News January 27, 2025
నవశకానికి నాంది పలికాం: సీఎం రేవంత్

TG: ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించి నవశకానికి నాంది పలికామని CM రేవంత్ ట్వీట్ చేశారు. ‘రైతును రాజును చేసే ‘రైతుభరోసా’, కూలీకి చేయూతనిచ్చే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’, పేదల సొంతింటి కల సాకారం చేసే ‘ఇందిరమ్మ ఇళ్లు’, అన్నార్తుల ఆకలి తీర్చే ‘కొత్త రేషన్ కార్డులు’ వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాం. ఈ సరికొత్త అధ్యాయాన్ని నా సొంత నియోజకవర్గంలో ప్రారంభించాను’ అని పేర్కొన్నారు.
Similar News
News February 8, 2025
ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారు రేవంత్ రెడ్డీ?: హరీశ్ రావు

రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్న అధికారుల సూచనలపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విటర్లో మండిపడ్డారు. ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. ‘ప్రజాపాలనలో, కులగణనలో, గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తులు అంటున్నారు. ప్రజాపాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా? కాలం వెళ్లదీయడం మానేసి ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేయండి’ అని హితవు పలికారు.
News February 8, 2025
ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు?

ప్రస్తుతం వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలను చూస్తుంటే బీజేపీ 27ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ మాట్లాడుతూ.. సీఎం పోస్టుపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. అది తమకు పెద్ద సమస్య కాదన్నారు. ప్రస్తుతం బీజేపీ 42+ స్థానాల్లో లీడింగ్లో ఉంది.
News February 8, 2025
Round 6: ఢిల్లీలో 300 ఓట్ల వెనుకంజలో కేజ్రీవాల్

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ వెనుకంజ వేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆరు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ కన్నా 300 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.