-3 వెబ్ సిరీస్లు అమెజాన్ ప్రైమ్లో రికార్డులు సృష్టించాయి. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘సిటడెల్’ గ్లోబల్ స్థాయిలో ఎక్కువ మంది వీక్షించిన నాన్ ఇంగ్లిష్ సిరీస్ల లిస్టులో ఐదో స్థానంలో నిలిచింది. మొత్తం 170 దేశాల్లో ఈ సిరీస్ టాప్-10లో చోటు దక్కించుకుంది. విడుదలైన వారాంతంలో దేశవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న జాబితాలో మీర్జాపూర్-3 టాప్-10లో నిలిచింది.

ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ తల్లి లివి సురేశ్ బాబు (65) కన్నుమూశారు. కేరళలోని కూర్కెన్చెరిలోని తన అపార్టుమెంట్లో ఆమె అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషయాన్ని గోపి సోషల్ మీడియాలో వెల్లడించారు. మలయాళం సినీ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపున్న ఆయన తెలుగులో‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, మజిలీ, నిన్నుకోరి, 18 పేజెస్’ తదితర సినిమాలకు సంగీతం అందించారు.

తెలంగాణ కాంగ్రెస్కు సోషల్ మీడియాలో షాక్ తగిలింది. ‘రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు?’ అని అధికారిక X ఖాతాలో పోల్ పెట్టగా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన అనే రెండు ఆప్షన్లు ఇవ్వగా ఫామ్ హౌస్ పాలనకు 73% మంది ఓటేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తన పరువు తానే పోగొట్టుకుందని బీఆర్ఎస్ శ్రేణులు నెట్టింట పోస్టులు పెడుతున్నాయి.

విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తొలగించేందుకు CBSE కీలక నిర్ణయం తీసుకుంది. FEB 1 నుంచి APR 4 వరకు IVRS, పాడ్కాస్ట్, ఫోన్ కాల్స్ ద్వారా ఫ్రీగా సైకో-సోషల్ కౌన్సెలింగ్ ఇవ్వనుంది. ఎగ్జామ్స్కు ముందు, ఆ తర్వాత ఈ సర్వీస్ అందించనుంది. టోల్ఫ్రీ నంబర్ 1800118004 ద్వారా IVRS సౌకర్యం ఉంటుంది. CBSE వెబ్సైట్లో పాడ్కాస్ట్లు ఉంటాయి. నిపుణులు నేరుగా విద్యార్థులకే కాల్ చేసి కూడా కౌన్సెలింగ్ ఇస్తారు.

దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాటుగా కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,200 (+37), సెన్సెక్స్ 76,553 (+18) వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు తగ్గాయి. మెటల్, ఫార్మా, రియాల్టి, హెల్త్కేర్ షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. బజాజ్ ట్విన్స్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో టాప్ గెయినర్స్. టాటా మోటార్స్, ఇన్ఫీ, ICICI బ్యాంక్, టైటాన్, అల్ట్రాటెక్ టాప్ లూజర్స్. నిఫ్టీ ADV/DEC 39:12గా ఉంది.

US అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ‘బైఅవుట్స్’ ఆఫర్ ప్రకటించారు. ఏ ఫెడరల్ ఉద్యోగి అయినా స్వచ్ఛందంగా ఉద్యోగం మానేస్తే 8 నెలల శాలరీ ఇస్తామని తెలిపారు. ఈమేరకు 20 లక్షల మంది ఎంప్లాయిస్కు ప్రభుత్వం మెయిల్స్ పంపింది. ఫిబ్రవరి 6లోపు నిర్ణయం తీసుకోవాలని డెడ్లైన్ విధించింది. 5-10% మంది రిజైన్ చేసినా 100 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని అంచనా.

ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట నేపథ్యంలో మహా కుంభమేళాపై ఒక లాయర్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. మేళా వద్ద అన్ని రాష్ట్రాలు ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసేలా, భక్తుల భద్రతకు భరోసా కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేసేలా ఆదేశించాలన్నారు. తొక్కిసలాటకు UP ప్రభుత్వం, అధికారుల అలసత్వం, నిర్లక్ష్యానికి సంబంధం ఉందని ఆరోపించారు. దానిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని కోరారు.

టెస్టుల్లో 35వ సెంచరీ పూర్తి చేసుకున్న స్టీవ్ స్మిత్పై రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించారు. ఈ జనరేషన్లో అతడే బెస్ట్ ప్లేయర్ అని కొనియాడారు. అతడితో పాటు జో రూట్ (ENG), విలియమ్సన్(NZ) అత్యుత్తమంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ‘ఫ్యాబ్ 4’ లిస్టులో ఉన్న విరాట్ కోహ్లీ పేరును ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం. గత 2, 3 ఏళ్లుగా టెస్టుల్లో పరుగులు చేయడంలో విరాట్ తడబడుతున్న సంగతి తెలిసిందే.

TG: భార్యను హత్య చేసి ముక్కలుగా నరికిన గురుమూర్తి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు. కోర్టులో హాజరుపర్చినప్పుడు లాయర్ను పెట్టుకుంటావా అని జడ్జి అడగ్గా ‘నాకు న్యాయవాది అవసరం లేదు. జైల్లోనే ఉంటా’ అని చెప్పాడు. దీంతో పోలీసులు ఆయనను జైలుకు తీసుకెళ్లారు. కాగా భార్యను ముక్కలుగా చేసిన చోటే పిల్లలకు ఆన్లైన్లో ఫుడ్ తెప్పించి తినిపించాడు. ఇంట్లో దుర్వాసన వస్తోందని పిల్లలు అడగ్గా రూమ్ స్ప్రే కొట్టాడు.

ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట నేపథ్యంలో UP ప్రభుత్వం 5 మార్పులు చేసింది. మహాకుంభ్ ఏరియాను నో వెహికల్ జోన్గా ప్రకటించింది. మినహాయింపులు సహా VVIP పాస్లు, వాహనాల ఎంట్రీని రద్దు చేసింది. భక్తులు సాఫీగా సాగిపోయేందుకు వన్వే ట్రాఫిక్ సిస్టమ్ను అమలు చేస్తోంది. ప్రయాగకు పొరుగు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే ఆపేస్తోంది. FEB 4 వరకు ఫోర్ వీలర్లకు సిటీలోకి అనుమతి లేదు.
Sorry, no posts matched your criteria.