India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్లో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్ సమస్యతో పలు స్టేషన్లు మూతపడ్డాయి. దీంతో ఉదయం కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగోల్-రాయదుర్గం మార్గంలోనే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మూడోసారి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. పాకిస్థాన్ నటుడు, నిర్మాత డోడి ఖాన్ను వివాహమాడనున్నట్లు ఆమె SMలో ప్రకటించారు. ‘ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. నా జీవితంలో సరైన వ్యక్తి ఇన్నాళ్లకు దొరికాడు. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మేం పెళ్లి చేసుకోబోతున్నాం’ అని పోస్ట్ పెట్టారు. కాగా రాఖీ సావంత్ గతంలో రితేష్ సింగ్, ఆదిల్ ఖాన్ దురానీని పెళ్లాడి విడాకులు తీసుకున్నారు.

ఇంగ్లండ్తో నిన్న జరిగిన మ్యాచ్లో హార్దిక్ ఆటతీరుపై (35 బంతుల్లో 40)భారత మాజీ కీపర్ పార్థివ్ పటేల్ విమర్శలు గుప్పించారు. ‘హార్దిక్ తన ఆటతో ఇతర బ్యాటర్లపై అనవసర ఒత్తిడిని పెంచారు. చాలా బంతులు డాట్స్ ఆడారు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేసి ఉన్నా బాగుండేది. టీ20 మ్యాచ్లో క్రీజులో కుదురుకునేందుకు 20 బంతులు తీసుకోవడం దారుణం’ అని అన్నారు. కాగా.. సిరీస్లో తర్వాతి మ్యాచ్ ఈ నెల 31న జరగనుంది.

ట్రంప్ సర్కారు ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. వైట్హౌస్లో జరిగే ప్రెస్మీట్లకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా అనుమతించాలని నిర్ణయించింది. వారిని కూడా వార్తాసంస్థలుగానే పరిగణించి వారికోసం సీట్లు కేటాయిస్తామని పేర్కొంది. పాడ్కాస్టర్లు, కంటెంట్ క్రియేటర్లు కూడా వీరిలో ఉంటారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ సంప్రదాయ మీడియాకు బదులు సోషల్ మీడియానే ఎక్కువగా వాడుకున్న సంగతి తెలిసిందే.

ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట జరిగిన సంగం ఘాట్ వద్దకు రావొద్దని UP CM యోగి ఆదిత్యనాథ్ భక్తులకు సూచించారు. తమకు సమీపంలోని ఘాట్ల వద్ద అమృత స్నానాలు ఆచరించాలని కోరారు. భక్తకోటి కోసం వేర్వేరు ఘాట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మిగతా అన్ని చోట్లా అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారుల సూచనలు పాటించాలని కోరారు. నేడు మహా కుంభమేళాకు 10 కోట్ల మంది వచ్చినట్టు అంచనా.

నిధులను ఫ్రీజ్ చేస్తూ ట్రంప్ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని US డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి లారెన్ అలీఖాన్ తాత్కాలికంగా అడ్డుకున్నారు. MON వరకు స్టే ఇచ్చారు. DEI సహా అనేక ప్రోగ్రామ్స్ అమలు కోసం రాష్ట్రాలు, కొన్ని సంస్థలకు ఫెడరల్ గవర్నమెంట్ లోన్లు, గ్రాంట్లు ఇస్తుంది. వీటిని సమీక్షించాలని ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేయడంతో సందిగ్ధం నెలకొంది. దీంతో NGOలు కోర్టును ఆశ్రయించాయి.

మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో అర్ధరాత్రి <<15295646>>తొక్కిసలాట<<>> జరిగి పలువురు మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. ఘటనాస్థలంలో భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. కొంతమంది మహిళల మృతదేహాలు ఆసుపత్రి ఫ్లోర్లో ఉన్నాయంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమం వద్ద తొక్కిసలాటపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్కు ఫోన్ చేశారు. సహాయ చర్యలపై ఆరా తీశారు. పరిస్థితులను సమీక్షించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరారు. అంతకు ముందు తొక్కిసలాట జరిగిందని తెలియగానే మోదీ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో 13 అఖాడాల సాధువులు నేడు పవిత్ర స్నానాలను వాయిదా వేసుకున్నారు.

జైళ్ల రిజిస్టర్లలో కులం కాలమ్ తొలగించాలని తాము 3 నెలల క్రితమే ఆదేశించినప్పటికీ కేంద్రం, 11 రాష్ట్రాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. AP సహా 11 రాష్ట్రాలు బ్రిటిష్ కాలం నాటి జైలు మాన్యువల్ వాడుతున్నాయని దాఖలైన ఓ పిటిషన్ను 3 నెలల క్రితం సుప్రీం విచారించింది. ఆ సమయంలో జారీ చేసిన ఆదేశాలను రాష్ట్రాలు ఇంకా అమలు చేయలేదని, 3వారాల్లో పురోగతి నివేదించాలని ఆదేశించింది.

కెనడాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తమ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందన్న రిపోర్టును ఖండించింది. నిజానికి వాళ్లే భారత అంతర్గత వ్యవహారాల్లో నిరంతరం జోక్యం చేసుకుంటారని ఎదురుదాడి చేసింది ‘ఆ రిపోర్టు అబద్ధాల పుట్ట. వ్యవస్థీకృత నేరాలు, అక్రమ వలసదారులకు అనువైన వాతావరణాన్ని ఇది సృష్టిస్తోంది. మాపై ఆరోపణలను ఖండిస్తున్నాం. ఇకపై అక్రమ వలసదారులను ప్రోత్సహించకుండా ఉంటారని ఆశిస్తున్నాం’ అని MEA తెలిపింది.
Sorry, no posts matched your criteria.