News April 24, 2024

ఎంపీ అభ్యర్థి నామినేషన్‌పై మంత్రి పొన్నం కామెంట్స్

image

TG: కరీంనగర్ కాంగ్రెస్ <<13102151>>ఎంపీ<<>> అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అధిష్ఠానం నుంచి స్పష్టమైన సంకేతాలు ఉండడంతోనే ఆయన నామినేషన్ వేసినట్లు తెలిపారు. దీనిపై సీఈసీ అధికారికంగా ప్రకటన చేస్తుందన్నారు. బీజేపీలో సఖ్యత లేదని.. తామంతా ఐక్యంగా ఉన్నామని చెప్పారు.

News April 24, 2024

కేజ్రీవాల్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు

image

డాక్టర్‌ను సంప్రదించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆయనకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు సంబంధించి ప్రతిరోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. తనకు ఇన్సులిన్ ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు.

News April 24, 2024

EVM తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

image

ఎన్నికల్లో ఈవీఎంలు 2004 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వీటిని ECIL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈవీఎంలలో రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి M2, మరొకటి M3 ఈవీఎం. 2006-10 మధ్య కాలంలో తయారైన వాటిని M2గా పిలుస్తారు. వీటిని తయారు చేసేందుకు రూ.8,670 ఖర్చవుతోంది. M3 ఈవీఎంలకు మాత్రం రూ.17 వేల వరకు ఖర్చవుతోంది. <<-se>>#ELECTIONS2024<<>>

News April 24, 2024

జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్‌ను కొన్నది ఎందుకంటే..

image

2010లో లాంఛ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ను 2012లో మార్క్ జుకర్‌బర్గ్ కొనుగోలు చేశారు. అలా ఎందుకు కొన్నారు? తాజాగా లీకైన ఆయన ఈమెయిల్స్‌లో ఆ ప్రశ్నకు జవాబు ఉందని సీఎన్‌బీసీ నివేదిక చెప్పింది. మున్ముందు ఇన్‌స్టా తమకు పోటీదారు అవుతుందని బర్గ్ భావించారట. మొబైల్‌ యాప్‌లలో ఇన్‌స్టా రాణిస్తుందని అంచనా వేసి కొన్నారట. బిలియన్ డాలర్లకు ఆయన దాన్ని కొనగా.. ఇప్పుడు ఇన్‌స్టా విలువ 500 బిలియన్ డాలర్లకు పైమాటే!

News April 24, 2024

ఈ నెల 24న ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు

image

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు HYDలో ఫలితాలను విద్యాశాఖ సెక్రటరీ విడుదల చేయనున్నారు. ఈ ఏడాది దాదాపు 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. అందరి కంటే ముందే ఇంటర్ ఫలితాలను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.

News April 24, 2024

కోహ్లీని వదలని రింకూ

image

రింకూ సింగ్.. కోహ్లీని వదలట్లేదు. తనకు మరో బ్యాట్ ఇవ్వండంటూ అతడి వెంట పడుతున్నారు. మొన్న ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీని కలిసిన రింకూ ‘మీరిచ్చిన బ్యాట్ విరిగింది. మరో బ్యాట్ ఇవ్వండి’ అంటూ బతిమిలాడిన వీడియో వైరలయింది. నిన్న మ్యాచ్ అనంతరం అతడు మళ్లీ కోహ్లీ వెంటే కనిపించారు. అతడితో పాటు ఆర్సీబీ డగౌట్‌లోనూ కూర్చున్నారు. ‘కోహ్లీ బ్యాట్ రింకూకు అచ్చొచ్చినట్లు ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News April 24, 2024

రూ.2లక్షల రుణమాఫీపై సీఎం కీలక ప్రకటన

image

TG: రూ.2లక్షల రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆగష్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతాం. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశాం. ఆరో గ్యారంటీ రుణమాఫీ చేపట్టేలోపే ఎన్నికల కోడ్ వచ్చింది’ అని నిజామాబాద్ సభలో వెల్లడించారు.

News April 24, 2024

ఇజ్రాయెల్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా

image

ఇరాన్, పాలస్తీనాతో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహరోన్ హలీవా కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 7న తమ దేశంపై హమాస్ చేసిన ఆకస్మిక దాడికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. తమకు అప్పగించిన పనిని ఆరోజు సమర్థవంతంగా చేయలేకపోయామని, యుద్ధం వల్ల కలిగిన బాధ తనను నిరంతరం వెంటాడుతోందని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 7 తన దృష్టిలో బ్లాక్ డే అని చెప్పారు.

News April 24, 2024

సెప్టెంబర్ 17లోగా షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తాం: రేవంత్

image

TG: మూతపడ్డ బోధన్ షుగర్ ఫ్యాక్టరీని సెప్టెంబర్ 17లోపు తిరిగి తెరిచేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ జన జాతర సభలో ఆయన మాట్లాడారు. మాయమాటలతో ప్రజలను కవిత, అర్వింద్ మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

News April 24, 2024

వినియోగదారులకు జొమాటో షాక్!

image

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్స్‌కు షాక్ ఇచ్చింది. ఈ నెల 20 నుంచి ప్లాట్‌ఫామ్‌ ఫీజుగా ప్రతి ఆర్డర్‌పై రూ.5 అదనంగా వసూలు చేయడం ప్రారంభించింది. దేశంలోని ప్రధాన మార్కెట్లలో ఇది మొదలైంది. మరో డెలివరీ యాప్ స్విగ్గీ కూడా ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌ ఫీజు పేరిట రూ.5 విధిస్తోంది. ఇక నగరాల మధ్య చేపట్టే ‘ఇంటర్‌సీటీ’ ఫుడ్ డెలివరీని ఆపేస్తున్నట్లు జొమాటో ప్రకటించింది. న్యాయపరమైన సమస్యలే దీనికి కారణమని తెలిపింది.