News April 21, 2024

సచిన్ అంచనా తప్పిందిగా..

image

నిన్నటి మ్యాచులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అంచనా తప్పింది. SRH భారీ స్కోరు సాధించినప్పటికీ ఢిల్లీనే గెలుస్తుందని.. మీ అభిప్రాయం ఏంటని ఫ్యాన్స్‌ను ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అయితే మిడిలార్డర్ ఫెయిలవ్వడంతో ఢిల్లీ 199 పరుగులకే ఆలౌటవ్వగా.. సన్‌రైజర్స్ విజయం సాధించింది. దీంతో ఢిల్లీపై SRH పూర్తి ఆధిపత్యం చలాయించిందని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. సన్‌రైజర్స్‌కు అభినందనలు తెలిపారు.

News April 21, 2024

BREAKING: నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు

image

AP: నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ 4 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. మడకశిర- ఎమ్మెస్ రాజు, ఉండి- రఘురామకృష్ణరాజు, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మాడుగుల నుంచి బండారు సత్యనారాయణకి అవకాశం కల్పించింది. కాసేపట్లో అభ్యర్థులకు టీడీపీ చీఫ్ చంద్రబాబు బీఫాంలు అందజేయనున్నారు. నామినేషన్లకు ముందు ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

News April 21, 2024

సీయూఈటీ పరీక్ష తేదీలు విడుదల

image

సీయూఈటీ-యూజీ 2024 పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. మే 15 నుంచి మే 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. మొత్తం 261 కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షకు 13.4 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

News April 21, 2024

నెలాఖరులో రాష్ట్రానికి మోదీ?

image

TG: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచార హోరు పెంచనుంది. ఈ నెల 25న నామినేషన్ల పర్వం ముగియగానే జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచార కార్యక్రమాలకు, బహిరంగ సభలకు హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News April 21, 2024

రేపు ఉండిలో RRR నామినేషన్

image

AP: ఉండి నియోజకవర్గ TDP MLA అభ్యర్థిగా రఘురామకృష్ణ రాజు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉండి MRO ఆఫీసులో రేపు ఉ.10.30 గంటలకు తాను నామినేషన్ వేస్తానని RRR ట్వీట్ చేశారు. ఇందుకోసం పెదఅమిరంలోని స్వగృహం నుంచి భారీ ర్యాలీగా MRO ఆఫీసుకు బయల్దేరనున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొనాలని RRR కోరారు. కాగా తొలుత ఉండి టికెట్ సిట్టింగ్ MLA రామరాజుకు కేటాయించిన CBN.. చివరకు RRRకు ఫైనల్ చేశారు.

News April 21, 2024

ఇందిరాగాంధీనే వణికించిన ఏపీ రాజకీయ నేత

image

ఉమ్మడి APకి 1964-71 వరకు CMగా పని చేసిన కాకలు తీరిన రాజకీయ నేత కాసు బ్రహ్మానందరెడ్డి. 1977లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా కాసు ఎన్నికయ్యారు. ఆ సమయంలో Ex PM ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తి ఏకంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇందిర, రెడ్డి కాంగ్రెస్ వర్గాలుగా CONG చీలిపోయింది. 1980లో రెడ్డి కాంగ్రెస్ తిరిగి ఇందిర వర్గంలో విలీనమైంది. <<-se>>#ELECTIONS2024<<>>

News April 21, 2024

బద్వేలు: 30 ఏళ్లు ఆ ఇద్దరే ప్రత్యర్థులు

image

AP: YSR(D) బద్వేలు సెగ్మెంటుకు అరుదైన రికార్డు ఉంది. 1972 నుంచి 1999 వరకు వరుసగా 7 ఎన్నికల్లో బిజువేముల వీరారెడ్డి, శివరామకృష్ణారావు ప్రత్యర్థులుగా తలపడ్డారు. 5సార్లు వీరారెడ్డి(INC, TDP), 2సార్లు కృష్ణారావు(జనతా పార్టీ, INC) విజయం సాధించారు. ఇన్నేళ్లు, ఇన్నిసార్లు ఆ ఇద్దరే ప్రత్యర్థులుగా నిలబడటం రికార్డు. అలాగే 1967 నుంచి 1999 వరకు వరుసగా 32 ఏళ్ల పాటు బిజువేముల పోటీ చేయడమూ విశేషమే.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 21, 2024

IPL.. వణికిస్తున్న SRH

image

ఈ సీజన్ IPLలో SRH ప్లేయర్లు చెలరేగి ఆడుతున్నారు. మొదట బ్యాటింగ్ వచ్చిందంటే తొలి బంతి నుంచే ఊచకోత మొదలుపెడుతున్నారు. SRH బ్యాటర్ల ధాటికి.. ఆ జట్టుకు బౌలింగ్ చేయాలంటే ప్రత్యర్థి బౌలర్లు వణుకుతున్నారు. ఏ జట్టుతో ఏ గ్రౌండ్‌లో ఆడుతున్నామనేది పట్టించుకోకుండా బౌండరీలతో విరుచుకుపడుతూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ సీజన్‌లో ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్న SRHలో సడెన్‌గా ఈ మార్పు చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News April 21, 2024

పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్

image

ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మధ్యాహ్నం నుంచి అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News April 21, 2024

IPL: సగం మ్యాచులు ముగిశాయి.. అగ్రస్థానం ఎవరిదంటే?

image

ఐపీఎల్ 2024లో లీగ్ దశలో సగం మ్యాచులు ముగిశాయి. పాయింట్స్ టేబుల్‌లో 12 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ తొలి స్థానంలో ఉండగా.. రెండు పాయింట్లతో ఆర్సీబీ అట్టడుగున ఉంది. మరోవైపు ఇప్పటివరకు ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ(361), అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బుమ్రా(13) ఉన్నారు. ఇప్పటికే పలు సంచలనాలు నమోదు కాగా.. మున్ముందు ఇంకెన్ని నమోదవుతాయో వేచి చూడాలి.