India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. రేపటితో వైకుంఠ ద్వార దర్శనం ముగియనుంది. అటు సంక్రాంతి సెలవులు కూడా రేపటితో ముగియనుండటంతో భక్తులు శ్రీనివాసుడి దర్శనం కోసం వస్తున్నట్లు తెలుస్తోంది.

AP: అమిత్ షా రాష్ట్ర పర్యటనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని షర్మిల అన్నారు. ‘అంబేడ్కర్ను అవమానించిన షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసనలు వ్యక్తం చేయాలని పార్టీ నాయకత్వానికి పిలుపునిస్తున్నాం. దేశ ప్రజలకు వెంటనే షా క్షమాపణలు చెప్పి, తక్షణమే రాజీనామా చేయాలి. ఆ దేశ ద్రోహితో వేదికలు పంచుకునే పార్టీలూ దేశద్రోహం చేసినట్లే’ అని ట్వీట్ చేశారు.

‘బందీశ్ బందిట్స్’ హీరోయిన్ శ్రేయా చౌదరీ ఒక దశలో 30 కేజీల బరువు తగ్గినట్లు చెప్పారు. 19 ఏళ్ల వయసులో వెన్నెముక సమస్యలతో విపరీతమైన బరువు పెరిగినట్లు చెప్పారు. అయితే తన ఐడల్ హృతిక్ రోషన్ను స్ఫూర్తిగా తీసుకుని ఫిట్నెస్ జర్నీని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దీంతో శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా మారినట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని SMలో పోస్ట్ చేయగా అభిమానులు మద్దతుగా నిలిచారని చెప్పారు.

ENGలో జరిగే కౌంటీ ఛాంపియన్ షిప్లో విరాట్ కోహ్లీ ఆడాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించారు. ‘కోహ్లీకి రెడ్ బాల్ ప్రాక్టీస్ చాలా అవసరం. జూన్లో ENGతో టెస్టు సిరీస్ ఉంది కాబట్టి ఏప్రిల్ నుంచి జరిగే కౌంటీల్లో అతడు ఆడాలి. పుజారాలా కౌంటీల్లో ఆడితే ప్రాక్టీస్ లభిస్తుంది. ఇంగ్లండ్తో టెస్టుల్లో కోహ్లీ ఆటను సెలక్టర్లు గమనిస్తారు. అతడు సరిగా ఆడకపోతే అది జట్టుకు పెద్ద సమస్యగా మారుతుంది’ అని అన్నారు.

AP: నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని CM చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. ‘బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. స్త్రీలకు సాధికారతనిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో “అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం” అని నిరూపించిన మహనీయులు ఎన్టీఆర్’ అని పేర్కొన్నారు.

చలికాలంలో అల్లం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి, సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం అల్లంతో టీ, సూప్, కషాయం చేసుకుని తాగాలి. దీని వల్ల శరీరం వేడిగా ఉంటుంది. గ్యాస్, జీర్ణ సమస్యలతో బాధపడేవారికి అల్లం మంచి ఔషధంగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వాట్సాప్లో స్టేటస్లకు మ్యూజిక్ యాడ్ చేసుకునే ఫీచర్ వచ్చింది. ఫొటోలకు 15 సెకన్లు, వీడియోలకు వాటి నిడివిని బట్టి మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. కావాల్సిన ఆడియో కోసం సెర్చ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఇన్స్టాగ్రామ్లో ఈ ఫీచర్ ఇప్పటికే ఉన్న సంగతి తెలిసిందే.

AP: ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నేటి నుంచి షురూ కానున్నాయి. ఇప్పటికే జర్మనీ మెషీన్లు వచ్చేశాయి. గరిష్ఠంగా 90 మీ. లోతు వరకు నదీగర్భాన్ని తవ్వి ప్లాస్టిక్ కాంక్రీట్తో గోడ నిర్మిస్తారు. ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ 1396 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందం ఉంటుంది. కింది నుంచి ఒక్క చుక్క నీరు లీక్ కాకుండా కాపాడుతుంది.

TG: మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్ సిలబస్లో మార్పులు చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఫిజిక్స్లో ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్ వంటి అంశాలు చేర్చనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు జువాలజీలో కొవిడ్ పాఠ్యాంశాన్ని చేర్చనున్నట్లు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరంలోని పుస్తకాల్లో ఈ అంశాలను ప్రింట్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. మరోవైపు సిలబస్ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

AP: సీఎం చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వినాయక్ నగర్లో మున్సిపల్ కార్మికుడి ఇంటికి వెళ్తారు. ZPHS వరకూ కాలినడకన ర్యాలీలో పాల్గొంటారు. పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు.
Sorry, no posts matched your criteria.