News April 21, 2024

అకాల వర్షాలు.. ఆందోళనలో రైతులు

image

TG: వేసవికాలంలో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంట చేతికొచ్చిన సమయానికి వడగండ్ల వానలతో పలు చోట్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వరితో పాటు మొక్కజొన్న, మామిడి ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. నష్టపోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

News April 21, 2024

ఏడాదిలో రూ.1,161 కోట్లు.. 1,031 కేజీల బంగారం

image

AP: వడ్డీ కాసుల వాడి ఖజానా ఏటేటా పెరుగుతోంది. 2023-24లో భక్తులు సమర్పించుకున్న రూ.1,161 కోట్ల నగదు, 1,031 కేజీల బంగారాన్ని టీటీడీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. దీంతో శ్రీవారి నగదు డిపాజిట్లు రూ.18వేల కోట్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వ 11,329 కేజీలకు చేరింది. ఈ మొత్తానికి ఏటా రూ.1,200 కోట్ల వడ్డీ వస్తోంది. అలాగే శ్రీవాణి ట్రస్టుకు నాలుగేళ్లలో రూ.1,200 కోట్ల విరాళాలు వచ్చాయి.

News April 21, 2024

ఏపీలో ఎలక్షన్లు.. రైళ్లకు ఫుల్ డిమాండ్

image

మే 13న జరిగే AP ఎన్నికల్లో ఓటు వేయాలని HYDలోని అక్కడి ఓటర్లు భావిస్తున్నారు. దీంతో ఏపీకి వెళ్లే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మే 10, 11, 12 తేదీల్లో నర్సాపూర్, గోదావరి, గరీభ్‌రథ్, శబరి, చార్మినార్, పద్మావతి, చెన్నై, వెంకటాద్రి సహా పలు రైళ్లలో భారీగా W/L ఉంది. కొన్ని రైళ్లలో W/L పరిధి దాటి రిగ్రెట్ కూడా వస్తోంది. దీంతో కొత్త రైళ్లు, క్లోన్ రైళ్లను రైల్వే శాఖ ప్రకటించాలని ఓటర్లు కోరుతున్నారు.

News April 21, 2024

24న ఇంటర్ ఫలితాలు విడుదల

image

TG: ఇంటర్ ఫలితాలను ఈ నెల 24న విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేయనుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు 9.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అటు టెన్త్ ఫలితాలను ఈ నెల 30న లేదా వచ్చే నెల 1న విడుదల చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టెన్త్, ఇంటర్ ఫలితాలను అందరికంటే ముందుగా WAY2NEWS యాప్‌లో పొందవచ్చు.

News April 21, 2024

ఐపీఎల్‌లో నేడు డబుల్ ధమాకా

image

ఐపీఎల్ 2024లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో ఒకే విజయంతో ఆర్సీబీ చివరి స్థానంలో ఉండగా.. నాలుగు విజయాలతో KKR మూడో స్థానంలో ఉంది. మరోవైపు రాత్రి 7.30 గంటలకు పంజాబ్, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగనుంది. మూడు విజయాలతో GT 8వ స్థానంలో, రెండు విజయాలతో పంజాబ్ 9వ స్థానంలో ఉన్నాయి.

News April 21, 2024

సూర్యకు సౌమ్య చెక్ పెట్టేనా? రికార్డు బ్రేకయ్యేనా?

image

1977 నుంచి INC ఒక్కసారే గెలిచిన, ఒక్క మహిళా గెలవని MP స్థానం బెంగళూరు సౌత్. 1977-84 వరకు జనతా పార్టీ, 1991 నుంచి BJP అభ్యర్థులే సత్తా చాటారు. 2019లో గెలిచిన తేజస్వీ సూర్య మరోసారి బరిలో నిలిచారు. ఇక్కడ పాగా వేయాలనుకుంటోన్న కాంగ్రెస్.. మంత్రి రామలింగారెడ్డి కూతురు సౌమ్యారెడ్డిని బరిలో నిలిపింది. ఆమె గెలిస్తే 2 రికార్డులు బ్రేకవుతాయి. కానీ అంత సులువు కాదంటున్నారు విశ్లేషకులు. <<-se>>#ELECTIONS2024<<>>

News April 21, 2024

రాష్ట్రపతి, ప్రధానిని అందించిన ‘నంద్యాల’

image

AP: దేశానికి రాష్ట్రపతి, ప్రధానిని అందించిన MP నియోజకవర్గంగా నంద్యాల చరిత్రకెక్కింది. 1977 ఎన్నికల్లో 41 స్థానాల్లో INC గెలవగా, జనతా పార్టీ నుంచి నంద్యాలలో గెలిచిన ఏకైక MP నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యారు. 1991లో PV నరసింహారావు PMగా ఎన్నికవడంతో ఆయన కోసం నంద్యాల సిట్టింగ్ MP గంగుల ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో PV.. BJP అభ్యర్థిపై 5.80 లక్షల మెజార్టీతో గెలిచారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 21, 2024

ముగిసిన టెట్‌ గడువు.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

image

TG: టెట్ దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. పరీక్ష కోసం 2,83,441 మంది అప్లై చేసుకున్నారు. పేపర్-1కి 99,210, పేపర్-2కి 1,84,231 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలను సీబీటీ విధానంలో మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పరీక్ష ఫలితాలను జూన్ 12న రిలీజ్ చేస్తామని పేర్కొంది.

News April 21, 2024

సెల్‌ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండో స్థానం

image

TG: పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) పోర్టల్ అందుబాటులోకి వచ్చిన ఏడాదిలోనే 26,833 ఫోన్లను రాష్ట్ర పోలీసులు రికవరీ చేశారు. గత ఏడాది ఏప్రిల్ 13న ఈ సేవలు ప్రారంభం అయ్యాయి. రోజూ 73 ఫోన్ల చొప్పున పోలీసులు తిరిగి స్వాధీన పరుచుకున్నారు.

News April 21, 2024

భారత్‌లోనే జాగ్వార్ లాండ్ రోవర్ కార్ల తయారీ?

image

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాగ్వార్ లాండ్ రోవర్(JLR) లగ్జరీ కార్లను భారత్‌లోనే తయారు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం తమిళనాడులో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కొత్త ప్లాంట్ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్రిటన్, చైనా, బ్రెజిల్, స్లొవాకియాలో JLR ప్లాంట్లు ఉన్నాయి. కాగా 2008లో JLR బ్రాండ్‌ను టాటా మోటార్స్ సొంతం చేసుకుంది.