News January 27, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ.. రేపు టికెట్లు విడుదల

image

FEB 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు ICC వెల్లడించింది. PAK కాలమానం ప్రకారం మ.2 గంటలకు టికెట్లు <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంటాయంది. కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరిగే 10 మ్యాచ్‌ల టికెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. దుబాయ్ వేదికగా జరిగే IND మ్యాచ్‌ల టికెట్లను త్వరలో రిలీజ్ చేస్తామంది. ఫైనల్ మ్యాచ్(MAR 9) టికెట్లు 4 రోజుల ముందు అందుబాటులోకి వస్తాయంది.

News January 27, 2025

శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ సీజ్

image

TG: మాదాపూర్‌లో శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్‌‌ లైసెన్స్ రద్దు చేసిన అధికారులు తాజాగా కిచెన్‌ను సీజ్ చేశారు. ఈ మేరకు ఆ ఫొటోలను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ట్వీట్ చేశారు. ఆరు నెలల వ్యవధిలో పలుమార్లు చేసిన తనిఖీల్లో పిల్లలకు నాసిరకం భోజనం అందిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే.

News January 27, 2025

విడాకుల తర్వాత బాధపడ్డా.. కానీ ధైర్యాన్ని కోల్పోలేదు: సమంత

image

విడాకులు తీసుకున్న మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో తనకు బాగా తెలుసునని హీరోయిన్ సమంత చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నా గురించి ఎన్నో అబద్ధాలు పుట్టించారు. అందులో నిజం లేదని చాలాసార్లు చెప్పాలనిపించింది. అయితే నాతో నేను చేసుకున్న సంభాషణే ఆపింది. డివోర్స్ తర్వాత బాధగా అనిపించినా నేను ఏడుస్తూ ధైర్యాన్ని కోల్పోలేదు. నా జీవితంలో తదుపరి అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నా’ అని పేర్కొన్నారు.

News January 27, 2025

కస్టోడియల్ డెత్‌ కేసు: 8 మంది పోలీసులకు జీవిత ఖైదు

image

కస్టోడియల్ డెత్‌ కేసులో చండీగఢ్ CBI ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హిమాచల్‌ ప్ర‌దేశ్‌కు చెందిన ఐజీ స‌హా మ‌రో ఏడుగురు తాజా, మాజీ పోలీసుల‌కు జీవిత ఖైదు విధించింది. 2017లో సిమ్లాలో ఓ మైన‌ర్ బాలికపై హ‌త్యాచారం కేసులో నిందితుడు పోలీసుల క‌స్ట‌డీలో మృతి చెందాడు. అయితే క‌స్ట‌డీలో ఉన్న అతణ్ని మ‌రో నిందితుడు హ‌త్య చేసిన‌ట్టు పోలీసులు చిత్రీక‌రించారు. విచార‌ణ అనంత‌రం కోర్టు వారిని దోషులుగా తేల్చింది.

News January 27, 2025

ఘోరం: శానిటరీ ప్యాడ్ అడిగిన బాలికను..

image

శానిటరీ ప్యాడ్ అడిగిన 11వ తరగతి బాలిక పట్ల ప్రిన్సిపల్ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన UP బరేలీలో జరిగింది. ఎగ్జామ్ రాస్తుండగా విద్యార్థినికి పీరియడ్స్ మొదలయ్యాయి. బ్లీడింగ్ కావడంతో దిక్కుతోచని ఆమె శానిటరీ ప్యాడ్ ఇవ్వాలని ప్రిన్సిపల్‌ను అడిగింది. వెంటనే ఏర్పాటుచేయాల్సిన ఆయన బాలికను అవమానిస్తూ గంటపాటు బయట నిలబెట్టాడు. ఈ ఘటనపై ఆమె తండ్రి ఫిర్యాదుతో విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News January 27, 2025

కాంబ్లీకి విడాకులు ఇవ్వాలనుకున్నా.. కానీ: ఆండ్రియా

image

మాజీ క్రికెటర్ <<15042382>>వినోద్ కాంబ్లీతో<<>> వివాహ బంధంపై రెండో భార్య ఆండ్రియా హెవిట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాగుడుకు బానిసైన ఆయనకు 2023లో విడాకులు ఇవ్వాలనుకున్నట్లు తెలిపారు. అయితే కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆలోచనను విరమించుకున్నట్లు చెప్పారు. ‘నేను వదిలేస్తే కాంబ్లీ నిస్సహాయ స్థితిలో ఉంటారు. అది నన్ను బాధిస్తుంది. అందుకే డివోర్స్‌ నిర్ణయం వెనక్కి తీసుకున్నా’ అని పేర్కొన్నారు.

News January 27, 2025

ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్

image

అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఎన్నికల్లో గెలవడం, బాధ్యతలు చేపట్టడంపై మోదీ అభినందనలు తెలియజేశారు. ట్రంప్ పాలనలో అమెరికా మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరువురు నేతల మధ్య ఇదే తొలి ఫోన్ సంభాషణ.

News January 27, 2025

మీర్‌పేట ఘటన.. 10 గంటల పాటు రాక్షసకాండ

image

TG: మీర్‌పేట ఘటనలో భార్యను భర్త గురుమూర్తే చంపాడని పోలీసులు ఆధారాలు సేకరించారు. సంక్రాంతి రోజు భార్యతో గొడవ పడగా ఆమె తాళి తీసి విసిరికొట్టడంతో కోపాద్రిక్తుడైన అతను దాడి చేసి చంపేశాడు. ఆపై శరీర భాగాలన్నీ కత్తులతో నరికి బకెట్లో వేసి హీటర్‌తో ఉడికించాడు. తర్వాత వాటిని ఎండబెట్టి కాల్చి రోలులో పొడి చేసి చెరువులో పడేశాడు. పండగ రోజు ఉ.8- సా.6గంటల వరకు ఈ రాక్షసకాండ కొనసాగించినట్లు పోలీసుల సమాచారం.

News January 27, 2025

సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్లకు ₹25 కోట్లు

image

12 ఏళ్లకోసారి జరిగే సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ₹25 కోట్లు మంజూరు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో మే 15-26 వరకు జ‌ర‌గ‌నున్న పుష్క‌రాల్లో మౌలిక వసతులు, స్నాన ఘట్టాలు, డ్రైనేజీల నిర్మాణం, రోడ్ల విస్తరణ సహా తదితర పనులను చేప‌ట్ట‌నున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి పుష్కరాలను విజయవంతం చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.

News January 27, 2025

రంజీ జట్టు ప్రకటించిన ఢిల్లీ.. కోహ్లీకి చోటు

image

రంజీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్‌తో ఆడే మ్యాచ్‌కు ఢిల్లీ జట్టును ప్రకటించింది. భారత స్టార్ బ్యాటర్ కోహ్లీ ఎంపిక కాగా, పంత్‌కు చోటు దక్కలేదు. 13ఏళ్ల తర్వాత విరాట్ రంజీ ఆడనున్నారు. JAN 30నుంచి మ్యాచ్ జరగనుంది.
జట్టు: బదోని, కోహ్లీ, ప్రణవ్, సాంగ్వాన్, అర్పిత్, మయాంక్, శివమ్, సుమిత్, వాన్ష్, మనీ, హర్ష్ త్యాగి, సిద్ధాంత్, సైనీ, యశ్ ధుల్, గగన్, జాంటీ సిద్ధు, హిమ్మత్, వైభవ్, ఆర్. గెహ్లోత్, జితేశ్ సింగ్.