India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మళ్లీ ‘RC16’ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. ఈ నెల 27న హైదరాబాద్లో ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్లో ఆయన పాల్గొంటారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా, హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 25% షూటింగ్ పూర్తి చేసుకున్న ‘RC16’ను వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ కెప్టెన్ గంగూలీ అండగా నిలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలు కాగానే డిఫరెంట్ రోహిత్ను చూడబోతున్నామని చెప్పారు. హిట్మ్యాన్ వైట్బాట్ క్రికెట్ అద్భుతంగా ఆడతారని ప్రశంసించారు. CT-2025 ఫిబ్రవరి 19న మొదలు కానుండగా భారత్ తన తొలి మ్యాచ్ 20న బంగ్లాదేశ్తో, 23న పాక్ జట్టుతో ఆడనుంది.

R.G.Kar ట్రైనీ డాక్టర్ రేప్ కేసులో దోషి సంజయ్ రాయ్కు జీవితఖైదు విధించటం పట్ల బెంగాల్ CM మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసు ‘అత్యంత అరుదు’ కాదన్న కోర్టు తీర్పు షాక్కు గురి చేసిందని చెప్పారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పార్టీ మెుదటి నుంచి దోషికి మరణశిక్ష విధించాలనే డిమాండ్ చేస్తుందని చెప్పారు. ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు మమత ట్వీట్ చేశారు.

మన దేశం నుంచి ఎంత సంపద బ్రిటిషర్లకు చేరిందో తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. 1765 నుంచి 1900 సం. మధ్యలో 64.2 ట్రిలియన్ డాలర్లు భారత్ నుంచి ఆ దేశానికి వెళ్లాయని Oxfam గ్రూప్ తెలిపింది. ఇందులో సగం అంటే 33.8 ట్రి.డా. 10% ధనవంతులే దోచుకున్నారని పేర్కొంది. ఈ డబ్బును లండన్ నగరమంతా 50 పౌండ్ల నోట్లతో పరిచినా ఇంకా 4 రెట్ల కరెన్సీ మిగిలి ఉంటుందని వివరించింది. 1 ట్రిలియన్ డాలర్ అంటే లక్ష కోట్లతో సమానం.

గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ప్రోటీన్, ఫైబర్, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి. పండ్లు, ఆకుకూర సలాడ్లలో గుమ్మడికాయ గింజలను కలిపి తింటే ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. అలాగే జీర్ణక్రియ మెరుగవ్వడానికీ ఉపయోగపడతాయి. వీటిని రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే చర్మం నిగనిగలాడుతుందని వైద్యులు చెబుతున్నారు.

AP: లోకేశ్ భవిష్యత్తులో సీఎం అవుతారని మంత్రి భరత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘దావోస్ వెళ్లి ఏం సాధిస్తారో కానీ.. లోకేశ్ ముఖ్యమంత్రి కావాలని వెల్లడించారు’ అని ట్వీట్ చేశారు. భరత్ వ్యాఖ్యలపై CM చంద్రబాబు సీరియస్ అయిన విషయం తెలిసిందే. లోకేశ్ను Dy.CM చేయాలన్న పలువురి నేతల వ్యాఖ్యలపై స్పందించిన అధిష్ఠానం వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని ఇప్పటికే ఆదేశించింది.

చాలా మందికి ఈ రెండింటి మధ్య తేడా తెలియదు. కార్డియాక్ అరెస్ట్ వస్తే గుండె రక్తాన్ని పంప్ చేయడం ఆపుతుంది. అప్పుడు CPR చేయాలి. మెదడుకు రక్తాన్ని పంప్ చేయకపోవడంతో వ్యక్తి స్పృహ కోల్పోతాడు. హార్ట్ఎటాక్ వచ్చినప్పుడు గుండెకి రక్తం సరఫరా చేసే ధమనులు బ్లాక్ అవుతాయి. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఆ రోగికి యాంజియోప్లాస్టీ చేయాలి. చికిత్స చేయకపోతే అది కార్డియాక్ అరెస్ట్కు దారి తీస్తుంది.

1924: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ మరణం
1950: ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణం
1952: సినీనటుడు ప్రదీప్ రావత్ జననం
1986: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్(ఫొటోలో) జననం
2011: తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరణం
1972: త్రిపుర, మణిపుర్, మేఘాలయ రాష్ట్రాల ఆవిర్భావం

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30న రైల్వేస్తో జరిగే మ్యాచ్కు తాను అందుబాటులో ఉంటానని ఢిల్లీ&డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(DDCA) ప్రెసిడెంట్ రోహన్ జైట్లీకి విరాట్ సమాచారం ఇచ్చినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. 2012లో కోహ్లీ చివరిసారి రంజీ మ్యాచ్ ఆడారు. అటు CT-2025 ముందు రోహిత్, రాహుల్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.