News April 13, 2024

కాంగ్రెస్ 4 నెలల్లో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లింది: హరీశ్

image

TG: కేసీఆర్ అభివృద్ధి బాట పట్టించిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ 4 నెలల్లోనే వెనక్కి తీసుకెళ్లిందని MLA హరీశ్‌రావు విమర్శించారు. ‘కాంగ్రెస్ ఫేక్ వార్తలను నమ్ముకుని రాజ్యం నడుపుతోంది. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత యువతపై ఉంది. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న BJP ప్రజలకు చేసిందేమీ లేదు. నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసింది. నిరుద్యోగం, పేదరికం పెరిగింది.’ అని అన్నారు.

News April 13, 2024

కైఫ్‌ T20WC టీమ్ ఇదేనట!

image

జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ తన జట్టును ఎంపిక చేశారు. తన టీమ్‌లో రింకూ సింగ్‌ను కాదని రియాన్ పరాగ్‌కు చోటు కల్పించడం గమనార్హం.
కైఫ్ T20WC టీమ్: జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, పంత్, అక్షర్, జడేజా, కుల్దీప్, బుమ్రా, అర్ష్‌దీప్, చాహల్, దూబే, పరాగ్, సిరాజ్
☞ ఈ టీమ్ టైటిల్ గెలుస్తుందని మీరు భావిస్తున్నారా.. కామెంట్ చేయండి

News April 13, 2024

కుక్క మృతి కేసులో హైకోర్టు మెట్లెక్కిన నటి

image

బాలీవుడ్ నటి ఆయేషా జుల్క.. కుక్క విషయంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మూగ జీవాలపై ప్రేమతో ఆమె వీధి కుక్కలను సంరక్షిస్తున్నారు. తన దగ్గర ఉన్న వాటిల్లో రాఖీ అనే కుక్క 2020 సెప్టెంబరులో చనిపోయింది. 2021లో ఛార్జ్‌షీట్ నమోదు చేసిన పోలీసులు కుక్కల కేర్ టేకర్‌ను అరెస్ట్ చేశారు. తర్వాత అతడు బెయిల్‌పై బయటకు రాగా ఆ కేసు ముందుకు సాగలేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటా తాజాగా ఆమె బాంబే హైకోర్టు మెట్లు ఎక్కారు.

News April 13, 2024

ఇంకెంతకాలం కాంగ్రెస్‌ను విమర్శిస్తారు: ప్రియాంక

image

పదేళ్లుగా అధికారంలో ఉన్న BJP ఏం చేసిందని కాంగ్రెస్ నేత ప్రియాంక ప్రశ్నించారు. ‘అధికారంలో ఉన్న BJP అధికారంలో లేని కాంగ్రెస్‌ను ఇంకెంత కాలం విమర్శిస్తుంది? దేశానికి ఏం చేయలేకపోయిన BJP ఇప్పుడు 400 సీట్లు కోరుకుంటోంది. ఎన్నికల కోసం గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తామంటోంది. కానీ ప్రజల నుంచి రూ.1200 వసూలు చేస్తోంది’ అని ఆమె విమర్శించారు.

News April 13, 2024

తొలిదశ ఎలక్షన్స్.. ధనిక అభ్యర్థి ఎవరంటే!

image

ఈ నెల 19న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరగనుంది. ఈ ఫేజ్‌లో పోటీ చేసే అభ్యర్థుల్లో నకుల్‌నాథ్(INC) రూ.717 కోట్ల ఆస్తులతో ధనిక అభ్యర్థిగా నిలిచినట్లు ADR నివేదిక తెలిపింది. ఈయన మధ్యప్రదేశ్ Ex CM కమల్‌నాథ్ కుమారుడు. ఆ తర్వాత TNలోని AIADMK అభ్యర్థి అశోక్(రూ.662 కోట్లు), BJP నేత దేవనాథన్ (రూ.304 కోట్లు) నిలిచారు. పుదుచ్చేరిలో ఇండిపెండెంట్ అభ్యర్థి సతీశ్(25) రూ.2000 కలిగి ఉన్నట్లు ప్రకటించారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 13, 2024

నాలుగు చోట్ల ఎంపీగా గెలుపు!

image

AP: లోక్‌సభ సభ్యునిగా నాలుగు నియోజకవర్గాల నుంచి గెలుపొంది చరిత్రకెక్కారు రాజకీయ ధురంధరుడు గోగినేని రంగనాయకులు(NG రంగా). 1957లో తెనాలి(కాంగ్రెస్), 1962లో చిత్తూరు(ఇండిపెండెంట్), 1967లో శ్రీకాకుళం (ఇండిపెండెంట్), 1980లో గుంటూరు ఎంపీగా కాంగ్రెస్(ఐ) నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1984, 89లోనూ గుంటూరు నుంచి కాంగ్రెస్ తరఫున నెగ్గారు. 1977-80 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 13, 2024

కంగన ప్రత్యర్థిగా విక్రమాదిత్య?

image

నటి కంగన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి BJP ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఆమెపై తన కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ను బరిలోకి దించనున్నట్లు సిట్టింగ్ ఎంపీ ప్రతిభా సింగ్ అన్నారు. విక్రమ్ పేరును అధిష్ఠానానికి సూచించానన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు.

News April 13, 2024

ఇక బతికినంత కాలం సినిమాల్లోనే: చిరంజీవి

image

తనవంటి వారికి రాజకీయాలు పనికిరావని నటుడు చిరంజీవి అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘మరింత మంచి చేయాలని రాజకీయాల్లోకి వెళ్లాను. కానీ నేటి రాజకీయాల్లో నాలాంటివాడు అనర్హుడు అన్నది వాస్తవం. అందుకే వెంటనే వెనక్కి వచ్చేశాను. తిరిగొచ్చాక నా మీద అదే ప్రేమ ఉంటుందా అన్న అనుమానం ఉండేది. ప్రేక్షకులు అదే ప్రేమను ఇస్తున్నారు. ఇకపై బతికినంతకాలం సినిమాల్లోనే’ అని తెలిపారు.

News April 13, 2024

తిరుమల పవిత్రతను వైసీపీ మంటగలిపింది: పవన్ కళ్యాణ్

image

AP: టీటీడీ నిధులను అడ్డగోలుగా వాడుకునే కుట్రలకు వైసీపీ నాయకులు తెరతీశారని, ఈ అంశంపై సమగ్ర సమాచారం తమ వద్ద ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. తిరుమల పవిత్రతను రాష్ట్ర ప్రభుత్వం మంటగలిపిందని విమర్శించారు. తులసి వనం లాంటి తిరుపతిని గంజాయి వనం చేసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. తిరుపతిలో దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని కూటమి నాయకులకు సూచించారు.

News April 13, 2024

ALERT: 3 రోజులే ఛాన్స్

image

కొత్త ఓట్ల నమోదుకు ECI విధించిన గడువు మరో 3 రోజుల్లో ముగియనుంది. ఓటర్ లిస్టులో పేరు లేని 18+ వారంతా ఈనెల 15లోగా ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. <>ఆన్‌లైన్‌లో<<>> లేదా సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల్లో ఫాం-6ను సమర్పించాలని తెలిపారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుందని, కానీ చివరిదాకా ఆగకుండా 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడం మంచిదని చెప్పారు.