India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఈ ఏడాది యాసంగి, వానాకాలం సీజన్లలో రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది. కేంద్రం నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీస మద్దతు ధర, రూ.500 బోనస్ను చెల్లించాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి కోరారు. రైతుల నుంచి వెంటనే వరిధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు.
IPLలో బలమైన జట్లు అనగానే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ ముందుగా గుర్తొస్తాయి. ఈ జట్లపై గెలవాలంటే మిగతా జట్లు శక్తికి మించిన ప్రయత్నం చేయాల్సిందే. అలాంటి టీమ్లను SRH ఈ సీజన్లో మట్టికరిపించింది. హోంగ్రౌండ్లో CSK, MIని.. బెంగళూరులో ఆర్సీబీని చిత్తు చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న SRH.. మిగతా మ్యాచుల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తమిళ నటుడు ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్యకు చెన్నై ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. విడాకుల కోసం వీరు దరఖాస్తు చేసుకోగా.. అక్టోబర్ 7న కోర్టులో హాజరవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ధనుష్, ఐశ్వర్యకు 2004లో వివాహమవ్వగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న వీరు గత కొంత కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు.
TG: గత నెలలో వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 15,246 మంది రైతులకు చెందిన 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని నిర్ధారించింది. ఎకరానికి ₹10వేల చొప్పున రూ.15.81 కోట్లు చెల్లించనుంది. EC అనుమతితో ఇవాళ/రేపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
AP: విశాఖ గాజువాకలో ఆదివారం జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబుపై రాళ్ల దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరారు. ఈ ఘటనపై విచారించాలని వారు విశాఖ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విశాఖ సౌత్ ఏసీపీ త్రినాథ్ వెల్లడించారు.
TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ కోరుతూ ఆమె తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు సీబీఐ కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సాధారణ బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిన్న కోర్టు కవితకు ఈ నెల 23 వరకు జుడీషియల్ కస్టడీ పొడిగించింది.
1978లో శ్మశానం నుంచి చార్లీ చాప్లిన్ శవపేటికను ఇద్దరు దొంగలు తవ్వి ఎత్తుకెళ్లారట. ఆ శవ పేటిక ఇవ్వాలంటే 4 లక్షల పౌండ్లు (సుమారు 24 లక్షల డాలర్లు) చెల్లించాలని, డబ్బు ఇవ్వకపోతే పిల్లలకు హాని చేస్తామని చాప్లిన్ నాలుగో భార్య ఊనాను బెదిరించారు. ఆ విషయాన్ని ఆమె రివీల్ చేయకపోయినా.. బయటికి లీకైంది. 5వారాలకు కిడ్నాపర్లను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయం ఇకపై ఉండదనే ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం అందులో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. విధుల్లో ఉన్న ఉద్యోగులు సంబంధిత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపింది. మరోవైపు ఇప్పటికే తొలి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పూర్తయింది.
ప్రధాని మోదీపై ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. మైసూర్ ప్రచారంలో కాంగ్రెస్ను విచ్ఛిన్న ముఠాల సుల్తాన్ అని మోదీ విమర్శించడంపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయోధ్య రామాలయ ప్రారంభాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బహిష్కరించాయని, హిందూ మతంలోని బలాన్ని విచ్ఛిన్నం చేయాలని ఇండియా కూటమి కోరుకుంటోందని మోదీ ఆరోపించారని ఈసీకి రాసిన లేఖలో వివరించింది. ప్రధానిపై క్రిమినల్ కేసు పెట్టాలని కోరింది.
నిన్నటి మ్యాచులో SRH, ఆర్సీబీ జట్లు భారీ స్కోర్లు చేయడంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘సన్ రైజర్స్, ఆర్సీబీ పవర్ హిట్టింగ్తో అద్భుతమైన ప్రదర్శన చేశాయి. 40 ఓవర్లలో ఇరు జట్లు 549 పరుగులు సాధించాయి. ఇలా చేస్తే బౌలర్ అవ్వాలని ఎవరు అనుకుంటారు?’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.