India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్లలో దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.77 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈరోజు కూడా బుక్ మై షోలో వేలల్లో టికెట్స్ బుక్ అవడంతో రూ.100 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. మూవీలో వెంకీ కుటుంబం చేసిన కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ను తెగ మెప్పిస్తోంది.

ఒక్కో రోజుకు ఒక్కో స్పెషాల్టీ. ఈరోజు కూడా ఓ స్పెషల్ ఉంది. నేడు అమెరికాలో నేషనల్ నథింగ్ డే. అక్కడి ప్రజలు తమ బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకుని, విశ్రాంతి పొందేందుకు ఒక రోజు అవసరమని కాలమిస్ట్ హెరాల్డ్ పుల్మన్ కాఫిన్ విశ్వసించారు. అందుకే ఈరోజు పనులన్నీ పక్కన పెట్టాలంటారు. ప్రజలు తమకిష్టమైన వారిని, స్నేహితులను ఆలింగనం చేసుకొని విష్ చేసుకోవాలని సూచిస్తుంటారు. 1973 నుంచి దీనిని జరుపుకుంటున్నారు.

సైఫ్ అలీ ఖాన్పై కత్తిపోట్ల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర్ధరాత్రి 2.30 గంటలకు ఈ ఘటన జరగ్గా రా.12.30 గంటల తర్వాత ఎవరూ ఆ ఇంట్లోకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో ఆనవాళ్లు లేవని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీన్నిబట్టి దుండగుడు ప్లాన్ ప్రకారం ముందే ఇంట్లోకి చొరబడి ఉంటాడని భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని మండిపడుతున్నాయి.

అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా విడిపోతున్నారని అక్కడి సోషల్ మీడియా కోడై కూస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి మిషెల్ రావడం లేదని, బరాక్ మాత్రమే వస్తారని వారి ఆఫీస్ అధికారికంగా ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకూ ఆమె హాజరుకాలేదు. భర్తతో కలిసి పబ్లిక్ ఈవెంట్స్కు రాకపోవడంతో వారిద్దరు విడాకులు తీసుకుంటున్నారని వదంతులు వ్యాపించాయి.

AP: కూటమి నేతలు సంప్రదాయం ముసుగులో జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చేశారని YCP ఆరోపించింది. ‘పండుగ రోజుల్లో దగ్గరుండి మరీ ప్రతి ఊరిలో జూదం, కోడి పందేలు నిర్వహించారు. ప్రతి బరి నుంచి భారీగా కమీషన్లు వసూలు చేస్తూ నాయకులు బాగుపడ్డారు. కానీ జూదంలో డబ్బులు పోయిన వాళ్లు ఒట్టి చేతులతో ఇళ్లకు వెళ్తున్నారు. ప్రజలు ఏమైపోతేనేం తాము బాగుపడితే చాలన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఉంది’ అని ట్వీట్ చేసింది.

AP: గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు డీసీసీబీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 50 అసిస్టెంట్ మేనేజర్, 201 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆప్కాబ్ <

భారత్ అద్భుతం చేసింది. స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించిన నాలుగో దేశంగా అవతరించింది. US, రష్యా, చైనా సరసన నిలిచింది. SpaDeX విజయవంతమైనట్టు ISRO ప్రకటించడం తెలిసిందే. స్పేస్లో 2 వేర్వేరు శాటిలైట్లను అనుసంధానంతో సింగిల్ ఆబ్జెక్ట్గా మార్చేసింది. ఛైర్మన్ నారాయణన్, మోదీ, కేంద్ర మంత్రులు ISRO సైంటిస్టులను అభినందించారు. స్పేస్ స్టేషన్, చంద్రయాన్ 4, గగన్యాన్కు ఇది మార్గం సుగమం చేసిందన్నారు.

వాంఖడే స్టేడియానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ 178 మంది గ్రౌండ్ స్టాఫ్కు జంబో గిఫ్ట్ హాంపర్స్ అందజేసింది. ఇందులో 5 కిలోల చొప్పున గోధుమ పిండి, బియ్యం, పప్పు, ఒక మిక్సర్ గ్రైండర్, హైడ్రేషన్ కిట్స్, బ్యాక్ ప్యాక్స్, కిట్ బ్యాగ్, టవల్స్, పెన్స్, నోట్ పాడ్స్, బెడ్ షీట్స్, ట్రాక్ పాంట్స్, జాకెట్స్, సన్ గ్లాసెస్, హాట్స్, రెయిన్ కోట్, అంబ్రెల్లా, సన్ స్క్రీన్ వంటివి ఉన్నాయి.

ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రూ.550 పెరిగి రూ.80,620కి చేరింది. 22క్యారెట్ల పసిడి రూ.500 పెరిగి రూ.73,900 పలుకుతోంది. కేజీ వెండి రూ.100 పెరిగి రూ.1,01,100కు చేరింది.

ప్రతిష్ఠాత్మక SpaDeX ప్రయోగం విజయవంతమైనట్టు ISRO వర్గాలు తెలిపాయి. అంతరిక్షంలో 2 శాటిలైట్లను డాక్ చేసినట్టు వెల్లడించాయి. త్వరలోనే సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందని పేర్కొన్నాయి. DEC 30న PSLV C60 రాకెట్లో SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) శాటిలైట్లను ఇస్రో పంపింది. JAN 12న 3 మీటర్ల దగ్గరకు తీసుకొచ్చి పరిస్థితి అనుకూలంగా లేదని మళ్లీ సురక్షితమైన దూరానికి పంపింది. తాజాగా సక్సెస్ చేసింది.
Sorry, no posts matched your criteria.