India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టాలీవుడ్ నటి అపూర్వ శ్రీనివాసన్ రహస్యంగా వివాహం చేసుకున్నారు. తన ప్రియుడు శివకుమార్తో కలిసి ఏడడుగులు వేసినట్లు ఇన్స్టా పోస్ట్ ద్వారా వెల్లడించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులే ఈ వేడుకకు హాజరయ్యారు. కాగా ఈమె టెంపర్ సినిమాలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తొలిప్రేమ, ప్రేమకథా చిత్రమ్2, తదితర చిత్రాల్లో నటించారు.
మతాంతర వివాహం చేసుకోవడం వల్ల సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నానని హీరోయిన్ ప్రియమణి తెలిపారు. దీనివల్ల తనతోపాటు పేరెంట్స్ కూడా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ‘మైదాన్’ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ‘ట్రోల్స్ విషయంలో భర్త నాకు అండగా నిలబడ్డాడు. ఏం జరిగినా చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. అలాంటి వ్యక్తి భర్తగా దొరకడం నా అదృష్టం’ అని పేర్కొన్నారు. ప్రియమణి 2017లో ముస్తఫా రాజ్ను వివాహమాడారు.
ఇవాళ SRHతో మ్యాచులో ఆర్సీబీ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న, అత్యల్ప స్కోర్ చేసిన టీంగా నిలిచింది. ఈరోజు SRH 287 రన్స్ చేయగా, ఇదే అత్యధిక స్కోర్. ఇక 2017లో KKRపై ఆర్సీబీ 49 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ హిస్టరీలో అత్యల్ప స్కోర్ ఇదే. దీంతో రెండు చెత్త రికార్డులు ఆర్సీబీ పేరుపై నమోదయ్యాయి.
దేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ 400 సీట్ల నినాదం చేస్తోందని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. అదే జరిగితే రిజర్వేషన్లతోపాటు ప్రజల ఓటు హక్కునూ లాగేసుకుంటారని చెప్పారు. ఐటీ, ఈడీ, సీబీఐ సంస్థలతో కార్పొరేట్లను బెదిరించి ఎన్నికల బాండ్ల రూపంలో కమలం పార్టీ రూ.వందల కోట్లు దోచుకుందని ఆరోపించారు. పదేళ్లలో దేశవ్యాప్తంగా లక్ష మంది రైతులు చనిపోతే కేంద్రం సాయం చేయలేదని మండిపడ్డారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ‘జైలులో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, BRSను మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారు. BRS ఓట్లన్నీ బీజేపీకి మళ్లించాలని కేసీఆర్ చెప్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో BRS నేతలు ప్రచారమే చేయట్లేదు’ అని వ్యాఖ్యానించారు.
TG: పంట రుణాల మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి రూ.2,00,000 రుణమాఫీ చేస్తానని స్పష్టం చేశారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తానని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున రుణాలు మాఫీ చేయలేదని తెలిపారు. ఇక వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్నారు. నారాయణపేట జనజాతర సభలో రేవంత్ ఈ ప్రకటనలు చేశారు.
IPL: ఈ ఏడాది ఇప్పటివరకు 6 మ్యాచుల్లో ఒకసారి మాత్రమే గెలిచిన ఆర్సీబీ.. ఇవాళ పలు మార్పులు చేసింది. మ్యాక్సీ, సిరాజ్లను పక్కనబెట్టింది. అత్యంత ఖరీదైన ప్లేయర్లు కామెరూన్ గ్రీన్ (రూ.17.5 కోట్లు), అల్జరీ జోసెఫ్ (రూ.11.5 కోట్లు), మ్యాక్స్ వెల్ (రూ.11 కోట్లు), సిరాజ్ (రూ.7 కోట్లు) తుది జట్టులో లేరు.
‘వార్2’ చిత్రంతో జూ.ఎన్టీఆర్ బాలీవుడ్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసింది. సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే ఆయన ముంబై వెళ్లారు. కాగా అక్కడ జిమ్లో తారక్తో కలిసి దిగిన ఫొటోను నటి ఊర్వశీ రౌతేలా పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది. అందులో ఫొటోకు ఫిల్టర్ వాడినట్లు స్పష్టంగా తెలుస్తుండటంతో ఎడిట్ చేశారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో చైనా ఫోన్ వాడి ఫొటో తీసినందుకు సారీ అని ఊర్వశీ రిప్లై ఇచ్చారు.
TG: దొరలకు, పెత్తందారులకు కాకుండా బీసీలు, సామాన్యులకు కాంగ్రెస్ MP టికెట్లు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘రాష్ట్రంలో 10% జనాభా ఉన్న ముదిరాజ్లకు KCR ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. వారిని బీసీ-D నుంచి బీసీ-A గ్రూప్లోకి మార్చేందుకు ప్రయత్నిస్తాం. మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడుతాం. 15 MP సీట్లను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తా’ అని ప్రకటించారు.
AP: జనసేనకు గాజు గ్లాసు సింబల్ కేటాయింపుపై రేపు హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్లాసు గుర్తు కోసం తాము తొలుత దరఖాస్తు చేసుకుంటే ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు ఇచ్చిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే విచారణ చేసిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తమకే ఆ సింబల్ దక్కుతుందని జనసేన ధీమాగా ఉంది.
Sorry, no posts matched your criteria.