News January 20, 2025
కాలేజీకి వెళ్లమన్నారని చనిపోయింది

TG: మెదక్ జిల్లా పొడ్చన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కాలేజీకి వెళ్లమన్నందుకు ఇంటర్ విద్యార్థిని సింధూజ(19) ఆత్మహత్య చేసుకుంది. నెల రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. దీంతో నిన్న పేరెంట్స్ కళాశాలకు వెళ్లాలని ఒత్తిడి చేశారు. మనస్తాపానికి గురైన సింధూజ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది.
Similar News
News February 16, 2025
రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్లో కలిశారు. ఇటీవల తాను చేపట్టిన ఫ్రాన్స్, అమెరికా పర్యటనల వివరాలు, అక్కడ చేసుకున్న ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలను ముర్ముకు మోదీ వివరించారు. భారత్-అమెరికా, భారత్-ఫ్రాన్స్ వాణిజ్య సంబంధాల సారాంశాలను ఆమెతో మోదీ పంచుకున్నారు.
News February 16, 2025
IPL.. తొలి మ్యాచ్కు కీలక ప్లేయర్ దూరం!

ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఆడే తొలి మ్యాచ్కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య దూరం కానున్నారు. గత సీజన్లో స్లోఓవర్ రేటు కారణంగా పాండ్యపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. ఆ తర్వాత అతడు తొలి మ్యాచ్ ఆడనుండటంతో చెన్నై సూపర్ కింగ్స్తో మార్చి 23న జరిగే మ్యాచ్కు బరిలోకి దిగరు. దీంతో MI తొలి మ్యాచ్కు ఎవరిని కెప్టెన్గా చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. కెప్టెన్గా ఎవరు ఉండాలో కామెంట్ చేయండి.
News February 16, 2025
ప్రత్తిపాటి పుల్లారావు ఆగడాలు పీక్స్కు చేరాయి: YCP

AP: చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగడాలు పీక్స్కు చేరాయని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి విడదల రజినిపై కోపంతో ఆమె మామపై దాడి చేయించారని ఆరోపించింది. 83 ఏళ్ల వ్యక్తి అని కూడా చూడకుండా తన అనుచరులతో కారు అద్దాలను ధ్వంసం చేయించి హత్యాయత్నం చేశారని ట్వీట్ చేసింది. మరీ ఇంత నీచ రాజకీయాలా చంద్రబాబు? అని ప్రశ్నించింది.