News October 17, 2024

పుజారా సేవల్ని భారత్ మిస్ అయింది: కుంబ్లే

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా పూజారా సేవల్ని మిస్ అయిందని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. చుట్టూ వికెట్లు పడుతున్నా పుజారా గౌరవప్రదమైన స్కోరును జట్టుకు అందించేవారని పేర్కొన్నారు. ‘100 మ్యాచులాడిన అలాంటి ఆటగాడి సేవల్ని భారత్ మిస్ అయింది. అతడైతే బంతిని కొట్టేందుకు వెళ్లకుండా బ్యాట్ మీదకు వచ్చేవరకూ వేచి చూసేవారు. విరాట్ 4వ స్థానంలోనే ఆడాల్సింది’ అని పేర్కొన్నారు.

News October 17, 2024

23న క్యాబినెట్ భేటీ

image

తెలంగాణ క్యాబినెట్ ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైడ్రాకు చట్టబద్ధత, అసెంబ్లీ సమావేశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

News October 17, 2024

రేపటి నుంచి తెరుచుకోనున్న డిగ్రీ, పీజీ కాలేజీలు

image

TG: రాష్ట్రంలో డిగ్రీ, PG కాలేజీలు రేపటి నుంచి యథావిధిగా నడిపిస్తామని ప్రైవేట్ కాలేజీ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల విషయంలో అసోసియేషన్ సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వారు బంద్‌ను విరమించారు. ఇదిలా ఉంటే బకాయిలు విడుదల చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని R.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

News October 17, 2024

ప్రభుత్వ విధానాలతో రైతులు, యువకులకు ఇబ్బందులు: కేటీఆర్

image

TG: ప్రభుత్వ విధానాలతో రైతులు, యువకులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. తెలంగాణ భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. పరీక్షలు రాస్తామో లేదోనన్న బాధలో అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. వచ్చే నెల 5న ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తామని చెప్పారని తెలిపారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లు కూల్చివేస్తున్నారన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమే రేవంత్ లక్ష్యమని దుయ్యబట్టారు.

News October 17, 2024

బతుకమ్మ చీరలు ఎందుకివ్వలేదో సమాధానం చెప్పండి: హరీశ్‌రావు

image

TG: గతంలో KCR ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలను ఈ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో సమాధానం చెప్పకుండా మంత్రి సీతక్క పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని BRS MLA హరీశ్‌రావు అన్నారు. మ్యానిఫెస్టో ప్రకారం ఈ ప్రభుత్వం నెలకు రూ.2,500 చొప్పున గడిచిన 10 నెలల్లో ప్రతి మహిళకు రూ.25,000 బాకీ పడిందని అన్నారు. హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది గోరంత, చెప్పుకునేది కొండంత అని ఎద్దేవా చేశారు.

News October 17, 2024

గ్రేట్.. ఇండియన్ రైల్వే నుంచి SpaceX వరకు!

image

అంతరిక్ష రంగంలో అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసే స్పేస్ ఎక్స్ కంపెనీలో ఉద్యోగం పొందడమంటే అంత ఆషామాషీ కాదు. అయితే, ఇండియన్ రైల్వేస్‌లో దాదాపు 11 ఏళ్లు మెకానికల్ ఇంజినీర్‌గా చేసిన సంజీవ్ శర్మ ప్రస్తుతం స్పేస్ ఎక్స్‌లో పనిచేస్తున్నారు. ఆయన LinkedIn ప్రొఫైల్‌ వైరలవుతోంది. రైల్వేను వదిలి అమెరికా వెళ్లిన శర్మ తన ప్రతిభను కనబరిచి SpaceXలో ఉద్యోగం పొంది ప్రిన్సిపల్ ఇంజినీర్‌ స్థాయికి చేరుకున్నారు.

News October 17, 2024

రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్

image

రైల్వే టికెట్ బుకింగ్ నియమాలను మార్చుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రయాణ రోజు నుంచి 120 రోజుల ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ, నవంబర్ 1 నుంచి దీనిని కుదిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఇకపై IRCTCలో 60 రోజుల ముందు మాత్రమే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండనుంది. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎలాంటి సమస్య ఉండదు.

News October 17, 2024

రిలయన్స్ బోనస్ షేర్ల హిస్టరీ ఇదీ

image

రిలయన్స్ ఇండస్ట్రీస్ బోనస్ ఇష్యూకు 99.92% స్టేక్ హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో కంపెనీ అక్టోబర్ 28ని రికార్డు తేదీగా ప్రకటించింది. ఎలిజిబుల్ షేర్ హోల్డర్లకు 1:1 ప్రాతిపదికన బోనస్ షేర్లు జమ చేస్తారు. ఇప్పటి వరకు రిలయన్స్ ఐదు సార్లు బోనస్ షేర్లు ఇచ్చింది. 1980లో 3:5, 1983లో 6:10, 1997, 2009, 2017లో 1:1 రేషియోలో ఇచ్చింది. ప్రస్తుతం కంపెనీ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ రూ.50,000 కోట్లు.

News October 17, 2024

గ్రూప్-1 మెయిన్స్ వాయిదా డిమాండ్‌పై సాయంత్రం నిర్ణయం!

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలన్న డిమాండ్ నేపథ్యంలో అభ్యర్థులతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. జీవో 55 అమలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సాయంత్రం లోపు నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని పీసీసీ చీఫ్ చెప్పారు. సా.4 గంటలకు సీఎం రేవంత్ ప్రెస్ మీట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

News October 17, 2024

పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం: సీఎం చంద్రబాబు

image

AP: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని CM చంద్రబాబు అన్నారు. పెట్టుబడులకు AP స్వర్గధామమని చెప్పారు. కొత్త విధానాలతో పెట్టుబడిదారులకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. దేశంలో, APలో పెట్టుబడులకు ఇదే మంచి సమయమని, అభివృద్ధి ప్రయాణంలో తమతో సహకరించాలని కోరారు. వ్యాపార పరిధులు, రాష్ట్ర సామర్థ్యం విస్తరించుకునే అవకాశమిదని పేర్కొన్నారు. నూతన పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.