News January 28, 2025

ABVకి వేతనం, అలవెన్సులు చెల్లించాలని ఆదేశాలు

image

AP: విశ్రాంత IPS AB వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. గత ప్రభుత్వం ఈయన్ను 2సార్లు సస్పెండ్ చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తొలిసారి 2020 FEB-2022 FEB 7వరకు, రెండో సారి 2022 JUN 28- మే 30 వరకు సస్పెండ్ చేయగా, ఈ కాలంలో విధులు నిర్వహించినట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ కాలానికి సంబంధించి ABVకి మొత్తం వేతనం, అలవెన్సులు చెల్లించాలని ఆదేశాలిచ్చింది.

News January 28, 2025

DeepSeek: చైనా యాప్ కదా అరుణాచల్ ఎక్కడుందో తెలీదు పాపం!

image

గ్లోబల్ టెక్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న చైనీస్ డీప్‌సీక్ AIకి పాపం..! అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడుందో తెలియదట. అదొక భారత రాష్ట్రమని ప్రాంప్ట్ ఇస్తే ‘సారీ, అది నా నాలెడ్జ్‌కు అందని ప్రశ్న. ఇంకేదైనా మాట్లాడుకుందామా’ అని జవాబిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల గురించీ తెలియదట. మన అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా పేచీలు పెట్టే సంగతి తెలిసిందే. అది టిబెట్‌లో భాగమని వాదిస్తుంటుంది. అందుకే ఆ యాప్ వీటిపై జవాబులివ్వడం లేదు.

News January 28, 2025

ఎక్స్‌పీరియం పార్క్ అద్భుతమైన కళాఖండం: చిరంజీవి

image

TG: రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో 150ఎకరాల్లో నిర్మించిన ఎక్స్‌పీరియం పార్క్ అద్భుతమైన కళాఖండం అని హీరో చిరంజీవి అన్నారు. ఈ థీమ్ పార్క్ HYDకు ల్యాండ్ మార్క్ అని, దీంతో నగరంలో టూరిజం మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ పార్కును చూసి తాను, CM ఆశ్చర్యానికి గురయ్యామని చెప్పారు. పార్క్‌ని షూటింగ్స్‌కు ఇస్తారా? అని అధినేత రాందేవ్‌ను అడిగితే, ఫస్ట్ తన సినిమా అయితేనే ఇస్తామన్నారని చిరంజీవి సరదాగా చెప్పారు.

News January 28, 2025

భారత్ ఘన విజయం

image

ఐసీసీ ఉమెన్స్ U19 టీ20 వరల్డ్ కప్ సూపర్ 6లో భాగంగా స్కాట్లాండ్‌తో మ్యాచులో భారత్ 150 రన్స్ తేడాతో గెలిచింది. మొదట ఇండియా 20 ఓవర్లలో 208/1 స్కోర్ చేయగా, స్కాట్లాండ్ 58 పరుగులకే ఆలౌటైంది. తెలుగమ్మాయి గొంగడి త్రిష 110 రన్స్ చేయడంతో పాటు 3 వికెట్లు తీసి అద్భుతంగా రాణించారు. కమలిని 51 రన్స్ చేయగా ఆయుషి శుక్లా 4, వైష్ణవి శర్మ 3 వికెట్లతో అదరగొట్టారు.

News January 28, 2025

భార్యను ముక్కలు చేసిన ఘటన.. ఎట్టకేలకు గురుమూర్తి అరెస్ట్

image

TG: మీర్‌పేటలో భార్య మాధవిని ముక్కలుగా నరికి పొడి చేసిన ఘటనలో నిందితుడు గురుమూర్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. భార్యను కిరాతకంగా చంపిన నిందితుడు పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. వారం రోజులుగా విచారిస్తున్నా అతను సమాధానం చెప్పలేదు. దీంతో ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో పోలీసులు కచ్చితమైన ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలోనే గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు.

News January 28, 2025

వెట్రిమారన్‌తో సినిమా వద్దు..ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ విజ్ఞప్తులు

image

వెట్రిమారన్ నిర్మించిన బ్యాడ్‌గర్ల్ సినిమా వివాదాస్పదంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఒక వర్గాన్ని వెట్రి కావాలనే కించపరిచేలా సినిమా తీయించారంటూ నెట్టింట విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఆ విమర్శల నేపథ్యంలో అతడితో సినిమా మానుకోవాలంటూ పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. బ్యాడ్‌గర్ల్ సినిమాతో వెట్రి తన విలువను పోగొట్టుకున్నారంటూ మండిపడుతున్నారు.

News January 28, 2025

WCలలో తొలి సెంచరీలు చేసిన మహిళా బ్యాటర్లు వీరే..

image

తెలంగాణలోని ఖమ్మంకు చెందిన గొంగడి త్రిష U19 T20 WCలో సెంచరీతో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. 59 బంతుల్లోనే 110 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ క్రమంలో మహిళల U19 T20 WCలో తొలి సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. ఉమెన్స్ ODI WCలో తొలి సెంచరీ ఇంగ్లండ్ ప్లేయర్ లిన్ థామస్(1973) నమోదు చేశారు. T20 WCలో మొదటి సెంచరీ వెస్టిండీస్ బ్యాటర్ డియాండ్రా డాటిన్(2010) పేరిట ఉంది.

News January 28, 2025

టిక్‌టాక్‌ను కొనేందుకు మైక్రోసాఫ్ట్ చర్చలు: ట్రంప్

image

చైనా సంస్థ టిక్‌టాక్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆ యాప్‌ను దక్కించుకునేందుకు బిడ్డింగ్ వార్ జరగొచ్చని అంచనా వేశారు. అమెరికాలో ఉండాలంటే టిక్‌టాక్ నిర్వహణ అమెరికన్ల చేతిలోనే ఉండాలని ట్రంప్ ముందునుంచీ చెబుతున్నారు. కాగా.. ఒరాకిల్, టెస్లా వంటి పలు సంస్థలు టిక్‌టాక్ కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం.

News January 28, 2025

రాష్ట్రంలో టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజం వెనకబడుతోంది: CM

image

అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని CM రేవంత్ అన్నారు. ప్రొద్దుటూరులో ఎక్స్‌పీరియం పార్కు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజం వెనకబడుతోంది. మందిరాలు, అటవీ ప్రదేశాల సందర్శన కోసం ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం. త్వరలో వికారాబాద్‌ను అభివృద్ధి చేస్తాం’ అని తెలిపారు.

News January 28, 2025

రాజకీయాల్లో ఒత్తిడి ఉంటుంది.. సంసిద్ధమై రావాలి: అయోధ్య

image

AP: విజయసాయిరెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగత విషయమని MP అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో నంబర్స్ గేమ్ నడుస్తోందని, అందువల్ల ప్రజాప్రతినిధులపై ఒత్తిడి ఉంటుందన్నారు. అన్నిరకాలుగా సంసిద్ధమై రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చెప్పారు. ప్రస్తుత పరిణామాలతో YCPకి భవిష్యత్తు లేదనడం సరికాదని తెలిపారు. ఓటమి ఎదురైనప్పుడు సమస్యలు, సవాళ్లు ఉంటాయని.. వాటిని తట్టుకుంటేనే మనుగడ సాధ్యమన్నారు.