News April 15, 2024

కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే

image

TG: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2018లో BRS నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2023 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. కాషాయం పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.

News April 15, 2024

పాండ్యపై ఫ్యాన్స్ మండిపాటు

image

ఇప్పటికే కెప్టెన్సీ మార్పుతో పాండ్యపై MI ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచ్‌ అనంతరం అది మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. పాండ్య బౌలింగ్‌లో 3ఓవర్లలోనే 43 పరుగులు సమర్పించుకున్నారు. అందులో చివరి ఓవర్లో ధోనీ కొట్టిన 3సిక్సులు కూడా ఉన్నాయి. ఇక భారీ స్కోరు ఛేజింగ్‌లో 6బంతులాడి కేవలం 2 పరుగులు చేశారు. కెప్టెన్సీపరంగానూ పలు తప్పులు చేశారు. ఇదే ఫ్యాన్స్ మండిపాటుకు కారణమవుతోంది.

News April 15, 2024

లంచం తీసుకుంటూ దొరికిన మహిళా ఎస్సై

image

TG: ఆసిఫాబాద్ ఎస్సై రాజ్యలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రాజ్యలక్ష్మి రూ.40వేలు డిమాండ్ చేశారు. అందులో భాగంగా బాధితుడి నుంచి రూ.25వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. మరోవైపు నల్గొండ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్, హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కూడా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

News April 15, 2024

దేశానికి ఒకే నాయకుడు.. అదే బీజేపీ ఆలోచన: రాహుల్ గాంధీ

image

దేశంలో ఒకే నాయకుడు ఉండాలనే ఆలోచనను BJP అమలు చేస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది ప్రజలను అవమానించడమేనన్నారు. వయనాడ్‌ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ‘భారతదేశం పూలగుత్తి వంటిది. అందులోని ప్రతి పుష్పాన్నీ గౌరవించాలి. అప్పుడే అందం పెరుగుతుంది’ అని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాలు, భాష, మతం, సంస్కృతిని ప్రేమించాలని కాంగ్రెస్ కోరుకుంటే.. బీజేపీ విరుద్ధంగా పనిచేస్తోందని మండిపడ్డారు.

News April 15, 2024

బీజేపీ రాజకీయ ప్రస్థానం సాగిందిలా..

image

1984 ఎన్నికలు: 2 ఎంపీ సీట్లు గెలుపు(7.74శాతం ఓట్లు)
1989: 85 సీట్లు(11.36శాతం ఓట్లు), 1991: 120 సీట్లు(20.11శాతం ఓట్లు)
1996: 161 సీట్లు(20.29%), 1998:182 సీట్లు (25.59%)
1999: 182 సీట్లు(23.75%), 2004: 138 సీట్లు(22.16%)
2009:116 సీట్లు(18.80%), 2014: 282(31.34%)
2019: 303(37.7%), 2024…?
<<-se>>#ELECTIONS2024<<>>

News April 15, 2024

1951 నుంచి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రస్థానం..

image

1951: 364 ఎంపీ సీట్లలో గెలుపు(44.99 ఓట్ల శాతం), 1957: 371 సీట్లు(44.78శాతం), 1962:361(44.72%), 1967: 283 సీట్లు (40.78శాతం), 1971:352(43.68 %), 1977: 154(34.52%), 1980:353(42.69%), 1984: 404(49.10%), 1989:197 సీట్లు, 1991: 232 సీట్లు,1996:140 సీట్లు, 1998: 141(25.82%), 1999: 114, 2004: 145, 2009:206(28.55%), 2014:44(19.52%), 2019: 52సీట్లు (19.67శాతం).. 2024..?
<<-se>>#ELECTIONS2024<<>>

News April 15, 2024

రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ శంకర్ కూతురు

image

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం చెన్నైలో వైభవంగా జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్‌ తరుణ్ కార్తికేయన్‌ను ఆమె వివాహమాడారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఐశ్వర్య శంకర్ 2021లో క్రికెటర్ రోహిత్ దామోదరన్‌ను వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల్లోనే వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.

News April 15, 2024

అంతరిక్షం నుంచి వచ్చినా నన్ను ఓడించలేరు: కొడాలి నాని

image

AP: గుడివాడతో సంబంధం లేని వ్యక్తిని తనపై పోటీకి నిలబెట్టారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ‘ఓటుకు రూ.5వేలు ఇస్తే ప్రజలు ఓటేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. గుడివాడలో మాకు ఓటు బ్యాంకు ఉంది. మమ్మల్ని ఎవరూ ఏం పీకలేరు. నా గెలుపు కోసం వేల మంది పనిచేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చినా, అంతరిక్షం నుంచి వచ్చినా నన్ను ఓడించలేరు’ అని నాని ధీమా వ్యక్తం చేశారు.

News April 15, 2024

ఇండిగో సంస్థ నిర్లక్ష్యం.. ప్రయాణికుల ఆగ్రహం

image

అయోధ్య నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానంలో ప్రయాణికులకు తాజాగా భయానక అనుభవం ఎదురైంది. ఫ్లైట్ మరో పావుగంటలో ఢిల్లీ చేరుతుందనగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో దాన్ని చండీగఢ్‌కు మళ్లించారు. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత విమానంలో మరో ఒకట్రెండు నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే ఉందన్న విషయం ప్రయాణికులకు తెలిసింది. దీంతో వారంతా వణికిపోయారు. సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ DGCAకి ఫిర్యాదు చేశారు.

News April 15, 2024

గర్ల్‌ఫ్రెండ్ దొరక్క నిరాశపడ్డాడు.. అందుకే హత్య: సిడ్నీ అటాకర్ తండ్రి

image

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆరుగురిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి <<13044823>>చంపేయడం<<>> సంచలనంగా మారింది. ఈ ఘటనపై నిందితుడు జోయెల్ కౌచీ తండ్రి ఆండ్రూ కౌచీ స్పందించాడు. ‘ఇది చాలా భయంకరం. చనిపోయిన వారిని నేను తీసుకురాలేను. నన్ను క్షమించండి. మీకు అతనొక దుర్మార్గుడు. నాకు మాత్రం మానసిక రోగి. అతడు ఓ గర్ల్‌ఫ్రెండ్ కావాలనుకున్నాడు. అందుకుతగ్గ నైపుణ్యాలు లేకపోవడంతో నిరాశకు గురయ్యాడు. అందుకే దాడి చేశాడు’ అని తెలిపాడు.