News April 16, 2024

దస్తగిరి తప్పించుకునే అవకాశం లేదు: సునీత

image

AP: వివేకా హత్య కేసులో దస్తగిరితో సునీత <<13064596>>లాలూచీ<<>> పడ్డారని ఎంపీ అవినాశ్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. ‘దస్తగిరి అప్రూవర్ అయినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదు. కేసు దర్యాప్తు ఆలస్యం అవుతోందని అవినాశ్ అంటున్నారు.. మరి దీని గురించి ఆయన పోలీసులతో ఎప్పుడైనా మాట్లాడారా? ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తే ఎలా? గూగుల్ టేకౌట్ ఫ్యాబ్రికేటెడ్ కాదు’ అని స్పష్టం చేశారు.

News April 16, 2024

రూ.2.26 లక్షలు పలికిన గుడ్డు

image

జమ్మూకశ్మీర్‌లో గుడ్డు రికార్డు ధర పలికింది. మల్పోరా గ్రామంలో మసీదు నిర్మాణానికి విరాళాలు స్వీకరించగా ఓ వృద్ధుడు గుడ్డును ఇచ్చారు. వచ్చిన విరాళాల వస్తువులను మసీదు కమిటీ వేలానికి ఉంచగా గుడ్డును ఓ వ్యక్తి 70 వేలకు పాడారు. వేలం కొనసాగించగా గుడ్డు ధర పెరుగుతూ రూ.2.25 లక్షలు దాటింది. రూ.6 విలువ చేసే గుడ్డుకు మొత్తంగా రూ.2,26,000లు రావడంతో వేలం పాటను ముగించినట్లు కమిటీ సభ్యులు చెప్పారు.

News April 16, 2024

తృణమూల్ అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తోంది: పీఎం మోదీ

image

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తోందని పీఎం మోదీ ఆరోపించారు. అక్కడి దక్షిణ దీనాజ్‌పూర్ జిల్లాలో జరిగిన సభలో ఆయన ఈమేరకు ప్రసంగించారు. ‘బెంగాల్‌ను గూండాలకు, అక్రమ వలసదారులకు తృణమూల్ లీజుకిచ్చేసింది. శ్రీరామనవమి వేడుకల్ని కూడా చేసుకోనివ్వని పార్టీగా మారింది. అవినీతి, నేరాలు పతాకస్థాయికి చేరాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలపైనా దాడికి పాల్పడుతున్నారు’ అని మోదీ ఆరోపించారు.

News April 16, 2024

ఇండియాకు చేరుకున్న ‘అకాయ్‌’

image

క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఇండియాకు చేరుకున్నారు. రెండో సంతానం కోసం లండన్ వెళ్లిన ఆమె ఫిబ్రవరి 15న కుమారుడు అకాయ్‌కి జన్మనిచ్చారు. సుమారు మూడు నెలలపాటు అక్కడే గడిపిన ఆమె ఇవాళ ముంబైకి చేరుకున్నారు. అనుష్క కుమారుడు అకాయ్‌ని బేబీ క్యారీ బ్యాగ్‌లో ఎత్తుకుని ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఐపీఎల్ కోసం విరాట్ కోహ్లీ నెల క్రితమే ఇండియాకు చేరుకున్న విషయం తెలిసిందే.

News April 16, 2024

రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చాం: సీఎం జగన్

image

AP: తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చామని CM జగన్ తెలిపారు. ‘భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంతోపాటు మిగతా విమానాశ్రయాల విస్తరణ జరుగుతోంది. 3 ఇండస్ట్రియల్ కారిడార్‌ల పనులు జరుగుతున్నాయి. స్వయం ఉపాధి రంగం బలోపేతం కోసం ఆసరా, చేయూత, కాపు నేస్తం, EBC నేస్తం, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం పథకాల ద్వారా సాయం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News April 16, 2024

ఆ యాప్‌లపై యూట్యూబ్ ఉక్కుపాదం

image

యూట్యూబ్‌లో యాడ్‌లతో విసిగిపోయే చాలామంది వాటిని ఆపేందుకు థర్డ్ పార్టీ యాప్‌లను వినియోగిస్తుంటారు. అటు యూట్యూబ్‌కు ప్రధాన ఆదాయం ప్రకటనల వల్లనే కావడంతో ‘స్కిప్ యాడ్’కు వీలు కల్పించే యాప్‌లపై ఉక్కుపాదం మోపాలని సంస్థ నిర్ణయించుకుంది. ఆ యాప్‌లు వాడేవారి వీడియోలు ప్లే అవ్వకపోవడమో లేక బఫరింగ్ అవటమో జరుగుతుందని వివరించింది. తమ నిబంధనల్ని అనుసరించే యాప్‌లను అనుమతిస్తామని స్పష్టం చేసింది.

News April 16, 2024

మేం చేసిన అభివృద్ధి ఇదే: సీఎం జగన్

image

AP: తాము 58 నెలల కాలంలోనే ఎంతో అభివృద్ధి చేశామని సీఎం జగన్ చెప్పారు. ‘కొత్తగా 17 మెడికల్ కాలేజీలు, 4 సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశాం. 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు, 11 వేల ఆర్బీకేలు, 3వేల డిజిటల్ లైబ్రరీలు నిర్మించాం. నాడు నేడుతో స్కూళ్లు, హాస్పిటళ్ల రూపురేఖలు మార్చాం’ అని తెలిపారు.

News April 16, 2024

రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయి: సీఎం జగన్

image

AP: మోసాలు, పొత్తులను నమ్ముకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని CM జగన్ విమర్శించారు. రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయని ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబుకు అభివృద్ధికి సంబంధమే లేదు. సెల్‌ఫోన్ కనిపెట్టింది, ఐటీ తీసుకొచ్చింది, సత్య నాదెళ్లను చదివించింది తానేనని చెప్పుకున్నారు. హైపర్ లూప్, బుల్లెట్ ట్రైన్ తెచ్చి రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు’ అని మండిపడ్డారు.

News April 16, 2024

డీకేను వరల్డ్‌కప్‌లో ఆడించాలి: రాయుడు

image

ఆర్సీబీ ఫినిషర్ దినేశ్ కార్తీక్‌ను వరల్డ్‌కప్‌లో ఆడించాలని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కోరారు. ‘డీకే ఎక్కువగా ధోనీతో పోటీపడ్డారు. ధోనీ రెగ్యులర్ వికెట్ కీపర్‌గా ఉండటంతో కార్తీక్‌కు ఎక్కువగా అవకాశాలు రాలేదు. లేదంటే అతడి కెరీర్ మరోలా ఉండేది. ప్రస్తుతం ఆయన అద్భుత ఫామ్‌లో ఉన్నారు. టీమ్ ఇండియాకు మ్యాచ్ విన్నర్‌గా మారతారు. ప్రపంచకప్‌లో ఆడిస్తే ఆయన కెరీర్ ఘనంగా ముగుస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.

News April 16, 2024

2040 నాటికి 10 లక్షల బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు

image

బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది వరల్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్‌గా మారనుందని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. 2015-20 మధ్య 78 లక్షల మంది ఈ క్యాన్సర్‌కు గురయ్యారని, 6.85 లక్షల మంది చనిపోయారని తెలిపింది. 2040 నాటికి ఈ మరణాలు 10 లక్షలకు చేరొచ్చని పేర్కొంది. ఢిల్లీ AIIMS అధ్యయనం ప్రకారం.. మన దేశంలో 40ఏళ్లు లోపు మహిళల్లోనే 30% రొమ్ము క్యాన్సర్ బాధితులు ఉన్నారు.