News April 16, 2024

ఇజ్రాయెల్ కాదు.. మేమే కూల్చాం: అమెరికా

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడిలో ఎక్కువ మిస్సైల్స్‌, డ్రోన్లను అడ్డుకుంది తామేనని అమెరికా సైనికాధికారులు తాజాగా ఓ వార్తాసంస్థకు తెలిపారు. ‘సుమారు 300కు పైగా క్షిపణులు, డ్రోన్లను ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించింది. సుమారు 80వరకు డ్రోన్లు, కనీసం 6 బాలిస్టిక్ క్షిపణుల్ని మేం పడగొట్టాం’ అని పేర్కొన్నారు. మరోవైపు బ్రిటన్, జోర్డాన్ కూడా తామూ క్షిపణుల్ని అడ్డుకున్నట్లు చెబుతుండటం ఆసక్తికరం.

News April 16, 2024

BIG BREAKING: సీఎం జగన్‌పై దాడి కేసులో పురోగతి!

image

AP: విజయవాడలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. సిట్ అదుపులో ఐదుగురు అనుమానితులు ఉండగా.. వారిలో ఒక యువకుడు దాడి చేసినట్లు సమాచారం. దాడి చేసిన వ్యక్తి అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వాడిగా భావిస్తున్నారు. సీసీ కెమెరాలు, ఇతర వీడియోల్లో నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

News April 16, 2024

కడియం బ్లాక్ మెయిలింగ్ కింగ్: రాజయ్య

image

TG: ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కడియం బ్లాక్ మెయిలింగ్ కింగ్. త్వరలోనే ఆయన విదేశీ ఆస్తుల వివరాలను బయటపెడతా. ఆయన విదేశీ ఆస్తులకు కూతురు కావ్య దంపతులే సాక్షులు. కేసీఆర్‌ను శ్రీహరి వెన్నుపోటు పొడిచారు. కడియంను ప్రజలు చీదరించుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు.

News April 16, 2024

నా మీద కేసులు.. అమెరికాపై దాడే: ట్రంప్

image

పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా కోర్టుకు హాజరైన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా మీద ఈ కేసులు అమెరికాపై దాడే. రాజకీయంగా నన్ను వేధింపులకు గురిచేస్తున్నారు. ఒక అసమర్థుడి పాలనలో దేశం విఫలమవుతోంది. ఈ కేసుల వెనుక కచ్చితంగా అతడి హస్తం ఉంది. రాజకీయ ప్రత్యర్థిపై దాడికి కేసులు వాడుతున్నారు’ అని ట్రంప్ ఆరోపించారు.

News April 16, 2024

రజనీకాంత్ కూతురి పాత్రలో స్టార్ హీరోయిన్?

image

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్ నటించనున్నట్లు సమాచారం. రజనీ కూతురి పాత్రలో ఆమె నటిస్తారని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News April 16, 2024

నేను బ్యాటరైతే బాగుండేది: కమిన్స్

image

RCBపై విజయం తర్వాత SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను బ్యాటరైతే బాగుండేది. ముంబైపై భారీ స్కోరు సాధించాక, మరోసారి అలాంటి ప్రదర్శన చేయలేమని అనుకున్నా. కానీ మళ్లీ భారీ స్కోరు బాదేశాం. ఇలాంటి మ్యాచుల్లో ఓవర్‌కు 7-8 పరుగులు ఇస్తే ఆటపై ప్రభావం చూపొచ్చు. నాలుగు విజయాలు రావడం సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. నిన్నటి మ్యాచులో కమిన్స్ 3 వికెట్లు తీశారు.

News April 16, 2024

సీతారాముల కళ్యాణానికి సీఎం, మంత్రులు దూరం

image

TG: రేపు భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి సీఎం రేవంత్, మంత్రులు దూరమవుతున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి, అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మరోవైపు ఈ వేడుకలను ప్రభుత్వం తరఫున లైవ్ ఇచ్చేందుకు అనుమతి లేకపోవడంతో.. పర్మిషన్ కోసం ఈసీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. ఆలయ సమీపంలో లడ్డూ ప్రసాదం, తలంబ్రాల పంపిణీకి 60 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

News April 16, 2024

మందు తాగి, కారు నడిపి.. బీభత్సం సృష్టించాడు

image

HYDలో ఫుల్లుగా మద్యం తాగి ఓ యువకుడు కారు నడపడంతో జరిగిన 6 ప్రమాదాల్లో.. ఒకరు చనిపోగా, 9 మంది గాయపడ్డారు. తొలుత IKEA వద్ద కారును ఢీకొట్టడంతో మహిళకు, పారిపోతూ గచ్చిబౌలిలో బైకును ఢీకొనగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఒకరి కాలు విరిగింది. మరో యువకుడు గాయపడి మరణించాడు. అలానే వెళ్తూ బైకును, ఆటోను ఢీకొట్టడంతో ఐదుగురు గాయపడ్డారు. నిందితుడిని స్థానికులు పోలీసులకు పట్టించగా.. డ్రంకెన్ టెస్టులో రీడింగ్ 550 వచ్చింది.

News April 16, 2024

ఆర్సీబీకి నావల్లే దురదృష్టం: స్టైరిస్

image

ఆర్సీబీ వరుస ఓటములపై మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆర్సీబీ జెర్సీ ధరించడం వల్లే ఆ జట్టుకు అదృష్టం కలిసిరావట్లేదేమోనని అభిప్రాయపడ్డారు. ఆర్సీబీకి అనధికారిక దురదృష్టం తానేనని చెప్పారు. అంతకుముందు డివిలియర్స్‌తో <<12925532>>పందెం<<>>లో ఓడిపోవడంతో స్టైరిస్ ఆర్సీబీ జెర్సీ ధరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన జెర్సీ ధరించిన ఐదు మ్యాచులు RCB ఓటమి పాలవ్వడం గమనార్హం.

News April 16, 2024

రూ.2లక్షల రుణమాఫీ.. మంత్రి కీలక విజ్ఞప్తి

image

TG: రూ.2లక్షల రైతు రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తామని.. అప్పటివరకు రైతులను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకులను కోరారు. CM, డిప్యూటీ CM, అధికారులతో చర్చించి రుణమాఫీ చేస్తామన్నారు. అటు రైతుభరోసా సాయం కోసం ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించి, సొమ్ము అందిస్తామన్నారు. ఇక వానాకాలం సీజన్‌కు సంబంధించి పంటలకు అవసరమైన విత్తన సరఫరాలో లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.