India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: బీఆర్ నాయుడు ఛైర్మన్గా 24 మందితో ఏర్పాటైన టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం మరో ఐదుగురికి చోటు కల్పించింది. జి.భాను ప్రకాశ్ రెడ్డిని సభ్యుడిగా, దేవదాయ శాఖ సెక్రటరీ, కమిషనర్, TUDA ఛైర్మన్, TTD ఈవోలను ఎక్స్అఫిషియో మెంబర్లుగా పాలకమండలిలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
TG: గాలి మాటల గ్యారంటీలిస్తే మొదటికే మోసం వస్తుందని AICC ఛైర్మన్ మల్లికార్జున ఖర్గేకు ఇప్పుడు అర్థమైనట్లు ఉందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కర్ణాటక, తెలంగాణలో ఆరు గ్యారంటీలు ప్రకటించినప్పుడు బడ్జెట్ గుర్తుకురాలేదా? అని ఆయనను నిలదీశారు. ‘కాంగ్రెస్ ఆడిన గ్యారంటీల గారడీతో రాష్ట్రం ఆగమైంది. ప్రజలను గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన మోసం క్షమించరానిది’ అని ఆయన ట్వీట్ చేశారు.
AP: ప్రిలిమినరీ టెస్ట్ పాసైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ చివరి వారంలో దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. కాగా గతేడాది జనవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. మొత్తం 95,208 మంది ఉత్తీర్ణులయ్యారు. కానీ రెండో దశ కోసం 91,507 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకోని వారికి బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈ నెల 11 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్కు ఆయుధ, ఆర్థిక వనరులు సమకూరుస్తున్న డెమోక్రటిక్ ప్రభుత్వంపై అరబ్ అమెరికన్లు ఆగ్రహంగా ఉన్నారు. 40 వేల మందికిపైగా పాలస్తీనియన్ల నరమేధంలో డెమోక్రాట్లు భాగమయ్యారని గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో వారు ట్రంప్ను పూర్తిగా నమ్మలేని స్థితి. దీంతో తాను అధికారంలోకి వస్తే గాజాలో యుద్ధం ఆపేలా చర్యలు తీసుకుంటానని ట్రంప్ వారిని ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు.
కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సమీక్షిస్తామన్న DK శివకుమార్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది. పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు ఆ పార్టీకి లాభం చేశాయి. ఇప్పుడు మహారాష్ట్ర, ఝార్ఖండ్లో INC ఈ తరహా హామీలను ప్రకటిస్తోంది. ఈ క్రమంలో పథకాన్ని సమీక్షిస్తామని చెప్పడం ఇతర రాష్ట్రాల్లో హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తినట్టైంది.
కెరీర్ ఆరంభంలో చేసిన రెండు సినిమాల నిర్మాతలు తనకు డబ్బులు ఎగ్గొట్టారని నటి నోరా ఫతేహీ ఆరోపించారు. తాను వాటి గురించి కూడా పట్టించుకోలేదని, కెరీరే ముఖ్యమని నమ్మినట్లు చెప్పారు. ‘మోడల్గా కెరీర్ ప్రారంభించినప్పుడు దోపిడీకి గురయ్యా. ఏజెన్సీ వాళ్లు డబ్బులిచ్చేవారు కాదు. ఇంటి అద్దె కట్టలేకపోయా. యశ్రాజ్ ఫిల్మ్ వారికి ఆడిషన్ ఇవ్వగా అందంగా లేనన్నారు. కోపమొచ్చి ఫోన్ పగలకొట్టా’ అని ఆమె చెప్పుకొచ్చారు.
TG: గ్రూప్-4 ఉద్యోగాల భర్తీలో నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీని ద్వారా గ్రూప్-4 కంటే పై స్థాయి ఉద్యోగం వచ్చిన అభ్యర్థులు ఇందులో జాయిన్ కారని, పోస్టులు బ్యాక్ లాగ్ కావంటున్నారు. ఇలా భర్తీ చేస్తే మరో 3000 మందికి డౌన్ మెరిట్లో ఉద్యోగాలు వస్తాయంటున్నారు. లిస్ట్ ఇవ్వకముందే సీఎం రేవంత్, TGPSC ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
TG: కులగణనను రాజకీయం చేయవద్దని BC కమిషన్ ఛైర్మన్ నిరంజన్ కోరారు. ‘ఇదొక బృహత్తర కార్యక్రమం. కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. BCల జనాభా తేల్చేందుకు ఈ సర్వే కీలకం. 52% BCలు ఉన్నారని చెప్పుకుంటూ వస్తున్నాం. దాన్ని నిరూపించుకునేందుకు ఇదే అవకాశం. మళ్లీ కులగణన జరుగుతుందో లేదో తెలియదు. కులసంఘాలు దీనిలో కీలకపాత్ర పోషించాలి. ప్రజలూ సహకరించాలి’ అని కోరారు.
నిత్యం మనం వినియోగించే కరెన్సీ తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి ₹1.11 ఖర్చు అవుతుంది. ఇది నాణెం విలువ కంటే ఎక్కువ. రెండు రూపాయల నాణేనికి ₹1.28, 5 రూపాయల నాణేనికి ₹3.69 ఖర్చవుతుంది. రూ.10 నోట్ల ముద్రణకు ₹0.96, ₹20కి ₹0.95, రూ.50కి ₹1.13, ₹100కి ₹1.77 ఖర్చవుతుంది. UPI వినియోగం అధికంగా ఉన్నప్పటికీ దేశంలో ఇప్పటికీ ₹34.7 లక్షల కోట్ల నగదు సర్క్యులేషన్లో ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాదిని లాభాలతో ప్రారంభించాయి. దీపావళి సందర్భంగా శుక్రవారం సాయంత్రం జరిగిన ముహూరత్ ట్రేడింగ్లో సెంటిమెంట్ ప్రకారం ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో సెన్సెక్స్ 335 పాయింట్ల లాభంతో 79,724 వద్ద, నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 24,304 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్ మొదలుకొని హెల్త్కేర్ వరకు అన్ని రంగాలు గ్రీన్లో ముగిశాయి. IT స్వల్ప నష్టాలు చవిచూసింది.
Sorry, no posts matched your criteria.