India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: సోషల్ మీడియా మోజులో పలువురు అమ్మాయిలు మోసపోతున్నారు. తాజాగా ADBలోని ఓ మెడికల్ కాలేజీ విద్యార్థిని (17)కి ఇన్స్టాగ్రామ్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ (22) పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించడంతో ఆమె ఈ నెల 9న సికింద్రాబాద్ వచ్చింది. బాలికను ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.

మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలని చెప్పే కర్మ సిద్ధాంతానికి ఈ ఘటన నిదర్శనం. ఢిల్లీలో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తికి సాయం చేయకుండా, అతని బైక్ను ఎత్తుకెళ్లిన ముగ్గురికి యాక్సిడెంట్ అయింది. వికాస్ అనే వ్యక్తి బైక్ నుంచి పడిపోగా ఇది చూసిన ఉదయ్, టింకు, పరంబీర్లు అతడి బైక్తో పరారయ్యారు. కొద్దిసేపటికే వీరికి యాక్సిడెంట్ కాగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. కాగా, వికాస్ చనిపోయాడు.

టీమ్ఇండియాకు బ్యాటింగ్ కోచ్గా ఉండేందుకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఇంట్రెస్ట్ చూపారు. పురుషుల జట్టు కోసం బ్యాటింగ్ కోచ్ అన్వేషణలో బీసీసీఐ ఉందని ఓ జర్నలిస్టు చేసిన ట్వీట్కు కెవిన్ రిప్లై ఇచ్చారు. నేను అందుబాటులో ఉన్నా అంటూ ఆయన సమాధానమిచ్చారు. కెవిన్ తన కెరీర్లో 104 టెస్టుల్లో 8181 రన్స్, 136 వన్డేల్లో 4440, 37 టీ20ల్లో 1176 రన్స్ చేశారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 18న ఏపీకి రానున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకొని అదే రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం నివాసంలో విందుకు హాజరవుతారు. అనంతరం విజయవాడ హోటల్లో బస చేస్తారు. 19న ఉదయం కొండపావులూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్తో పాటు NDRF పదో బెటాలియన్ ప్రాంగణాలను ప్రారంభిస్తారు. బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్తారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్లు (గ్రాస్) కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్ ఆఫ్ సంక్రాంతి’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. కాగా, ఈ సినిమా రేపటి నుంచి తమిళంలోనూ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పలు హామీలు ఇచ్చింది. హామీల పోస్టర్లను తెలంగాణ సీఎం రేవంత్ విడుదల చేశారు.
1. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్
2. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
** తెలంగాణలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

AP: తనపై, తన భార్యపై దాడి జరిగిందని తిరుపతి(D) చంద్రగిరి పీఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు వర్సిటీలో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించడం లేదని మనోజ్ ప్రశ్నించగా, శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని ఆయనకు పోలీసులు సూచించారు. నిన్న MBUలోకి వెళ్లేందుకు యత్నించిన ఆయనను పోలీసులు అనుమతించని సంగతి తెలిసిందే.

హైదరాబాద్లోని సైకిల్ ట్రాక్పై పగుళ్లు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు గత BRS సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘కాళేశ్వరం, సుంకిశాల.. ఇప్పుడు సైకిల్ ట్రాక్. కేటీఆర్ కట్టించిన సైకిల్ ట్రాక్ పరిస్థితి ఇది’ అని పగుళ్లు వచ్చిన ఫొటోలను షేర్ చేస్తున్నాయి. ఐటీ కారిడార్లోని నానక్రామ్ గూడ నుంచి ORR ఇంటర్ఛేంజ్ వరకు రెండు వైపులా 23 కి.మీ మేర ఈ ట్రాక్ ఏర్పాటు చేశారు. కి.మీకు రూ.3.91 కోట్ల మేర ఖర్చయింది.

బడ్జెట్లో రైల్వేస్కు 20% ఎక్కువ నిధులు కేటాయిస్తారని సమాచారం. FY25లో కేటాయించిన రూ.2.65లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్లకు పెంచుతారని తెలుస్తోంది. ప్రస్తుత CAPEXలో ఇప్పటికే 80-90% మేర ఖర్చుపెట్టేశారు. FY26లో మరిన్ని రైల్వే స్టేషన్లను అప్గ్రేడ్ చేయడం, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, రైల్వే ట్రాకుల డీకంజెషన్ వంటి పనులు చేపట్టనున్నారు. అందుకే నిధులు పెంచుతారని విశ్లేషకులు అంటున్నారు.

యాక్టర్ సైఫ్ అలీఖాన్ కాస్మొటిక్, న్యూరో సర్జరీలు ముగిశాయి. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని లీలావతీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. ఆపరేషన్లు ముగిశాక అతడి భార్య కరీనా కపూర్ సహా కుటుంబ సభ్యులు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సైఫ్ను దుండగుడు 6 సార్లు <<15167259>>కత్తి<<>>తో పొడిచాడు. దాంతో అతడి మెడవద్ద లోతైన గాయం అయింది.
Sorry, no posts matched your criteria.