News October 16, 2024

GHMC కమిషనర్‌గా ఇలంబర్తి

image

TG: ఏపీకి అలాట్ చేసిన ఐఏఎస్‌లను <<14375321>>రిలీవ్<<>> చేసిన ప్రభుత్వం వారి స్థానాల్లో సీనియర్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది. GHMC కమిషనర్‌గా ఇలంబర్తి, ఎనర్జీ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా, ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా శ్రీదేవి, టూరిజం అండ్ కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్, ఆరోగ్య శ్రీ సీఈవోగా ఆర్వీ కర్ణన్‌కు అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News October 16, 2024

ఐఏఎస్‌లను రిలీవ్ చేస్తూ TG ప్రభుత్వం ఉత్తర్వులు

image

ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌లను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాద్‌ను ఏపీకి అలాట్ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

News October 16, 2024

గ్రూప్-1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

image

TG: గ్రూప్-1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నియామకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపింది. నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తిస్థాయి వాదనల కోసం విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. కాగా ఈనెల 21 నుంచి మెయిన్స్ పరీక్షలున్నాయని, 3 నెలల్లో ఫలితాలు విడుదల చేస్తామని TGPSC కోర్టుకు తెలిపింది.

News October 16, 2024

SRH రిటెన్షన్స్: క్లాసన్‌కు రూ.23 కోట్లు?

image

IPL-2025 వేలానికి ముందు SRH రిటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్టును ESPNcricinfo విడుదల చేసింది. క్లాసన్‌కు ₹23 కోట్లు, కమిన్స్‌కు ₹18కోట్లు, అభిషేక్ శర్మకు ₹14కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకోవాలని SRH నిర్ణయించిందని పేర్కొంది. హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిని కూడా అంటిపెట్టుకోనుందని ఓ ఆర్టికల్‌ను ప్రచురించింది. కాగా ప్లేయర్ల రిటెన్షన్స్‌ను ఫైనల్ చేసేందుకు ఫ్రాంచైజీలకు ఇచ్చిన గడువు ఈనెల 31తో ముగియనుంది.

News October 16, 2024

ALERT: రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబాబాద్, సూర్యాపేట, మహబూబ్ నగర్, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, JGL, సిరిసిల్ల, HYD, మేడ్చల్, వనపర్తి, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, ములుగు, జనగాం, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 16, 2024

వచ్చింది తినమన్న జొమాటో.. జనం ఆగ్రహం

image

హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి జొమాటోలో చికెన్ మంచూరియా ఆర్డర్ పెట్టగా చికెన్-65 వచ్చింది. జొమాటో ప్రతినిధికి ఫిర్యాదు చేయగా, సమస్యను పరిష్కరించలేదు సరికదా వచ్చిన ఆర్డర్‌ తిని చూడాలంటూ సూచించారు. ఆమెకు నచ్చుతుందని ఉచిత సలహా ఇచ్చారు. ఆ స్క్రీన్ షాట్‌ను ఆమె నెట్టింట పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఆర్డర్ తప్పుగా డెలివర్ చేసి, పైగా అదే తినాలని చెప్పడమేంటంటూ జొమాటోపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

News October 16, 2024

సుభాష్ చంద్రబోస్ అన్న కుమార్తె కన్నుమూత

image

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్న శరత్ చంద్ర బోస్ కుమార్తె రోమా రే(95) స్వర్గస్థులయ్యారు. దక్షిణ కోల్‌కతాలోని వారి నివాసంలో వృద్ధాప్య కారణాలతో ఆమె కన్నుమూశారని కుటుంబీకులు తెలిపారు. రోమాకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, ఐదుగురు మనుమలు ఉన్నారు. స్వాతంత్ర్య సమరంలో నేతాజీ పోరాటానికి రోమా ప్రత్యక్ష సాక్షి. ఆయన భార్య ఎమిలీ షెంకిల్‌తోనూ రోమాకు స్నేహం ఉంది.

News October 16, 2024

రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: భారీ నుంచి అతిభారీ వర్షాలు వాతావరణ శాఖ కురుస్తాయన్న హెచ్చరికలతో రేపు పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు సెలవు ఉండనుంది. పలు జిల్లాల్లో కలెక్టర్లు సెలవు ప్రకటించినా విద్యాసంస్థలు నడపటంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News October 16, 2024

రాష్ట్రంలో ఈ రోడ్లకు మహర్దశ

image

APలో పలు రహదారులను కేంద్రం అభివృద్ధి చేయనుంది. కొండమోడు-పేరేచర్ల మధ్య 49.91K.M దూరాన్ని రూ.883.61కోట్లతో 4 లేన్లుగా అభివృద్ధి చేయనుంది. సత్తెనపల్లి, మేడికొండూరులో బైపాస్‌లు నిర్మించనుండడంతో, HYD-గుంటూరు మధ్య రాకపోకలకు సులువు అవుతుంది. సంగమేశ్వరం-నల్లకాలువ, వెలుగోడు-నంద్యాల మధ్య 62.571K.Mను రూ.601.14 కోట్లతో, నంద్యాల-కర్నూలు/కడప సరిహద్దుల మధ్య 62.01K.M దూరాన్ని ₹691.81 కోట్లతో అభివృద్ధి చేయనుంది.

News October 16, 2024

తెలంగాణలో రిపోర్టు చేసిన ఏపీ ఐఏఎస్‌లు

image

ఏపీ ఐఏఎస్‌లు సృజన, శివశంకర్ తెలంగాణ సీఎస్ శాంతికుమారికి రిపోర్ట్ చేశారు. తెలంగాణలో రిపోర్ట్ చేయాల్సిందిగా వీరిని డీవోపీటీ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్‌లు ఏపీకి వెళ్లనున్నారు. ఐపీఎస్‌లకు కేంద్ర హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో అంజనీ కుమార్, అభిలాష బిస్త్ TGలోనే కొనసాగనున్నారు.