India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐపీఎల్లో ఈరోజు జరిగిన మ్యాచ్లో పంజాబ్పై రాజస్థాన్ గెలిచింది. 148 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ ఛేదనలో చెమటోడ్చింది. ఆఖర్లో హెట్మెయిర్ 10 బంతుల్లో 27 పరుగులతో మెరుపులు మెరిపించడంతో గట్టెక్కింది. ఆర్ఆర్ బ్యాటర్లలో యశస్వి(39) రాణించారు. ఇక పంజాబ్ బౌలర్లలో రబాడ, కరన్ చెరో 2 వికెట్లు, అర్షదీప్, లివింగ్స్టన్, హర్షల్ తలో వికెట్ తీశారు. రాజస్థాన్కు ఇది ఐదో విజయం కావడం విశేషం.
అభిప్రాయ భేదాలతో కంటెంట్ క్రియేటర్ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. గ్రావిట్(25), నందిని(22) హరియాణాలోని బహదూర్గఢ్లో సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ సమయంలో భేదాభిప్రాయాలు రావడంతో మనస్తాపం చెందారు. ఏడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
AP: విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడిని ఆయన చెల్లెలు, APCC చీఫ్ షర్మిల ఖండించారు. ‘ఈ రోజు ఎన్నికల ప్రచారంలో సీఎంపై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు జరిగిందనుకుంటున్నాం. అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సాదిక్ డ్రగ్స్ రవాణాతో రూ. 40 కోట్లకు పైగా సంపాదించారని ఈడీ తాజాగా ఆరోపించింది. ఆ మొత్తాన్ని రియల్ ఎస్టేట్, చిత్ర నిర్మాణంలోకి మళ్లించినట్లు తెలిపింది. రూ. 12 కోట్లు మూవీ ప్రొడక్షన్లో, రూ.21 కోట్లు బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయని పేర్కొంది. సాదిక్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గత నెలలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
భాగస్వామి మంచివాడు కాదనో, హింసిస్తున్నాడనో, ఇతరత్రా కారణాలతో విడాకులు తీసుకోవడం చూస్తుంటాం. కానీ తన మాజీ భర్త, బ్రెజిల్ ఫుట్బాలర్ కాకా.. అతి మంచి వ్యక్తి కావడంతో అతనికి విడాకులిచ్చారట కరోలిన్ సెలికో. ‘కాకా నన్నెప్పుడూ మోసం చేయలేదు. బాగా చూసుకున్నారు. అయినా సంతోషంగా ఉండేదాన్ని కాదు. అతను నా విషయంలో పర్ఫెక్ట్గా ఉండటమే సమస్య’ అని తాజాగా వెల్లడించారు. 2005లో వీరు పెళ్లి చేసుకోగా 2015లో విడిపోయారు.
ఏపీ సీఎం జగన్పై దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త జగన్ అన్న. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితుల్ని శిక్షించాలని సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
AP: విజయవాడలో సీఎం జగన్పై రాయి దాడిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఖండించారు. ‘రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదు. మన ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని పరస్పరం కాపాడుకుందాం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
AP: సీఎం జగన్పై జరిగిన దాడి ప్రజల గుండెకు తగిలిన గాయం అని అంబటి రాంబాబు అన్నారు. పవన్, చంద్రబాబు దీనికి బాధ్యత వహించాలన్నారు. అధికారంలోకి రాలేమని భయంతో టీడీపీ, జనసేన దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గతంలోనూ చంద్రబాబు ఇలా దాడులు చేయించారని అన్నారు. వైసీపీ శ్రేణులు సంయమనం పాటించాలని.. ఈ ఘటనకు టీడీపీ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పారు.
TG: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40KM వేగంగా గాలులు వీస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు.
ఏ రాత్రైనా తాము దాడి చేయొచ్చని, సిద్ధంగా ఉండాలని ఇజ్రాయెల్ను ఇరాన్ తాజాగా హెచ్చరించింది. ‘మేమేం చేస్తామో ఇజ్రాయెల్కు తెలీదు. ఎక్కడ దాడి చేస్తామోనని బిక్కుబిక్కుమంటోంది. నిజమైన యుద్ధం కంటే ఈ మానసిక, రాజకీయ యుద్ధమే వారిని ఎక్కువ భయపడుతోంది’ అని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు రహీం తెలిపారు. సిరియాలో ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడి ఇజ్రాయెల్ చేసిందని ఇరాన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.