India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని అధికారులను Dy.CM పవన్ ఆదేశించారు. పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త గైడ్లైన్స్ను రూపొందించాలన్నారు. క్లస్టర్ గ్రేడ్ల విభజనకు ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ నివేదిక ప్రకారం పంచాయతీ, సచివాలయ సిబ్బందిని కేటాయించాలన్నారు.

సంభల్ అల్లర్లలో పాక్ కుట్రకోణంపై డౌట్ వస్తోంది. తుపాకీతో కాల్పులు జరిపిన ముల్లా అఫ్రోజ్కు దావూద్ ఇబ్రహీం గ్యాంగుతో సంబంధాలు బయటపడటమే ఇందుకు కారణం. లగ్జరీ కార్ల చోరీ మాస్టర్ మైండ్ షారిక్ షాటా తరఫునే తానీ పనిచేసినట్టు అఫ్రోజ్ అంగీకరించాడు. అతడు కాల్చిన .32 పిస్టల్ బుల్లెట్లు పాక్లో తయారైనవే. షారిక్కు ISI, D గ్యాంగుతో లింక్ ఉన్నట్టు తెలిసింది. ఇక సంభల్ కేసులో 70 మందిని అరెస్టు చేయడం తెలిసిందే.

ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసు తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి అనిర్బన్ దాస్ పరిహారంపై సైతం ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి బెంగాల్ ప్రభుత్వం రూ.17 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. అత్యంత అరుదైన ఈ కేసులో ఉరి శిక్ష విధించాలని CBI లాయర్ వాదించారు. కానీ దీన్ని అత్యంత అరుదైన కేసుగా పరిగణించలేమని జడ్జి తెలిపారు. అటు తమకు పరిహారం అవసరం లేదని అభయ తండ్రి ప్రకటించారు.

దేశంలో సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. BNS 64, 66, 103/1 ప్రకారం ఖైదుతో పాటు, ₹50 వేల జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. 2024 AUG 9న RG Kar మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి ఉరే సరైన నిర్ణయమని డిమాండ్లు వచ్చాయి.

ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్గా రిషభ్ పంత్ను నియమించింది. వచ్చే సీజన్ నుంచి పంత్ తమ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తారని ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా ప్రకటించారు. వేలంలో పంత్ను LSG రూ.27కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ వికెట్ కీపర్-బ్యాటర్ ఆ జట్టుకు తొలి ట్రోఫీని అందిస్తారేమో వేచి చూడాలి.

కలకత్తా హత్యాచార ఘటన తీర్పు కాసేపట్లో వెల్లడికానుంది. తీర్పును చదివేందుకు జడ్జి అనిర్బన్ దాస్ కొద్ది క్షణాల క్రితమే కోర్టు హాలులోకి వచ్చారు. ఈ కేసులో తీర్పు కోసం దేశమంతా ఎదురుచూస్తోంది.

కాసేపట్లో కలకత్తా హత్యాచార ఘటనలో దోషి సంజయ్కు శిక్ష ఖరారు కానుంది. దీంతో తీర్పు వెల్లడించే సీల్దా కోర్టు వద్దకు RG Kar మెడికల్ కాలేజ్ విద్యార్థులు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు భారీగా చేరుకుంటున్నారు. దోషికి గరిష్ఠ శిక్ష విధించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. అటు కేసు తీవ్రత దృష్ట్యా కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. న్యాయమూర్తి అనిర్బన్ దాస్కూ భద్రత కేటాయించారు.

కన్నడ బిగ్ బాస్ షోకు 11 ఏళ్లుగా హోస్ట్గా వ్యవహరిస్తున్న కిచ్చా సుదీప్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. హోస్ట్గా తన జర్నీని ఎంజాయ్ చేశానని చెప్పారు. ‘నా శ్రమకు తగ్గ గుర్తింపు రాలేదు అన్పించింది. ఇతర భాషల్లో వచ్చినట్లుగా కన్నడ బిగ్ బాస్కు క్రేజ్ రాలేదు. అందుకే ఇక సినిమాలకే టైమ్ను కేటాయించాలనుకుంటున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

తాను ట్రైనీ డాక్టర్ను హత్యాచారం చేయలేదని సంజయ్ రాయ్ ఇవాళ కూడా వాదించాడు. తనను ఓ IPS ఈ కేసులో ఇరికించారని శిక్ష ఖరారుపై వాదనల్లో ఆరోపించాడు. ‘నేను ఈ తప్పూ చేయలేదు. నాపై కుట్ర జరిగింది. నేను నేరం చేసి ఉంటే రుద్రాక్షమాల తెగిపోయేది. అలా జరగలేదంటే మీరే అర్థం చేసుకోండి’ అని వాదించాడు. అటు ఉరి శిక్ష కాకుండా మరో శిక్ష ఎందుకు విధించకూడదో చెప్పాలని సంజయ్ తరఫున కోర్టు నియమించిన లాయర్ CBIని ప్రశ్నించారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఖరారైనట్లు తెలుస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలకు కూడా ఈయనే మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. కాగా, ‘నా ప్లేస్కు తిరిగి వచ్చాను’ అంటూ హర్షవర్ధన్ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేయడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.