News January 20, 2025

రాహుల్ గాంధీకి ఊరట కల్పించిన సుప్రీంకోర్టు

image

పరువునష్టం కేసు ప్రొసీడింగ్స్‌ను నిలిపేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. 2018 నాటి కాంగ్రెస్ ప్లీనరీలో HM అమిత్ షా ‘హత్యకేసులో నిందితుడు’ అని RG ఆరోపించారు. దీంతో ఆయనపై BJP నేత నవీన్ ఝా దావా వేశారు. తన వ్యాఖ్యలు రాజకీయ పరమైనవంటూ 2024 FEBలో రాహుల్ వేసిన క్వాష్ పిటిషన్‌ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టేసింది. కేసుపై మరింత పరిశీలన అవసరమని నేడు సుప్రీంకోర్టు పేర్కొంది.

News January 20, 2025

ప్రముఖ నటుడు గుండెపోటుతో కన్నుమూత

image

ప్రముఖ నటుడు విజయ రంగరాజు కన్నుమూశారు. చెన్నైలో గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే రంగరాజు ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. బాలకృష్ణ నటించిన భైరవద్వీపంతో పాపులర్ అయ్యారు. తర్వాత యజ్ఞం, సీమశాస్త్రి, జాంబిరెడ్డి, ఢమరుకం, శ్లోకం, మగరాయుడు, విశాఖ ఎక్స్‌ప్రెస్, మేడం సహా పలు సినిమాల్లో విజయ రంగరాజు నటించారు.

News January 20, 2025

Paytm Q3 Results: తగ్గిన నష్టం, పడిపోయిన ఆదాయం

image

Q3లో ఫిన్‌టెక్ మేజర్ Paytm నికర నష్టం రూ.219 కోట్ల నుంచి రూ.208 కోట్లకు తగ్గింది. ఆదాయంలో మాత్రం 36% మేర కోతపడింది. గత ఏడాది ఇదే సమయంలోని రూ.2,851 కోట్ల నుంచి రూ.1,828 కోట్లకు పడిపోయింది. GMV, చందాదారుల పెరుగుదలతో QoQ పద్ధతిన రెవెన్యూ 10% ఎగిసింది. నగదు రూ.2,851 కోట్లు పెరిగి రూ.12,850 కోట్లుగా ఉంది. PAYPAYలో వాటా విక్రయమే ఇందుకు కారణం. నేడు ఈ షేర్లు 1.35% ఎగిసి రూ.912 వద్ద ట్రేడవుతున్నాయి.

News January 20, 2025

జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్‌ విచారణ ధర్మాసనం మార్పు

image

AP: వైఎస్ జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్‌ విచారణ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చింది. గతంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఈ కేసులను విచారించగా, 12 ఏళ్లుగా ట్రయల్ అడుగు కూడా ముందుకు కదలలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తరఫు న్యాయవాది వాదించారు. దీంతో జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనానికి ట్రయల్‌ను మార్చింది.

News January 20, 2025

దమ్ముంటే ఐదేళ్ల వైసీపీ పాలనపై విచారణ జరిపించండి: షర్మిల

image

AP: గత 5ఏళ్ల పాలన ఓ విపత్తు అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ‘ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉంది మీరే కదా? భారీ స్థాయిలో అవినీతి జరిగితే ఎందుకు బయటపెట్టలేదు? రాజధాని లేకుండా పాలన సాగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? జగన్ మీరు ఆడించినట్లు ఆడినందుకా? మీకు దమ్ముంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించండి’ అని అమిత్ షాను డిమాండ్ చేశారు.

News January 20, 2025

కాలేజీకి వెళ్లమన్నారని చనిపోయింది

image

TG: మెదక్ జిల్లా పొడ్చన్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కాలేజీకి వెళ్లమన్నందుకు ఇంటర్ విద్యార్థిని సింధూజ(19) ఆత్మహత్య చేసుకుంది. నెల రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. దీంతో నిన్న పేరెంట్స్ కళాశాలకు వెళ్లాలని ఒత్తిడి చేశారు. మనస్తాపానికి గురైన సింధూజ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది.

News January 20, 2025

TODAY GOLD RATES

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.120 పెరిగి రూ.81,230కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.150 పెరిగి రూ.74,500గా నమోదైంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ సిల్వర్ రేట్ రూ.1,04,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 20, 2025

కోర్టుకు సంజయ్ రాయ్.. భారీ బందోబస్తు

image

కోల్‌కతా హత్యాచార కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌ని మరికాసేపట్లో సీల్దా కోర్టులో హాజరుపర్చనున్నారు. అతడిని ఉరి తీయాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంజయ్‌కి కోర్టు ఇవాళ శిక్షను ఖరారు చేయనుంది. అతడికి జీవితఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.

News January 20, 2025

బీఆర్ఎస్ మహా ధర్నాకు అనుమతి నిరాకరణ

image

TG: కేటీఆర్ నాయకత్వంలో నల్గొండలో రేపు బీఆర్ఎస్ నిర్వహించనున్న రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ధర్నా నిర్వహించి తీరుతామని అంటున్నారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఈ ధర్నా చేపట్టనుంది.

News January 20, 2025

‘కన్నప్ప’ నుంచి ‘లార్డ్ శివ’ పోస్టర్ విడుదల

image

మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ తదితరులు నటిస్తున్న ఈ మూవీకి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది.