News April 11, 2024

బెంగాల్‌ను శాసించనున్న వనితలు

image

బెంగాల్‌లో ఈనెల 19న లోక్‌సభ తొలి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు పురుషులతో సమానంగా ఉంది. పురుషుల్లో 3.85 కోట్లు, మహిళల్లో 3.73కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2019తో పోలిస్తే వీరి సంఖ్య 9.8% పెరిగింది. గత ఎన్నికల్లో పురుషుల (81.35%)తో పోలిస్తే మహిళల పోలింగ్‌ శాతం (81.79%) ఎక్కువ. ఈ నేపథ్యంలో వనితల ఓటు ఎవరికనేది చర్చనీయాంశమైంది. <<-se>>#Elections2024<<>>

News April 11, 2024

ఒక్కదెబ్బతో పేదరికం పోగొడతాం: రాహుల్

image

పేదరిక నిర్మూలనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఒక్కదెబ్బతో పేదరికాన్ని పోగొడతామన్నారు. కుటుంబానికి ఒకరు చొప్పున పేద మహిళలకు అకౌంట్లో ఏటా రూ.లక్ష వేస్తామని దీంతో పేదరికానికి గుడ్‌బై చెప్పొచ్చని రాహుల్ పేర్కొన్నారు. మహాలక్ష్మి పేరుతో ఈ స్కీమ్ గురించి మేనిఫెస్టోలోనూ కాంగ్రెస్ ప్రస్తావించింది. పాంచ్ న్యాయ్ సహా 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది.

News April 11, 2024

ఆర్సీబీపై బుమ్రా అరుదైన రికార్డు

image

వాంఖడేలో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగారు. ఈక్రమంలో 2సార్లు హ్యాట్రిక్ మిస్ కావడం గమనార్హం. ఈ ప్రదర్శనతో ఐపీఎల్‌లో ఆర్సీబీపై 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బుమ్రా అవతరించారు. చివరిగా ఆశిష్ నెహ్రా CSK తరఫున 4 వికెట్లు తీశారు. ఇప్పటి వరకు బెంగళూరుపై అదే అత్యుత్తమం. ఇక ఐపీఎల్‌లో రెండుసార్లు 5 వికెట్లు తీసిన ఫాల్క్‌నర్, ఉనాద్కత్, భువనేశ్వర్ సరసన బుమ్రా చేరారు.

News April 11, 2024

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని నియమిస్తూ జీవో ఇచ్చింది. ఈ GO ఆధారంగా నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేయగా.. ఈ నెల 15న న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 11, 2024

అవనిగడ్డ ఎవరి అడ్డా!

image

AP: కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతమైన అవనిగడ్డ ఆరు మండలాలతో అతిపెద్ద నియోజకవర్గంగా ఉంది. 1962లో ఈ సెగ్మెంట్ ఏర్పడగా.. కాంగ్రెస్ ఏడు సార్లు, టీడీపీ 6 సార్లు, వైసీపీ ఒకసారి నెగ్గాయి. పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన పోటీ చేస్తోంది. టీడీపీ నుంచి పార్టీలో చేరిన సీనియర్ లీడర్ మండలి బుద్ధ ప్రసాద్‌ను జనసేన పోటీ చేయిస్తోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు మరోసారి బరిలో నిలిచారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 11, 2024

జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపారు: CBN

image

AP: జగన్ పాలనలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని.. కాపాడుకోకపోతే రాష్ట్రాన్ని శాశ్వతంగా దక్కించుకోలేమని చంద్రబాబు అన్నారు. ‘ఆరోగ్య శ్రీ కింద వైద్యం పడకేసింది. బటన్ నొక్కింది ఎంత? వైసీపీ వాళ్లు దోచింది ఎంత? భూపరిరక్షణ చట్టం పేరుతో ప్రజల భూమిని తాకట్టు పెట్టి ఇతరులకు బదిలీ చేసే ప్రమాదం ఉంది. జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపారు. మద్యం తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు తెచ్చారు’ అని ఆరోపించారు.

News April 11, 2024

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. EPFO వేతన పరిమితి పెంచనున్న కేంద్రం!

image

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఎకనమిక్ టైమ్స్ కథనంలో పేర్కొంది. వచ్చే కొత్త ప్రభుత్వంలో దీనిపై నిర్ణయం వెలువడొచ్చని తెలిపింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.15 వేలు కాగా ఆ మొత్తాన్ని రూ.21 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలైతే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంపైనా భారం పడుతుంది. అయితే EPFO ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరిగి ఉద్యోగులకు లాభం చేకూరుతుంది.

News April 11, 2024

రంజాన్‌ మాసంలో బిర్యానీదే అగ్రస్థానం

image

రంజాన్ మాసంలో బిర్యానీ ఆర్డర్లు భారీగా పెరిగినట్లు ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది. గత నెల 12 నుంచి ఈ నెల 8వరకు స్విగ్గీ ఆర్డర్ల జాబితాను సంస్థ విడుదల చేసింది. దాని ప్రకారం దేశవ్యాప్తంగా నెల రోజుల వ్యవధిలో 60 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. వాటిలో 10 లక్షలు హైదరాబాద్‌లోనే ఉండటం విశేషం. ఇక హలీమ్ ఆర్డర్లు 1454శాతం, ఫిర్ని 80.97శాతం, మాల్పువా 79.09శాతం పెరిగినట్లు స్విగ్గీ తెలిపింది.

News April 11, 2024

రఘునందన్‌రావుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

image

TG: మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌పై ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మోదీ ఫొటోలతో ఉన్న శ్రీరాముడి క్యాలెండర్లను ఓటర్లకు పంచారని ఆరోపించారు. ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరారు.

News April 11, 2024

IPL: చెలరేగిన బుమ్రా.. దినేశ్ కార్తీక్

image

వాంఖడేలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా నిప్పులు చెరిగారు. ఐదు వికెట్లతో కోహ్లీ అండ్ కోను వణికించారు. బెంగళూరు ఆటగాళ్లలో డుప్లెసిస్(61), పాటీదార్(50) రాణించగా చివరిలో దినేశ్ కార్తీక్(23 బంతుల్లో 53రన్స్) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 196 రన్స్ చేసింది. ముంబై బౌలర్లలో కొయేట్జీ, మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు.