India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొందరికి నాన్వెజ్ లేనిదే ముద్ద దిగదు. ఎక్కువ మంది చికెన్, మటన్ తినడానికి ఇష్టపడతారు. కొన్ని బ్లడ్ గ్రూపుల వారు మాంసాహారం తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. A బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక వ్యవస్థ సున్నితంగా ఉండి జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదు. చికెన్, మటన్ వంటివి జీర్ణించుకోలేరు. వీరు పప్పులు, కూరగాయలు తినడం బెటర్. B గ్రూప్ వారు ప్రతిదీ తినొచ్చు. AB, O గ్రూప్ వారు సమతుల్యంగా తినాలి.

USలోని న్యూయార్క్ స్కూళ్లలో మొబైల్ వాడకంపై నిషేధం విధించే యోచనలో ఉన్నామని ఆ రాష్ట్ర గవర్నర్ కతి హోచుల్ తెలిపారు. ఇప్పటికే నగరంలోని 1500కు పైగా పబ్లిక్ స్కూళ్లలో సెల్ ఫోన్ వాడకంపై పరిమితులు విధించారని చెప్పారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, చదువుపై ఫోకస్ చేసేందుకు ఈ ప్రణాళిక రచిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, అక్కడి స్కూళ్లలో 97% మంది విద్యార్థులు క్లాస్ నడిచేటప్పుడే ఫోన్ వాడుతున్నారని అంచనా.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించడానికి చెల్లించాల్సిన ఫీజును నేపాల్ పెంచింది. ఇకపై ఎవరెస్ట్ ఎక్కాలంటే విదేశీ పర్యాటకులు రూ.13 లక్షలు (15 వేల డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇది రూ.9.5 లక్షలుగా ఉండేది. పెరిగిన ధరలు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. కాగా వచ్చిన డబ్బుతో క్లీన్ అప్ డ్రైవ్స్, వేస్ట్ మేనేజ్మెంట్, ట్రెక్కింగ్ కార్యక్రమాలకు వినియోగిస్తారు.

భారత మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. భార్య ఆర్తి అహ్లావత్ నుంచి విడాకులు తీసుకోనున్నట్లు HT పేర్కొంది. వీరిద్దరూ ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో పాటు కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నట్లు తెలిపింది. 2004లో వీరికి పెళ్లి కాగా, ఇద్దరు కుమారులున్నారు. గత దీపావళి రోజు సెహ్వాగ్ ఒంటరిగా ఉన్న ఫొటోలు షేర్ చేయడం విడాకుల వార్తకు బలం చేకూరుస్తోంది.

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంటో భారత పర్యటనకు వచ్చారు. 76వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని భారత్ ఆహ్వానించగా, ఆయన కొద్దిసేపటి కిందటే ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా ఎయిర్పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ఇండోనేషియా అధ్యక్షుడి రాక రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ వెల్లడించింది.

వలస వచ్చిన వారి పిల్లలకు జన్మత: వచ్చే పౌరసత్వ <<15240441>>హక్కు<<>>ను రద్దు చేసిన ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. సియాటెల్ జడ్జి ఆదేశాల ప్రకారం ఆ ఆర్డర్ దేశ వ్యాప్తంగా 14 రోజుల పాటు అమలు కాదు. అలాగే, విచారణ సమయంలో జడ్జి మాట్లాడుతూ ఈ ఉత్తర్వు రాజ్యాంగబద్ధమైందని బార్లోని సభ్యుడు నిస్సందేహంగా ఎలా చెప్పగలరో అర్థం కావడం లేదన్నారు. ఇది తన మనసును కలవరపెడుతోందని చెప్పారు.

భారత T20 జట్టుకు భవిష్యత్ కెప్టెన్ తిలక్ వర్మ అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ అన్నారు. అతని బ్యాటింగ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. తిలక్ వర్మ స్మార్ట్ క్రికెటర్ అని, అతని క్రికెట్ బ్రెయిన్ సూపర్ అన్నారు. అందుకే భవిష్య కెప్టెన్గా ఎదుగుతారని తెలిపారు. 2023 ఆగస్టులో వెస్టిండీస్పై T20 సిరీస్లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తిలక్ ఇప్పటి వరకు 21మ్యాచులు ఆడి 635 రన్స్ చేశారు.

1757: బొబ్బిలి యుద్ధం ప్రారంభం
1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించిన భారత ప్రభుత్వం
1966: భారత ప్రధానిగా ఇందిరా గాంధీ(ఫొటోలో) బాధ్యతలు స్వీకరణ
1966: అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా మరణం
1981: సినిమా నటి కాంచనమాల మరణం
* జాతీయ బాలికా దినోత్సవం

అమెరికాలో జన్మత: వచ్చే పౌరసత్వాన్ని కొత్త అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడంతో అక్కడి భారతీయుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా, అధ్యక్షుడి నిర్ణయాన్ని సియాటెల్ జడ్జి తాత్కాలికంగా నిలిపేయడంతో వారికి ఊరట దక్కినట్లైంది. ఫిబ్రవరి 20 తర్వాత పుట్టిన వారికి సిటిజన్ షిప్ రాదనే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇండియన్స్తో పాటు USAకు వలస వెళ్లిన వారిని టెన్షన్ పెట్టిన విషయం తెలిసిందే.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Sorry, no posts matched your criteria.