India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: మంత్రి లోకేశ్కు Dy.CM పదవి ఇవ్వాలన్న అంశంపై MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. TDP నేతలు ఆ పదవి ఇవ్వాలనడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని చెప్పారు. పార్టీ కోసం లోకేశ్ కష్టపడి పని చేశారని, అందుకు ఆయనకు సముచిత స్థానం ఇచ్చారని తెలిపారు. లోకేశ్కు Dy.CM ఇవ్వాలని ఇటీవల పలు సందర్భాల్లో ఆ పార్టీ నేతలు కొందరు కోరగా టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

తనకు ఎక్కడా దొరకని ఆనందం ఇంట్లో లభిస్తుందని రష్మిక వెల్లడించారు. విజయాలు వస్తూ పోతుంటాయని, ఇల్లు శాశ్వతమని పేర్కొన్నారు. ఎంతో ప్రేమాభిమానాలు పొందినప్పటికీ తాను ఒక కుమార్తె, సోదరిగా ఉండే జీవితాన్ని గౌరవిస్తానని చెప్పారు. ‘ఛావా’ ప్రమోషన్లలో మాట్లాడుతూ ‘ఎదుటివాళ్లను గౌరవించేవారిని, నవ్వుతూ ఉండేవారిని నేను ఇష్టపడతా’ అని తెలిపారు. కాగా ఆమె VDKతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

నోయిడా శివ్నాడార్ స్కూల్ స్టూడెంట్ దక్ష్ మలిక్ (14) చరిత్ర సృష్టించారు. నాసా IADPలో పాల్గొని ఓ ఆస్టరాయిడ్ను గుర్తించారు. దానికి పేరు పెట్టే గౌరవం దక్కించుకున్నారు. స్పేస్ డాక్యుమెంటరీలు చూస్తూ బాల్యం నుంచే ఆస్ట్రానమీపై ఆసక్తి పెంచుకున్నారు. 2023లో ఇద్దరు స్కూల్మేట్స్తో కలిసి IADPలో చేరి Dr ప్యాట్రిక్ మిల్లర్ నేతృత్వంలో ఆస్టరాయిడ్లను శోధించారు. ఇప్పటి వరకు భారత్ నుంచి ఐదుగురు ఈ ఘనత సాధించారు.

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్లో సౌతాఫ్రికా తరఫున ఆడనున్నారు. 2018లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఆయన, 2021 సీజన్ వరకు ఐపీఎల్లో RCB జట్టుకు ఆడారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్గా పనిచేశారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రికెట్ మ్యాచులపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.

‘గేమ్ ఛేంజర్’ సినిమాను నిర్మించిన SVC బ్యానర్లో రామ్ చరణ్ మరో సినిమా చేయబోతున్నారన్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది. ‘దిల్ రాజు బ్యానర్లో మూవీపై ఇంకా ఎలాంటి ప్లాన్ జరగలేదు. ప్రస్తుతం RC16 (బుచ్చిబాబు), RC 17 (సుకుమార్) సినిమాలు మాత్రమే రామ్ చరణ్ చేస్తున్నారు’ అని తెలిపింది. మరోవైపు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ప్రారంభమైందన్న వార్తలను NTR టీమ్ ఖండించింది.

AP: సూపర్ సిక్స్ పథకాలు బొక్క బోర్లా పడ్డాయని వైసీపీ ఆరోపించింది. ఎలాగైనా చేస్తారని నమ్మి ఓట్లేశాం కదా అనే ఫీలింగ్లోకి జనం వెళ్తున్నారని పేర్కొంది. అందుకే CM చంద్రబాబు వాస్తవాల పేరిట చావు కబురు చల్లగా చెప్పారని తెలిపింది. సంపద సృష్టించి ఇంటింటికీ పంచుతానన్న చంద్రబాబు డబ్బుల్లేవని నాటకాలు ఆడుతున్నారని మండిపడింది. ఇలాంటి వారికి ఒళ్లంతా వాతలు పెట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారని వివరించింది.

ఆంటిగ్వా, బహ్రైన్, బెర్ముడా, బ్రూనై, బహమాస్, కాయ్మన్ ఐలాండ్స్, UAE, కువైట్, మొనాకో, ఒమన్, ఖతార్, సెయింట్ కీట్స్, సౌదీ అరేబియా, సోమాలియా, తుర్క్స్ & కైకోస్ ఐలాండ్స్, వనాటు, వెస్ట్రన్ సహారాలో Income Tax ఉండదు. ప్రత్యామ్నాయ పద్ధతులు, పరోక్ష పన్నుల ద్వారా ఆయా దేశాలు ఆదాయం సమకూర్చుకుంటాయి. అమెరికాలో ఆదాయ పన్నును రద్దు చేసేందుకు యోచిస్తున్నామంటూ <<15288589>>ట్రంప్<<>> ప్రకటించడంతో వీటిపై చర్చ జరుగుతోంది.

చైనీస్ డీప్సీక్AI పంజాకు గ్లోబల్ టెక్ కంపెనీ, సిలికాన్ వ్యాలీ ముద్దుబిడ్డ Nvidia షేర్లు కుదేలయ్యాయి. రాత్రికి రాత్రే $593 బిలియన్ల మార్కెట్ విలువ హరించుకుపోయింది. ఒక్కరోజులోనే 17% తగ్గింది. భారత కరెన్సీలో ఈ విలువ ఏకంగా రూ.51లక్షల కోట్ల వరకు ఉంటుంది. LSEG డేటా ప్రకారం వాల్స్ట్రీట్ చరిత్రలోనే ఇదే రికార్డు ఒకరోజు మార్కెట్ విలువ నష్టం. దీంతో మరికొన్ని రోజులూ టెక్ షేర్లకు నష్టాలు తప్పకపోవచ్చు.

ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. పిటిషనర్ బాలయ్య తరఫు న్యాయవాది మణీంద్రసింగ్పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదొక పనికిమాలిన పిటిషన్ అని, దీనిపై ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ కేసును వాదించడానికి ఎలా వచ్చారంటూ ప్రశ్నించింది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో దాదాపు 10 రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 2 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 తగ్గి రూ.81,930గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.450 తగ్గి రూ.75,100కు చేరింది. వెండి ధర కేజీకి రూ.1,000 తగ్గి రూ.1,04,000గా ఉంది.
Sorry, no posts matched your criteria.