News April 20, 2024

చూడండి నన్ను విష్ చేయడానికి ఎవరొచ్చారో!: CBN

image

AP: ఎన్నికల నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు గూడూరు నియోజకవర్గంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన బిడ్డతో ఆయనను కలిసేందుకు వచ్చారు. బాబు ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టారు. ఈరోజు తన పుట్టినరోజు కావడంతో ఆ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన CBN.. ‘చూడండి నన్ను విష్ చేయడానికి ఎవరొచ్చారో!’ అంటూ #Blessed హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.

News April 20, 2024

మళ్లీ ఇండియాకు ఆడాలని ఉంది: డీకే

image

మరోసారి తనకు టీమ్ ఇండియా తరఫున ఆడాలని ఉందని ఆర్సీబీ ఫినిషర్ దినేశ్ కార్తీక్ అన్నారు. ‘నా కెరీర్‌లోనే అత్యుత్తమ దశలో ఉన్నా. 100 శాతం సిద్ధంగా ఉన్నా. టీ20 ప్రపంచకప్‌లో నా సేవలు అందించాలని అనుకుంటున్నా. జట్టు గెలుపు కోసం నా శాయశక్తులా కృషి చేస్తా’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో డీకే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఏకంగా 205 స్ట్రైక్ రేట్‌తో 226 పరుగులు బాదారు.

News April 20, 2024

రేపు ‘కల్కి’ రిలీజ్ డేట్ రివీల్?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై ఓ క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నెల 21న ఓ సాలిడ్ గ్లింప్స్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

News April 20, 2024

గులకరాయి డ్రామా, గూడుపుఠాణిని బయటపెడతాం: అచ్చెన్నాయుడు

image

AP: తమ పార్టీ అధికారంలోకి రాగానే గులకరాయి డ్రామా, గూడుపుఠాణిని బయటపెడతామని TDP నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఈ డ్రామాకు దర్శకత్వం వహించిన వారికి తగిన రీతిలో సన్మానం చేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో బోండా ఉమను కావాలనే వేధిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ సీపీ తీరుపై ఈసీ విచారణకు ఆదేశించాలన్నారు. CM జగన్ ప్లాన్ ప్రకారమే రాయి దాడి చేయించుకున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.

News April 20, 2024

కూటమి కుట్రదారులను ఓడించేందుకు సిద్ధమా?: జగన్

image

AP: ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్‌కు దిశానిర్దేశం చేస్తాయని సీఎం జగన్ అనకాపల్లి ‘మేమంతా సిద్ధం’ సభలో వెల్లడించారు. ‘మీ బిడ్డ ప్రతి ఇంటికి మంచి చేశాడు. అబద్ధాలు, మోసాలు, కుట్రదారులను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధమా? కూటమి కుట్రదారులను ఓడించేందుకు సిద్ధమా? మన సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉక్రోశం, కడుపుమంటతో మనపై దాడులు చేస్తున్నారు’ అని ఆరోపించారు.

News April 20, 2024

రేపు TSRJC పరీక్ష

image

TG: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఆదివారం TSRJC పరీక్ష జరగనుంది. రేపు ఉ.10 నుంచి మ.12.30 వరకు ఈ ఎగ్జామ్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సుల్లో అడ్మిషన్లకు 73,527 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. https://tsrjdc.cgg.gov.in నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.

News April 20, 2024

ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, KRMR, భద్రాద్రి, KMM, MHBD, WGL, హనుమకొండ, VKB, SRD, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News April 20, 2024

కవిత బెయిల్ కోసం మోదీతో KCR బేరసారాలు: పొన్నం

image

TG: తన కుమార్తె కవితను జైలు నుంచి విడిపించుకునేందుకు ప్రధాని మోదీతో KCR బేరసారాలు ఆడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంటే BRS, BJP ఓర్వలేకపోతున్నాయి. కరీంనగర్ ఎంపీ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌ను బలిపశువు చేశారు. బండి సంజయ్ హిందువుల పేరు మీద ఓట్ల రాజకీయం చేయడం తప్ప ఏమీ లేదు’ అని ఆయన మండిపడ్డారు.

News April 20, 2024

ఏలూరును ఏలేదెవరో!

image

రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే స్థానాల్లో ఏలూరు ఒకటి. దేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటైన కొల్లేరు ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉంది. సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ నుంచి 1989లో గెలిచారు. తొలినాళ్లలో ఏలూరు కమ్యూనిస్టుల కోటగా ఉంది. ఈ స్థానంలో కాంగ్రెస్ 8సార్లు, TDP 5సార్లు, YCP ఒకసారి నెగ్గాయి. ఈసారి సునీల్ యాదవ్(YCP), పుట్టా మహేశ్ యాదవ్(TDP) ఈ ప్రాంతంపై పట్టు కోసం యత్నిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 20, 2024

కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ లేఖ

image

AP: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ లేఖ రాశారు. సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో బొండా ఉమను ఇరికించేలా కుట్ర చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ పోలీసుల తీరుపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని కనకమేడల విజ్ఞప్తి చేశారు.