India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశంలో 55% ట్రక్ డ్రైవర్లు దృష్టి సమస్యలతో బాధపడుతున్నట్టు IIT ఢిల్లీ-ఫోర్సైట్ ఫౌండేషన్ సర్వేలో తేలింది. వీరిలో 53% మందికి దూర దృష్టి, 47% మందికి దగ్గరి దృష్టి సమస్యలు ఉన్నట్లు వెల్లడైంది. 44.3% డ్రైవర్లు BMI, 57.4% మంది BP సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది. డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితులు రహదారి భద్రతను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో తాజా నివేదిక వారి ఆరోగ్య సంరక్షణ అవసరాన్ని నొక్కిచెప్పినట్టైంది.

భారత్తో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా చేతులెత్తేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేసింది. హార్దిక్(40) కాసేపు ప్రయత్నించినా మరోవైపు నుంచి సహకారం కరువైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్టన్ 3, ఆర్చర్, కార్స్ తలో 2, రషీద్, వుడ్ చెరో వికెట్ తీశారు. 5 టీ20ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది.

UKలో 5K+ ఉద్యోగులున్న 200 కంపెనీలు 4 డేస్ వీక్ అమలుకు అంగీకరించాయి. వందేళ్ల క్రితం ప్రారంభమైన 9-5, ఐదు రోజుల పని వారం ఇప్పటి కాలానికి అనుగుణంగా లేదని నిపుణులు భావిస్తున్నారు. వారానికి 4 రోజుల పని ఉద్యోగులకు 50% ఎక్కువ స్వేచ్ఛను ఇస్తుందని, ఇది వారి జీవితాలను సంతోషంగా, సంతృప్తిగా గడపడానికి అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. మరోవైపు భారత్లో 70, 90 గంటల పనివేళలపై చర్చ నడుస్తుండడం తెలిసిందే.

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్ చేశారు. రేపు ఎన్నికల నిర్వహణపై ఆయన మంత్రులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులో ఎలక్షన్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో రేపు జరిగే మీటింగ్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మచిలీపట్నానికి చెందిన సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితుడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2014లో ఎస్తేర్ను చంద్రభాను ముంబైలో హత్యాచారం చేసినట్టు నిర్ధారించిన ఉమెన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. 2018లో హైకోర్టు కూడా సమర్థించింది. నిందితుడు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా చంద్రభాను హత్యచేసినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందంటూ అతడిని నిర్దోషిగా తేల్చింది.

యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం SCR 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-దానాపూర్ మధ్య ఫిబ్రవరి 5, 7 తేదీల్లో దానాపూర్-చర్లపల్లి మధ్య 7,9 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.

TG: ఎప్పుడో ముగిసిన దావోస్ పర్యటనపై ఇప్పుడెందుకు దావత్ అంటూ సీఎం రేవంత్ ప్రెస్ మీట్పై హరీశ్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతు భరోసా కోసం గంపెడు ఆశతో ఎదురుచూస్తూ కొండంత ఆందోళన చేస్తున్న రైతుల ఆరాటాన్ని చిల్లర పంచాయితీ అంటావా? అని సీఎంను నిలదీశారు. రైతుల అప్పులు ముఖ్యమా? దావోస్ డప్పులు ముఖ్యమా? అని ప్రశ్నించారు. ఇకనైనా రేవంత్ కళ్లు తెరవాలని, మంచి మానసిక వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

AP: కుప్పంలో UNకు చెందిన ‘1M1B’ సంస్థ గ్రీన్ స్కిల్స్ అకాడమీ సెంటర్ ప్రారంభించినట్లు CM చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తుకు అవసరమైన టెక్నాలజీతో వర్క్ఫోర్స్ను ఇది అందిస్తుందని చెప్పారు. కొన్నేళ్లలో 1M1B(1మిలియన్ 1 బిలియన్) ద్వారా 50వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని వెల్లడించారు. దీని ద్వారా 30వేల మందికి వర్క్ప్లేస్ అనుభవం, ఇంటర్న్షిప్ అందుతుందని అంచనా వేశారు.

భారత ఓపెనర్ సంజూ శాంసన్ ఈ సిరీస్లో మరో సారి విఫలమయ్యారు. మూడు మ్యాచుల్లో ఆయన ఆర్చర్ బౌలింగ్లోనే ఔటవ్వడం గమనార్హం. తొలి మ్యాచులో 26 పరుగులు చేయగా తర్వాతి రెండు మ్యాచుల్లో 8 పరుగులే నమోదు చేశారు. కొన్ని నెలల క్రితం అవకాశాలు రావట్లేదని బాధపడితే ఇప్పుడు ఛాన్స్ వచ్చినా వినియోగించుకోవట్లేదని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచులో భారత జట్టుకు షాక్ తగిలింది. 68 పరుగులకే ఓపెనర్లు అభిషేక్(24), శాంసన్(3) సహా సూర్య కుమార్ యాదవ్(14), తిలక్ వర్మ వికెట్లను కోల్పోయింది. రెండో టీ20 మ్యాచ్ విన్నర్ తిలక్ 18 పరుగులే చేసి రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యారు.
Sorry, no posts matched your criteria.