News April 15, 2024

దాడి చేసే ముందు హెచ్చరించాం: ఇరాన్

image

ఇజ్రాయెల్‌పై దాడి చేసే ముందు తాము హెచ్చరించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి హొసేన్ తాజాగా అమెరికాకు తెలిపారు. ఇరుగుపొరుగు దేశాలతో పాటు అమెరికాకు కూడా 72 గంటల ముందే నోటీసులు ఇచ్చామన్నారు. తమ ఎంబసీపై దాడికి ప్రతీకారంగా మాత్రమే దాడి ఉంటుందని, ఆ పరిధి దాటమని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే అమెరికా ఈ ప్రకటనను ఖండించింది. ఇరాన్‌తో టచ్‌లోనే ఉన్నప్పటికీ వారు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేసింది.

News April 15, 2024

మీ బిడ్డ అదరడు.. బెదరడు: సీఎం జగన్

image

AP: పేదల భవిష్యత్తు, పథకాల కొనసాగింపు కోసం వైసీపీని గెలిపించాలని సీఎం జగన్ కోరారు. గుడివాడ సభలో మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వానికి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు. ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు కుట్రదారులు చుట్టుముట్టారు. కుటిల పద్మవ్యూహంలో నాపై వీరంతా దాడి చేస్తున్నారు. ఈ తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు.. బెదరడు. కృష్ణుడనే ప్రజలు నాకు అండగా ఉన్నారు. మన విజయం తథ్యం’ అని చెప్పుకొచ్చారు.

News April 15, 2024

ప్రాణం పోయినా మాట తప్పకూడదు: పీఎం మోదీ

image

నేతలు ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పకూడదని ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘నేటి రాజకీయ నేతల విశ్వసనీయత ప్రశ్నార్థకం అవుతోంది. మన సంస్కృతిలోని ‘ప్రాణం పోయినా మాట తప్పకూడదు’ అన్న నీతిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేతలు వారు ఇచ్చిన హామీ పట్ల బాధ్యత తీసుకోవాలి. నిలబెట్టుకోవాలి. మేం మాటిస్తే పాటిస్తాం. 370వ అధికరణ రద్దే మా నిబద్ధతకు నిదర్శనం’ అని మోదీ స్పష్టం చేశారు.

News April 15, 2024

పేదల బాగు కోసమే నా తపన: చంద్రబాబు

image

AP: జగన్ వచ్చాక SCలు, STలకు అన్యాయం జరిగిందని చంద్రబాబు విమర్శించారు. రాజాం సభలో మాట్లాడుతూ.. ‘YCP నేతలు నాపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. ఇప్పుడు రాళ్ల దాడి కూడా చేస్తున్నారు. రాజకీయాల్లో లేని నా భార్య భువనేశ్వరిని అనేక మాటలన్నారు. నేను అరెస్టయ్యాననే బెంగతో 203 మంది ప్రాణాలు వదిలారు. ఆ కార్యకర్తల కుటుంబసభ్యులకు ఆమె ధైర్యం చెప్పారు. ఎన్ని జరిగినా పేదల బాగు కోసమే నా తపన’ అని పేర్కొన్నారు.

News April 15, 2024

BCCI కీలక నిర్ణయం?

image

IPL మ్యాచ్‌లు జోరుగా సాగుతుండగా BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ల సమయంలో కామెంటేటర్లు వీడియోలు లేదా ఫొటోలను షేర్ చేయకుండా ఆంక్షలు విధించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఫాలోవర్లను పెంచుకోవడానికి మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫొటోలను పోస్ట్ చేస్తున్నారని BCCI అభిప్రాయపడినట్లు సమాచారం. ఇకపై ప్లేయర్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, కామెంటేటర్ల సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచనున్నట్లు తెలుస్తోంది.

News April 15, 2024

నేనుంటే 2020లోనే భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయ్యేది: చంద్రబాబు

image

AP: సలహాదారుల పేరుతో YCP ప్రభుత్వం ప్రజా ధనం వృథా చేస్తోందని TDP చీఫ్ చంద్రబాబు విమర్శించారు. ఆ డబ్బులతో ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చన్నారు. రాజాం సభలో మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను సీఎం నిర్లక్ష్యం చేశారు. నేనుంటే 2020లోనే భోగాపురం విమానాశ్రయం పూర్తయ్యేది. మేం సేకరించిన భూముల యజమానుల మధ్య వైసీపీ నేతలు గొడవ పెట్టారు. గిరిజన వర్సిటీ విషయంలోనూ ఇలాగే చేశారు’ అని ఫైరయ్యారు.

News April 15, 2024

బంగారం ధరలు తగ్గాలంటే రాహుల్ PM కావాలి: జగ్గారెడ్డి

image

TG: రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తే బంగారం ధరలను నియంత్రిస్తారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. మోదీ హయాంలో పెట్రోల్, డీజిల్‌తో పాటు పసిడి ధరలూ పెరుగుతున్నాయని విమర్శించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2014లో తులం బంగారం రేటు రూ.28వేలుగా ఉందని, మోదీ వచ్చాక ఇప్పుడు రూ.75 వేలకు చేరుకుందన్నారు. రాముడిని, హనుమంతుడిని కూడా బీజేపీ నాయకులుగా మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News April 15, 2024

విశాఖలో వైసీపీ నేతలు భూకబ్జాలు చేశారు: చంద్రబాబు

image

AP: తాము విశాఖను వాణిజ్య రాజధాని చేస్తే.. వైసీపీ నేతలు గంజాయి, డ్రగ్స్ క్యాపిటల్‌గా చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ‘సీఎం జగన్‌కు వైజాగ్‌పై ప్రేమ లేదు.. ఆయనకు ఆస్తుల మీదే ప్రేమ ఉంది. ఈ ప్రాంతంలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం చేస్తున్నారు. నేను విశాఖకు అదానీ డేటా సెంటర్, లులు, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్‌ తెస్తే వైసీపీ నేతలు తరిమేశారు. వాళ్లు భూకబ్జాలు చేశారు’ అని ఆరోపించారు.

News April 15, 2024

ఎల్లుండి వైన్ షాపులు బంద్

image

TG: శ్రీరామనవమి సందర్భంగా జంటనగరాల్లో వైన్ షాప్స్ మూసివేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ఈ నెల 17న ఉ.6 గంటల నుంచి 18వ తేదీ ఉ.6 వరకు వైన్, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లలోని బార్లు బంద్ చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

News April 15, 2024

రాయి డ్రామా ఫెయిలైంది.. ఎవరైనా బలికావొచ్చు: చింతమనేని

image

AP: వైఎస్ జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సజ్జల డైరెక్షన్‌లో జగన్ నటిస్తున్నారు. గత ఎన్నికల్లో గొడ్డలిపోటుతో సానుభూతి పెంచుకున్నారు. ఈసారి గులకరాయి డ్రామా ఫెయిలైంది. ఇప్పుడు ఎవరైనా బలికావొచ్చు. ముందుజాగ్రత్తతోనే విజయమ్మ అమెరికా వెళ్లారని ప్రజలు అనుకుంటున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా జైలు నుంచి బయటకు రానంటున్నారు’ అని పేర్కొన్నారు.